Medak

News July 10, 2024

సిద్దిపేట: విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలు

image

అక్కన్నపేట మండలంలో విద్యార్థులు లేకపోవడంతో 11 పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ చేశారు. విద్యార్థులు లేకపోవడంతో కొన్ని, గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురి అవ్వడంతో కొన్ని పాఠశాల మూతపడ్డాయి. గుడాటిపల్లి, సోమాజితండా, తెనుగుపల్లి, గౌరవెల్లి, పంచరాయితండా, దేవానాయక్ తాండ, బంగారులొద్ది తాండ, చౌటకుంట తండా, రంగన్న కుంట పాఠశాలలు మూతపడ్డాయి.

News July 10, 2024

సంగారెడ్డి: ప్రతిరోజు మధ్యాహ్న భోజన వివరాలను పంపాలి

image

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వివరాలను ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 10 నుంచి ప్రతి రోజు ఫోటో తప్పనిసరిగా పంపాలని చెప్పారు. విద్యార్థి పూర్తి వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రధానోపాధ్యాయులకు మెమో జారీ చేస్తామని తెలిపారు.

News July 10, 2024

సంగారెడ్డి: ‘ప్రతిభతో ఉద్యోగాలు సాధించాలి’

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగావకాశాల సాధ్యమని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జ్యోతి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను ఆమె ప్రారంభించారు. చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

News July 10, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టరేట్లో లింగ నిర్ధారణ చట్టం పైన జిల్లాస్థాయి మల్టీ మెంబర్ కమిటీ సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా వేయనున్నట్లు తెలిపారు.

News July 9, 2024

MDK: వే2న్యూస్ ఎఫెక్ట్.. ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు

image

రామాయంపేట మండలం కోమటిపల్లి మోడల్ స్కూల్‌లో <<13593942>>ఫుడ్ పాయిజన్<<>> ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ‘ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత’ అని Way2Newsలో వచ్చిన కథనంపై పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి స్పందించారు. ఈ ఘటనలో నలుగురిపై చర్యలు తీసుకున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. వంట మనిషి, సహాయకులను వీధుల నుంచి తొలగిస్తూ, కేర్ టేకర్, హాస్టల్ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

News July 9, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

image

ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే లక్ష జరిమానాలతో పాటు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. సమావేశంలో ఎస్పీ రూపేష్, వైద్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 9, 2024

మెదక్: గట్టు పంచాయితీ.. కట్టేసి కొట్టారు !

image

కొల్చారం మండలం సంగాయి పేట గ్రామంలో ఇరువు వర్గాల మధ్య గట్టు పంచాయితీ తలెత్తింది. మాట మాట పెరిగి ఘర్షణ జరగడంతో ఒకరి తలకు తీవ్రంగా గాయం కాగా రక్తస్రావమైంది. మరొకరిని రేకుల షెడ్డు పైపుకు తాడుతో కట్టేసి కొట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కుల్చారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 9, 2024

కేసీఆర్‌పై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

image

మాజీ సీఎం కేసీఆర్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు బీఆర్‌ఎస్‌ ధూళిమిట్ట మండల యూత్‌ అధ్యక్షుడు సాయిలు ఆధ్వర్యంలో పలువురు మద్దూరు ఏఎస్సై జగదీశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ఆదిత్యచౌదరి రాయుడు అనే వ్యక్తి మద్యం సీసాలతో కూడిన కుర్చిలో కూర్చున్నట్లు కేసీఆర్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

News July 9, 2024

సంగారెడ్డి: విజ్ఞాన్ మంథన్‌కు దరఖాస్తు చేసుకోవండి

image

జిల్లాలోని 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు విజ్ఞాన్ మంథన్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 15లోగా www.vvm.org.in వెబ్ సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రభుత్వం అందిస్తుందన్నారు.

News July 9, 2024

సంగారెడ్డి: చట్నీలో ఎలుక ఘటనపై అదనపు కలెక్టర్ ఫైర్

image

సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూలో చట్నీలో ఎలుక ఘటనపై అదనపు కలెక్టర్ మాధురి స్పందించారు. క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆమె కిచెన్‌లో అపరిశుభ్రంగా ఉంటడంతో ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. విద్యార్థులే కావాలని చట్నీలో ఎలుకను వేశారని ప్రిన్సిపల్ చెప్పగా తినే ఆహారంలో ఎందుకు వేస్తారని అదనపు కలెక్టర్ నిలదీశారు