India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళలు మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చి ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షీ టీమ్స్ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరిలో ఆకతాయిలపై రెండు కేసులు నమోదు చేశామని, తూప్రాన్ సబ్ డివిజన్లో 11 మంది, మెదక్లో 18 మందిని కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు.
మెదక్ డీఈఓ రాధాకిషన్ను శనివారం PRTU TS జిల్లా శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడిన ఎమ్మార్సీలో సీఆర్పీల నియామకం, స్పౌజ్ బదిలీలతో ఏర్పడిన ఖాళీల విషయాన్ని జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో మాట్లాడుతూ.. మండల విద్యాధికారులతో మాట్లాడి సమస్య త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు. పీఆర్టీయూ నాయకులు సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
రామాయంపేటలోని పెద్దమ్మ గుడి వద్ద ప్రేమ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల కథనం ప్రకారం.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మామిడాల వినయ్, రామాయంపేటకు చెందిన రేవతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య వినయ్ పెట్టడంతో శనివారం రేవతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబీకులు ముందుకొచ్చి రేవతి, వినయ్ పెళ్లి చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టబద్రుల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని నిన్న ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ, కేసీఆర్ సొంత ఇలాకాలో బీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో గల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 1 జనవరి 2025 నుంచి 31 జనవరి వరకు ఆపరేషన్ స్మెల్-XI నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 122 మంది బడి మానేసి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించామన్నారు.
మెదక్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మెల్ -11 నిర్వహించి 122 మంది పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బడి మానేసినా, వివిధ దుకాణాలు, కర్మాగారాలు, ఇటుక భట్టిల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి, రెస్క్యూ చేసి వారికి, వారి తల్లితండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మారాడని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి హైదరాబాదులోని గాంధీభవన్లో ఖండించారు. రియల్ ఎస్టేట్ కొంపముంచింది కేసీఆరేనని విమర్శించారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ను కేసీఆర్ నాశనం చేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.