Nalgonda

News April 13, 2025

NLG: దరఖాస్తు చేసుకోలేకపోయాం.. గడువు తేదీ పొడగించండి!

image

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఈనెల చివరి వరకు పొడిగించాలని జిల్లాలోని యువకులు కోరుతున్నారు. చాలామంది వివిధ కారణాలతో పాటు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తోంది. చాలామంది యువకులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలను తీసుకోలేకపోయారు. ప్రభుత్వం స్పందించి గడువు తేదీని పొడిగించాలని కోరుతున్నారు.

News April 13, 2025

నల్గొండ జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు

image

జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం దామరచర్ల మండలంలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా చింతపల్లి మండలం గోడకండ్లలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బీబీనగర్ బొమ్మలరామారంలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 12, 2025

మద్యం మత్తులో డ్రైవర్.. ఇటుకల లారీ పల్టీ

image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో శనివారం లారీ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వైపు ఇటుకల లోడ్‌తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో పెద్దకాపర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ బోల్తా పడిన లారీ ముందు మద్యం మత్తులో నిద్రపోవడం గమనార్హం.

News April 12, 2025

NLG: ఆస్తికోసం కూతురిని చంపిన సవతి తల్లి

image

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.

News April 12, 2025

NLG: 8సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ’

image

ఈ నెల రెండవ శనివారం, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలైనప్పటికీ రాజీవ్ యువశక్తి పథకం కింద దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలలో స్పష్టం చేశారు. రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువత స్వయం ఉపాధి పొందేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

News April 11, 2025

NLG: కూతురిని చంపిన కేసు.. తల్లికి ఉరి శిక్ష

image

సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతురిని చంపిన కేసులో తల్లికి కోర్టు ఉరి శిక్ష విధించింది. కూతరుకు మతిస్థిమితం లేకపోవడంతో ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. మోతె మండలం మేకలపాటి తండాలో ఏప్రిల్ 2021లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి విచారణ జరగుతుండగా తాజాగా భానోత్ భారతికి కోర్టు శిక్ష విధించింది.

News April 11, 2025

నల్గొండ: ‘తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు’

image

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే నినాదాలు చేయరాదన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిదిలో డీజేలకు అనుమతి లేదని పోలీసువారి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News April 11, 2025

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని చీఫ్ ఇంజనీర్(ఇరిగేషన్), NLG డివిజన్ పరిధిలోని కార్యాలయంలో లష్కర్(229), హెల్పర్(56) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి జిల్లా ఉపాది కల్పన కార్యాలయంలో ఎంప్యానెల్ అయినటువంటి ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.

News April 11, 2025

17లోగా పేర్లు నమోదు చేసుకోవాలి: డీఈవో భిక్షపతి

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 19న నిర్వహించే ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంలో భాగంగా నిర్వహించే ఆర్యభట్ట స్వర్ణజయంతి ఉత్సవాల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్లో ఈ నెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 11, 2025

NLG: కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం కొరత

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం కొరత ఏర్పడింది. రేషన్ కార్డు దారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి పలు పనుల నిమిత్తం పట్టణాల్లో నివసిస్తుంటారు. అలాంటి వారు కూడా పట్టణంలోని పలు షాపుల్లో సన్నబియ్యం తీసుకోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 31,22,941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.