India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ పట్టణంలో పలు వార్డులలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వినాయకుని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల బాలుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో జరిగింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత పుట్టిన బాబు మృతితో బాధితులు తీవ్ర రోదనకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అవసరమైన సొంత భవనాలు లేక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. అనేక మండలాల్లో ప్రస్తుతం ఇవి అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, పాత గదులలో కొనసాగుతున్నాయి. నల్గొండ పట్టణంలోని చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకుగా, అరకొర వసతులున్న ఆ భవనాల్లో చిన్నారులను ఆడించాలన్నా, వారికి భోజనం పెట్టాలన్న, చదువు చెప్పాలన్నా ఇబ్బందిగా మారింది.
రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామ శివారులో క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. కూడలికి చెందిన బానోతు హీరా వాటర్ మోటర్ తీయబోయి నీళ్లలో చిక్కుకుని మరణించాడు. గతంలో అదే క్వారీలో మిడతనంపల్లికి చెందిన ముగ్గురి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. హీరా మృతితో విషాదం అలుముకుంది.
నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ, వాయు సర్వేక్షన్లో 2024లో రెండో స్థానం సాధించడంతో రూ.25 లక్షల ప్రోత్సాహకం లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం బజానా చేతుల మీదుగా ఈరోజు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… నల్గొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
జిల్లాలో గతంలో మాదిరి ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరుపనున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే సమకూర్చారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బందిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎన్నికల విధులకు అధికారులను, సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల, అధికారుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించారు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎంఈడి, బీఈడీ కళాశాలలో చదివే విద్యార్థులకు సెమిస్టర్ 2 రెగ్యులర్ పరీక్షలను ఈనెల 26 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్నట్లు సిఓఈ ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల షెడ్యూళ్లను ఆయన విడుదల చేశారు. వర్సిటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడైన వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32 వేల 276 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో: 1,55,845 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో : 72,845 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 589.70 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312 టీఎంసీలుండగా ప్రస్తుత 311.1486 టీఎంసీల నీరుంది.
Sorry, no posts matched your criteria.