India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ వైద్యాధికారి డా. శ్రీరామ్ అన్నారు. పాపన్నపేట PHCని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రోగులకు మందుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో చందర్, క్రాంతి, శారద తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZP, మండల పరిషత్, మోడల్ స్కూల్, KGBV పాఠశాలల ప్రిన్సిపల్స్, HMలు, టీచర్లు అర్హులని చెప్పారు. HM/ప్రిన్సిపాల్ 15, ఇతర టీచర్లకు10 ఏళ్ల సర్వీస్ ఉండాలన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 30 లోపు DEO ఆఫీస్లో అందజేయాలన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబర్ 5న సత్కరించనున్నట్లు తెలిపారు.
‘మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడదాం’ అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.
చిన్నశంకరంపేట మోడల్ స్కూల్లో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌసెస్ క్యాప్టెన్, వైస్ కెప్టెన్, కల్చరల్, డిసిప్లేన్ కమిటీల ఇన్ఛార్జుల ప్రమాణ స్వీకారం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వాణి కుమారీ తెలిపారు. కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శశిధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్, కమిటీ ఫీర్మన్ స్రవంతి హాజరయ్యారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రదర్శన ఆకట్టుకుంది.
మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ ఫోన్ ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు చేసిన ఫిర్యాదులు, సూచనల మేరకు పని చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాని, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని ఆమె పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలోని ఈ నెల 25న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ షెడ్యూల్ నిర్వహణ ఉండడం వల్ల జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ (TLM) మేళాను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. మేళా కొత్త తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని డీఈవో సూచించారు.
NMMS స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఆగస్టు 30తో ముగియనుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఇంకా NSP పోర్టల్లో నమోదు చేయని విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. ప్రీ-ఎన్రోల్ అభ్యర్థులను ప్రధానోపాధ్యాయులు, ఐఎన్ఓలు అర్హత నిబంధనల ప్రకారం ఆథరైజ్ చేయాలని కోరారు. గడువు దాటితే స్కాలర్షిప్ మంజూరుకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతిలో భాగంగా మెదక్ జిల్లాకు 23 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అలాట్ అయ్యారు. ఇందులో శుక్రవారం 22 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారు బాధ్యతలు చేపట్టారు. జిల్లాల వారీగా మెదక్-9, ఖమ్మం-6, సిద్దిపేట -4, హన్మకొండ-2, కొత్తగూడెం, కామారెడ్డి ఒక్కొక్కరు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి సర్ధన హై స్కూల్ పోస్టింగ్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు జాయిన్ కాలేదు. 15 రోజుల సమయం ఉంది.
మార్చి, జూన్ 2025లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లు లాంగ్ మెమోలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేరాయని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సర్టిఫికెట్లు అందిన విషయాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ధారించి, సంబంధిత MEOలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవైనా సర్టిఫికెట్లు రాకపోతే వెంటనే వివరాలు ACGEకి పంపాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.