India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామయంపేట(మం.) గ్రామంలో కూలీల కొరతతో భారంగా మారుతున్న వ్యవసాయాన్ని తనదైన రీతిలో మార్చి కూలీల అవసరం లేకుండానే ‘డ్రం సీడ్’ పరికరంతో వరి సాగు చేస్తున్నాడు దాకి వెంకటేశ్ అనే యువరైతు. మనుషులు చేత్తో వేసే వడ్లను ఇది భూమిలో వేసుకుంటూ వెళ్తుంది. ఈ పద్ధతి వల్ల పెట్టుబడి కొంతవరకు తగ్గి దిగుబడి ఆశాజనకంగా ఉందని తెలిపాడు. తోటి రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరించి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందాలని సూచిస్తున్నాడు.
మెదక్ జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజశేఖర్ కరీంనగర్లో జరుగుతున్న 3వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో బంగారు పతకాన్ని, సింగిల్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ను మెదక్ జిల్లా ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ అభినందించారు.
అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఏడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు మనసుపెట్టి చదువుకొని చదువులో జీవించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హైస్కూల్ లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులను ఏర్పాటు చేశారు. మార్చి 21న పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ప్రతి విద్యార్థి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఎంఈఓ ధనుంజయ, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మణ్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో MCC తక్షణమే అమలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) తక్షణమే అమలులోకి వస్తుందని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చు 3న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సమరానికి ప్రజారాజ్యం సిద్ధమని అన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామని.. కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దాసరి శ్యామ్ రావు, కర్ణాకర్ ఉదయ్ కుమార్, సామెల్ రాజ్ దేవయ్య ఉన్నారు.
బుధవారం రాత్రి పొలం పనులకు వెళ్లిన ఓ రైతు పొలంలో పడి మృతి చెందిన ఘటన చేగుంట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన యువరైతు గోపి తిరుపతి(26) పొలం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందారు. మృతుడికి భార్య స్వప్న, ముగ్గురు పిల్లలు ఉన్నారు. యువరైతు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి షి టీం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో షీటీమ్స్తో మహిళలకు, బాలికలకు, విద్యార్థినిలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో బాలికలకు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 8712657963, 6303923823 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
సిద్దిపేట జల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. బండరాళ్లు మీద పడి తల్లి సరోజన, కూమార్తె మమత అక్కడికక్కడే మరణించారు. బండరాళ్లు కిందపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కొల్చారం మండలంలో AEO గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆయన మాట్లాడుతూ 5వ సారి జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు, గ్రామస్థులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.