Medak

News January 21, 2025

కాంగ్రెస్ ప్రజాపాలనపై హరీశ్ రావు సీరియస్

image

ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని అన్నారు.

News January 21, 2025

పదేళ్ల BRS పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా..?: మంత్రి పొన్నం

image

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు అయిన ఇచ్చారా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఇప్పుడు మేము కార్డులు ఇస్తామంటే రాద్ధాంతం చేస్తున్నారన్నారని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని.. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు. అర్హత ఉండి రాని వారు గ్రామ సభలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 21, 2025

రైల్వే ట్రాక్‌పై సిద్దిపేట జిల్లా అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

జామై ఉస్మానియాలో ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రత వివరాలు.. కోహీర్ 7.0, ఆల్గోల్, న్యాల్కల్ 8.4, నల్లవల్లి 8.8, మల్చల్మ 9.0, కంకోల్ 9.1, సత్వార్ 9.2, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 9.4, నిజాంపేట, ఝరాసంఘం, దిగ్వాల్ 9.6, కల్హేర్ 9.8, కంగ్టి 9.9, అంగడికిష్టాపూర్, లక్ష్మీసాగర్, మొగుడంపల్లి 10.2, కొండపాక, గౌరారం, జహీరాబాద్ 10.3, పోతారెడ్డిపేట, బేగంపేట 10.4, శివంపేట 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 21, 2025

మెదక్: గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ప్రారంభించనున్న నాలుగు పథకాలపై గ్రామ/వార్డు సభల నిర్వహణపై సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిర్వహిస్తోన్న క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా వేగవంతం చేయాలన్నారు.

News January 20, 2025

మనోహరాబాద్: మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నం

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని పాత బావిలో కుళ్లిపోయిన వ్యక్తి శవం లభ్యమైంది. శవాన్ని గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ రోడ్డులో పాత బావిలో శవాన్ని గుర్తించినట్లు వివరించారు. కుళ్లిపోయిన శవాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.

News January 20, 2025

మెదక్: పెరుగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ 8.9, జహీరాబాద్ 9.9, న్యాల్కల్ 10.2, మెదక్ జిల్లాలోని టేక్మాల్ , నార్సింగి 12.2, రామాయంపేట 12.4, సిద్దిపేట జిల్లాలోని కొండపాక 10.9, మార్కూక్ 11.2, మిర్దొడ్డి 12.0°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News January 20, 2025

MDK: రద్దీగా మారిన బస్టాండ్లు

image

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు గత 3 రోజులుగా ప్రయాణికులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో HYDలో చదువుతున్న విద్యార్థులు, పని నిమిత్తం ప్రజలు భారీగా తరలివెళ్లడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, తూప్రాన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

News January 20, 2025

మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి

image

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.

News January 19, 2025

డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు

image

సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.

error: Content is protected !!