Nalgonda

News April 9, 2025

చిట్యాల: 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్రా రాఘవరెడ్డి

image

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి 1967, 1978, 1983, 1984, 1989, 1994 సంవత్సరాలలో నకిరేకల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమలమ్మ రామ్ రెడ్డి దంపతులకు జన్మించిన రాఘవరెడ్డి ఎన్నో ఉద్యమాలలో ప్రజా సమస్యలపై కీలకంగా పని చేశారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై తీవ్రంగా విరుచుకు పడేవారు. నేడు రాఘవరెడ్డి వర్ధంతి.

News April 9, 2025

నల్గొండ జిల్లాలో CONGRESS VS BRS

image

నల్గొండ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

News April 9, 2025

NLG: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసి, షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

image

చైల్డ్ పోర్న్ వీడియోలు చూసి ఇతర గ్రూప్‌లకు షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. CI రాజు తెలిపిన వివరాలు.. హుజూర్‌నగర్ గాంధీ పార్క్ చౌరస్తాకు చెందిన శ్రీనివాసరావు నాలుగేళ్లుగా సెల్‌ ఫోన్‌‌లో చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. వాటిని డౌన్‌లోడ్ చేసి ఇతర గ్రూప్‌లకు షేర్ చేయడంతో సైబర్ సెక్యూరిటి అధికారులు గమనించి HNR పీఎస్‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

News April 8, 2025

ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

image

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్‌పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2025

NLG: రైతులను వేధిస్తున్న సర్వేయర్ల కొరత

image

జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉండడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. సర్వేకు దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ తగాదాలు తీరాలన్న.. గట్టు పంచాయతీలు వచ్చిన భూ సర్వే చేసి పరిష్కరిస్తారు. కాగా జిల్లాలో సర్వేయర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2025

నల్గొండ జిల్లాలో 40 డిగ్రీల దాటిన ఎండ !

image

నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40.01 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News April 8, 2025

NLG: వైద్య ఆరోగ్యశాఖలో అద్దె వాహనాలకు ఆహ్వానం

image

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్సైట్స్ ను పరిశీలించాలని సూచించారు.

News April 8, 2025

MGUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 10 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.

News April 8, 2025

NLG: రైతు ఖాతాల్లో రూ.419.21 కోట్లు జమ!

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి రైతు భరోసా ఇప్పటి వరకు జిల్లాలో 4.33 లక్షల మంది రైతులకు అందింది. మొత్తం రూ.419.21 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమయింది. నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే ప్రభుత్వం రైతు భరోసా అందించింది. ఇంకా సుమారు 2 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 4 విడతల్లో రూ.419.21 కోట్లు జమ చేసినట్లు డీఈవో పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News April 8, 2025

NLG జిల్లా ప్రజలపై రూ.3 కోట్ల భారం !

image

మరోసారి వంటగ్యాస్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రస్తుతం రూ.875గా ఉన్న సిలిండర్ ధర సవరించిన ధర రూ.50లతో కలిపి రూ.925కు చేరింది. ప్రస్తుతం రూ.503గా ఉన్న ఉజ్వల్ సిలిండర్‌కు కూడా పెంపు వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఉజ్వల్ సిలిండర్ రూ.553కు చేరుకోనుంది. జిల్లా ప్రజలపై సుమారు 3 కోట్లకు పైగా భారం పడనుంది.