Medak

News July 11, 2024

అమ్మా ఆకలేస్తుంది.. నాన్న నిద్రొస్తుంది లే.. చిన్నారుల కన్నీటి మాటలు

image

అమ్మా లే ఆకలేస్తుందమ్మా.. నాన్నా లే నిద్రిస్తుందిలే నాన్నా.. అంటూ చిన్నారులు <<1360251>>తల్లిదండ్రుల మృతదేహాల<<>> వద్ద అంటున్న మాటలు పలువురిని కంట తడి పెట్టించాయి. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన దంపతులు కరకపట్ల శేఖర్, సౌమ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం ఇంటికి వచ్చిన మృతదేహాల వద్ద లెమ్మంటూ చిన్నారులు శివాన్స్, బంటు మాటలు పలువురిని కన్నీరు పెట్టించాయి.

News July 11, 2024

సిద్దిపేట: టీచర్ల పాదాలు కడిగి వీడ్కోలు

image

సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ యూపీఎస్ పాఠశాలలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఉపాధ్యాయులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు టీచర్ల కాళ్లు కడిగారు. పాఠశాలలలో 43 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయులు శైలజ, హరిత, భాగ్యమ్మ, శ్రీకాంత్ కృషితో ప్రస్తుతం ఆ సంఖ్య 178 మందికి చేరిందని చెప్పారు.

News July 11, 2024

సంగారెడ్డి: గ్రూప్-1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 17 వరకు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థి కుటుంబ వార్షికోత్సవం రూ.5 లక్షల లోపు ఉండాలని చెప్పారు. కోచింగ్ సమయంలో నెలకు రూ. 5000 స్టైపాండ్ చెల్లిస్తారని తెలిపారు.

News July 10, 2024

తూప్రాన్: రాజధాని బస్సులో భారీ నగదు చోరీ

image

తూప్రాన్ పట్టణ శివారులోని హైవే బైపాస్‌లో రాజధాని బస్సులో భారీ నగదు చోరీ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొంపల్లికి చెందిన మసాలా వ్యాపారి అమీన్ అబ్దుల్ లాలా నిజామాబాద్ నుంచి రాజధాని ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షల నగదుతో కొంపల్లికి వెళ్తున్నారు. తూప్రాన్ దాబా వద్ద బస్సు ఆగగా భోజనానికి దిగి వచ్చే సరికే నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది.

News July 10, 2024

HYD ఈస్ట్ జోన్‌కు మెదక్ ఎస్పీ బదిలీ

image

మెదక్ ఎస్పీ డా.బి. బాలస్వామి బదిలీ అయ్యారు. బాలస్వామి జనవరి 6న మెదక్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. తాజాగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఈస్ట్ జోన్, హైదరాబాద్‌‌కు బదిలీ చేస్తు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో మెదక్ నూతన ఎస్పీగా డి. ఉదయ్‌కుమార్ రెడ్డిని నియమించారు. మెదక్‌లో ఇటీవల జరిగిన అల్లర్లే ఎస్పీ డాక్టర్ బాలస్వామి బదిలీకి కారణంగా జిల్లాలో చర్చనీయాంశమైంది.

News July 10, 2024

సంగారెడ్డి: రేపటి టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం వాయిదా

image

ఈనెల 11న నిర్వహించాల్సిన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ బుధవారం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తున్నందున సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 10, 2024

సిదిపేట: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య !

image

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్(31), సౌమ్య మణి(28) దంపుతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News July 10, 2024

గంగాపూర్: అంబులెన్స్‌లో ప్రసవం..

image

హవేలి ఘనపూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మన్నె మల్లేశం భార్య కల్పనకు పురిటి నొప్పులు రాగా అంబులెన్స్‌కు సమాచారం తెలిపారు. మెదక్ MCH ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కాగా EMT శ్రీహరి డెలివరీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని మెదక్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. పైలెట్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News July 10, 2024

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా: మాజీ ఎంపీ

image

గెలుపు ఓటములతో సంబందం లేకుండా ప్రజల సమస్యల పరిష్కారానికై పోరాడుతానని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా నా విజయం కోసం శక్తివంచన లేకుండా అహర్నిశలు కష్టపడి పని చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నాపై నమ్మకంతో ఓట్లు వేసిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. కార్యకర్తలకు ఏ సమస్యా వచ్చిన అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

News July 10, 2024

మెదక్: పశువుపై చిరుత దాడి

image

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద చిరుత పులి సంచరిస్తుందని రైతులు తెలిపారు. గత రాత్రి గ్రామానికి చెందిన ఇప్ప రాజు అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద పశువుపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్ళిన రైతులు పశువును చూసి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత పులి సంచారంపై స్థానికులు భయాందోళన గురవుతున్నారు.