Nalgonda

News September 6, 2024

మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి బాల్యం విశేషాలు

image

జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1993లో ఎల్‌బీ నగర్‌లోని డీవీఎం డిగ్రీ & పీజీ కళాశాల గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు.

News September 6, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..

image

జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. కొంతకాలానికి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇటీవలే దాన్ని బీజేపీలో విలీనం చేశారు. కొన్ని రోజులకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

News September 6, 2024

జిట్టా కోరిక ఇదే..

image

తన ఫామ్ హౌస్‌లోనే కన్నుమూయాలనేదే జిట్టా బాలకృష్ణారెడ్డి చివరి కోరిక అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి వెంటిలేటర్ మీద ఉంచి భువనగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా జిట్టా మృతికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిట్టా అంత్యక్రియలు జరగనున్నాయి.

News September 6, 2024

ఫామ్‌‌‌ హౌస్‌లో జిట్టా అంత్యక్రియలు

image

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాసేపట్లో HYD నుంచి మృతదేహాన్ని ఫామ్ హౌస్‌కు తీసుకురానున్నారు. మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన మృతదేహాన్ని చూడడానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ముఖ్యులు రానున్నారు.

News September 6, 2024

నల్గొండ: నిషేధం ముగిసింది.. సర్పంచ్ ఎన్నికకు సై  

image

గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయక నిషేధం బారిన పడిన అప్పటి అభ్యర్థులు ఇప్పుడు పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వారిపై ఎన్నికల సంఘం విధించిన మూడేళ్ల సమయం ముగిసింది. 2019లో జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 1097 మందిపై ఎన్నికల్లో పోటీచేయకుండా 2021లో నిషేధం పడింది. 2024 జులైతో వారి నిషేధ కాలం ముగిసి ఊరట లభించినట్లేనని అధికారులు తెలిపారు.

News September 6, 2024

NLG: డీసీసీబీ జీఎంపై సస్పెన్షన్ వేటు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార బ్యాంకు జీఎం నర్మదపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సహకార డైరెక్టర్, రిజిస్ట్రార్ ఉత్తర్వులను వెలువరించారు. ఖమ్మం జిల్లాలో బ్యాంకు రుణమాఫీ విషయంలో జరిగిన ఆరోపణలపై విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం జీఎం నర్మద ఖమ్మం నుంచి నల్గొండకు బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే.

News September 6, 2024

నాగార్జునసాగర్ సమాచారం

image

పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ఇన్ ఫ్లో: 54,917 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 38,361 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా: 29,232 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా: 8,529 క్యూసెక్కులు
ఎడమ కాల్వ ద్వారా: నిల్
ఏఎమ్మార్పీకి: నిల్
వరద కాల్వకు: 600 క్యూసెక్కులు

News September 6, 2024

యాదాద్రి క్షేత్రంలో ఇవాళ చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గంలకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News September 5, 2024

నల్గొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: ఎస్పీ

image

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన దాదాపు 130 మంది యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నారు.

News September 5, 2024

విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి: విజయేంద్రప్రసాద్

image

ఉపాధ్యాయులు విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కవి, రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈరోజు నల్లగొండలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని, అలాంటి పరిస్థితిని ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలని కోరారు.