India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యోగుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 342 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, కేవలం 208 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నిత్యం పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభించిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం నామమాత్రంగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. బ్యానర్ ప్రదర్శిస్తూ ఇంటింటి చెత్త సేకరణ గురించి ఊదరగొడుతూ ఫొటోలు దిగి గంట వ్యవధిలో కార్యక్రమం ముగించి మమ అనిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి ప్రణాళికా రూపొందించకుండా మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా మారిందని పలువురు అంటున్నారు.
NLG పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథ స్వామి తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అర్హత కలిగి మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్షియల్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈనెల 28 లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.
పోలీసు శాఖలో పురుషులతో సమానంగా విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించేందుకు ‘SHE leads-NALGONDA believes’ కార్యక్రమం ద్వారా వారం రోజుల పాటు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈ శిక్షణలో నేర పరిశోధన, బ్లూ క్లోట్స్, రాత్రి గస్తీ, బందోబస్తు విధుల్లో వారికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడే మెలకువలు నేర్పించామని తెలిపారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రాథమిక ఆదాయం కలిగిన 18 – 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ పెద్ద సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమయంలో ఒకేసారి రూ.20 వేలు నగదు సహాయాన్ని కుటుంబానికి అందిస్తామన్నారు.
నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 26న ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీ క్యాంపస్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మ తెలిపారు. ఈ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పనిచేయవలసి ఉంటుందని ఆమె చెప్పారు. మరిన్ని వివరాలకు 7893420435, 7095612963 నంబర్లను సంప్రదించాలని కోరారు.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతతతో, శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని శనివారం పేర్కొన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మండపాల వద్ద మద్యం సేవించరాదని పేర్కొన్నారు.
కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యాపారుల్లో కదలిక ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లిక్కర్ వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లుగా కొనసాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం సర్కారుకు కనకవర్షం కురిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 335 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈసారి వైన్ షాపు దరఖాస్తు ధర పెంచడంతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
చింతపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న గార్లపాటి రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. సిలిండర్ పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఆగష్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, 7032415062 నెంబర్ సంప్రదించాలన్నారు
Sorry, no posts matched your criteria.