Medak

News July 13, 2024

మెదక్‌ జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు

image

వర్షాకాలం మొదలు కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. నాటువేసే సమయం అయిపోతుందనే ఉద్దేశంతో గ్రామాల్లోని కొందరు యూపీ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలను పిలిపించి నాట్లు వేయిస్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా నాట్లు వేస్తున్న కూలీల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.4500 చొప్పున తీసుకుని వేగంగా నాటేస్తుండడంతో రైతులు వీరి వైపే మొగ్గు చూపుతున్నారు.

News July 13, 2024

సంగారెడ్డి: ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కేసు

image

ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు మహిళలపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు మాధవి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌కు చెందిన అనూరాధ, జహీరాబాద్‌కు చెందిన మరియమ్మపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్.భాస్కర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సు, ఎఎన్ఎం ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నకిలీ ఉత్తర్వులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

News July 13, 2024

మెదక్: తాను చనిపోతూ.. నలుగురికి ప్రాణదానం

image

నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ లైన్‌ఇన్ స్పెక్టర్ శేరి శంకర్ తాను చనిపోతూ నలుగురికి ప్రాణదానం అందించారు. ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు గాయపడగా బ్రెయిన్ డెడ్ అయింది. కిమ్స్ వైద్యులు జీవన్ దాన్ ట్రస్ట్ గ్రీన్ ఛానల్ ద్వారా శంకర్ ఆర్గాన్స్ సేకరించారు. ముందుగానే భార్య పద్మ, కుమారులకు పరిస్థితి తెలిపి అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు సహకరించడంతో ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

News July 13, 2024

ఎర్ర‌వెల్లిలో హిమాన్షు బర్త్‌డే వేడుక‌ల్లో కేసీఆర్

image

కేటీఆర్ కొడుకు హిమాన్షును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో హిమాన్షు త‌న‌ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వ‌దించారు. హిమాన్షు 19వ ఏట‌ అడుగు పెట్ట‌డంతో..19 కిలోల కేక్‌ను కుటుంబ స‌భ్యులు క‌ట్ చేయించారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుక‌ల్లో కేసీఆర్ దంప‌తులు, కేటీఆర్ దంప‌తులు, అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

News July 12, 2024

ఎర్ర‌వెల్లిలో హిమాన్షు బర్త్‌డే వేడుక‌లు..ఆశీర్వదించిన కేసీఆర్

image

కేటీఆర్ కొడుకు హిమాన్షును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో హిమాన్షు త‌న‌ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వ‌దించారు. హిమాన్షు 19వ ఏట‌ అడుగు పెట్ట‌డంతో..19 కిలోల కేక్‌ను కుటుంబ స‌భ్యులు క‌ట్ చేయించారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుక‌ల్లో కేసీఆర్ దంప‌తులు, కేటీఆర్ దంప‌తులు, అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

News July 12, 2024

కంది: ఉపాధ్యాయురాలి సస్పెండ్

image

సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు తన్వీర్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని దండించారని తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. మండల విద్యాధికారి నివేదిక ఆధారంగా టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 12, 2024

చదువుకున్న వాళ్లకు పోటీ పరీక్షల విలువ తెలుస్తుంది: MP రఘునందన్

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. HYDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట మాట్లాడుతోందన్నారు. గ్రూప్ 1 పోస్టులు తక్కువ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులు మాత్రమే పెంచిందని పేర్కొన్నారు.

News July 12, 2024

సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు లేఖ

image

సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని హరీశ్‌ రావు విమర్శించారు. సంక్షేమ పరిషత్‌ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. విద్య, ఉపాధి వంటి పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అగమ్యగోచరంగా కావడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.

News July 12, 2024

MDK: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ లక్షలు కాజేసింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంది. స్టాఫ్ నర్సు, క్లర్క్ జాబ్ అంటూ నమ్మించి 28 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున వసులు చేసి ఫోర్జరీ సంతకాలతో నకిలీ జాబ్ ఆర్డర్లు ఇచ్చింది. పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయట పడింది. 

News July 12, 2024

సిద్దిపేట: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు

image

సిద్దిపేట జిల్లాలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు చేర్యాల సీఐ శ్రీను తెలిపారు. మద్దూరు మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గీసుకొండ మండలం రెడ్డిపాలెంకు చెందిన కొండేపోగు మధుబాబు (23) కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్టు వివరించారు. ఈ ఘటనలో మధుబాబును నిన్న అరెస్టు చేసినట్లు సీఐ శ్రీను వివరించారు.