India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరెంట్ షాక్తో ఎనిమిది గొర్రెలు మృతిచెందిన ఘటన గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బండారు వెంకటయ్య గొర్రెలను మేపేందుకు ఏఎమ్ఆర్పీ కాల్వ వద్దకు వెళ్లాడు. కాల్వలో అమర్చిన మోటారుకు విద్యుత్ సరఫరా అవుతుండడంతో అక్కడికి వెళ్లిన గొర్రెలకు విద్యుత్ షాక్ తగిలింది. ఎనిమిది గొర్రెలు మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
జిల్లాలోని ప్రభుత్వ పశు వైద్యశాలల్లో వైద్యం అందని ద్రాక్షగా మారింది. అత్యవసర సమయాల్లో పశువులకు వినియోగించే మెడిసిన్తో సహా విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి పలురకాల మందుల సరఫరా కొన్ని నెలలుగా నిలిచిపోయింది. ఫలితంగా జీవాల పెంపకందారులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూగజీవాల సంరక్షణ గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త వైన్స్కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది NOV 30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 DEC 1 నుంచి 2027 NOV 30 వరకు కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం టెండర్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 155 వైన్స్లు ఉన్నాయి.
జిల్లాలోని అన్నీ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల జాతర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ‘పనుల జాతర -2025’ లో భాగంగా ఈనెల 22న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ. 3750.86 లక్షలతో 3918 పనులకు అనుమతులు ఇచ్చినట్లు డీఆర్డీఓ వై. శేఖర్ రెడ్డి తెలిపారు.
నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జులై చివరి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవగా.. ఆగస్టు తొలి వారం నుంచి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసి అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 399 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇకపై బియ్యంతో పాటు పర్యావరణహిత సంచులను అందించనుంది. జిల్లాలోని 4.66 లక్షల కార్డులకు ఈ సంచులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ నెల బియ్యం కోటాతో పాటు వీటిని లబ్ధిదారులకు అందజేస్తారు. కార్డుల వారీగా సంచులను ఎమ్ఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ బ్యాగుల్లోనే బియ్యం తీసుకెళ్లేలా నాణ్యమైన సంచులను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం 143.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిట్యాలలో 15.4మి.మీ. వర్షం కురివగా నార్కట్ పల్లిలో 12.1, కట్టంగూర్ 10.4, శాలిగౌరారం 11.5, నకిరేకల్ 14.2, కేతేపల్లి10.9, తిప్పర్తి 4.4, నల్గొండ 6.3, కనగల్ 4.1, అనుముల 2.6, నిడమనూరు 1.1, త్రిపురారం 2.3, వేముల పల్లి 3.3, మిర్యాలగూడ 1.3, తిరుమలగిరి1.7, పెద్ద వూర 1.4, చింతపల్లి 3.2, గుర్రంపోడు లో 3.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాహనాల వేగాన్ని నియంత్రించడం, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.