India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆనాడు PCC చీఫ్ రేవంత్ రెడ్డి ఉండి రైతు బంధును ఆపి, నేడు CM హోదాలో ఉండి KCR రైతుబంధు ఇవ్వలేదని బద్నాం చేస్తున్నారన్నారు. 2 రోజుల్లో రైతుల అకౌంట్లో రైతుబంధు డబ్బులు పడతాయని నవంబర్ 25, 2023 పాలకుర్తి పబ్లిక్ మీటింగ్లో నేను చెబితే, మరుసటి రోజు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపలేదా ? అని ప్రశ్నించారు.
మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 1నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రొ. రాధాకిషన్ సూచించారు. ‘కలాం స్ఫూర్తి యాత్ర’ పేరిట చేపట్టిన ‘ఫ్లో బస్సు’ (ఫ్యూ చరిస్టికల్ ల్యాబ్ ఆన్ వీల్స్) శుక్రవారం మెదక్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోగా ఆయన ప్రారంభించారు. ఫ్లో బస్లో సాంకేతిక రంగానికి సంబంధించిన వీఆర్ జోన్, వెదర్ స్టేషన్, రోబోటిక్స్ జోన్, మేకర్ స్పేస్, ఏఆర్ జోన్, ఐఓటీ జోన్ ప్రదర్శించారు.
రామయంపేట(మం.) గ్రామంలో కూలీల కొరతతో భారంగా మారుతున్న వ్యవసాయాన్ని తనదైన రీతిలో మార్చి కూలీల అవసరం లేకుండానే ‘డ్రం సీడ్’ పరికరంతో వరి సాగు చేస్తున్నాడు దాకి వెంకటేశ్ అనే యువరైతు. మనుషులు చేత్తో వేసే వడ్లను ఇది భూమిలో వేసుకుంటూ వెళ్తుంది. ఈ పద్ధతి వల్ల పెట్టుబడి కొంతవరకు తగ్గి దిగుబడి ఆశాజనకంగా ఉందని తెలిపాడు. తోటి రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరించి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందాలని సూచిస్తున్నాడు.
మెదక్ జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజశేఖర్ కరీంనగర్లో జరుగుతున్న 3వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో బంగారు పతకాన్ని, సింగిల్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ను మెదక్ జిల్లా ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ అభినందించారు.
అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఏడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు మనసుపెట్టి చదువుకొని చదువులో జీవించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హైస్కూల్ లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులను ఏర్పాటు చేశారు. మార్చి 21న పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ప్రతి విద్యార్థి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఎంఈఓ ధనుంజయ, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మణ్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో MCC తక్షణమే అమలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) తక్షణమే అమలులోకి వస్తుందని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చు 3న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సమరానికి ప్రజారాజ్యం సిద్ధమని అన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామని.. కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దాసరి శ్యామ్ రావు, కర్ణాకర్ ఉదయ్ కుమార్, సామెల్ రాజ్ దేవయ్య ఉన్నారు.
బుధవారం రాత్రి పొలం పనులకు వెళ్లిన ఓ రైతు పొలంలో పడి మృతి చెందిన ఘటన చేగుంట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన యువరైతు గోపి తిరుపతి(26) పొలం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందారు. మృతుడికి భార్య స్వప్న, ముగ్గురు పిల్లలు ఉన్నారు. యువరైతు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.