Nalgonda

News September 4, 2024

నల్లగొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు గడుపు పెంపు

image

డాక్టర్ BR. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, PG, డిప్లమా కోర్సులలో చేరుటకు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త డా. అంతటి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫీజుని ఈనెల 20 లోపు చెల్లించాలని, కొత్తగా అడ్మిషన్ కోరే వారు ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఆయా స్టడీ సెంటర్లలో ఒరిజినల్స్ వెరిఫై చేయించుకోవాలన్నారు

News September 3, 2024

నల్గొండ మున్సిపాలిటీకి స్వచ్ఛవాయు సర్వేక్షన్లో దేశంలో రెండో స్థానం

image

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎంసీఏపి ) కింద నిర్వహించబడిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్-2024లో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ జనాభా కేటగిరీ-3 (<3 లక్షలు)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఘనత సాధించింది. ఈనెల 7న రాజస్థాన్‌లోని జైపూర్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో నల్లగొండ మున్సిపాలిటీ నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు.

News September 3, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో భారీగానే నష్టం

image

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో రోడ్లు దెబ్బతిన్నాయి. 15 చెరువులకు గండ్లు పడ్డాయి. 22,344 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వరి పొలాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 7 ఇండ్లు పూర్తిగా.. 44 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు మూడో రోజు నెమ్మదించాయి.

News September 3, 2024

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలపై ఏర్పాటు చేసిన ‘శాంతి కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వాడేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

News September 3, 2024

SRPT: ‘వరద నష్టం అంచనాలపై పూర్తి వివరాలు అందజేయాలి’

image

భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన వరద నష్టంపై అంచనా వివరాలు ఇవ్వాలని తహశీల్దార్‌కు ఎంపీడీవోలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం నష్టం వివరాలు తాత్కాలిక పునరుద్ధరణ శాశ్వత పరిష్కారం తదితర వాటిపై అంశాల వారీగా విడివిడిగా నివేదికలను అందజేయాలని అధికారులు ఆదేశించారు.

News September 2, 2024

ప్రధాని మోదీని సాయం కోరాను: సీఎం రేవంత్ రెడ్డి

image

సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం అని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానన్నారు. 

News September 2, 2024

జాతీయ సాధన సర్వే నిధులు విడుదల

image

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకోసారి జాతీయ సాధన సర్వే (న్యాస్) నిర్వహిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయిలో ఈ ఏడాది నవంబరు 19న ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు మాదిరి పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాకు రూ.4,72,160 లక్షలు మంజూరయ్యాయి.

News September 2, 2024

NLG: 498 ఎకరాల్లో నీట మునిగిన పంట

image

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 4 మండలాల్లో 498ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వాడపల్లిలో పత్తి 20 ఎకరాలు, వరి 100 ఎకరాలు, మాడ్గులపల్లి మండలం కాల్వపల్లిలో వరి 2 ఎకరాలు, వేములపల్లి, శెట్టిపాలెం, రావుల పెంటలో 350 ఎకరాల్లో వరి, గుర్రంపోడు మండలం రేపల్లెలో మిరప 3 ఎకరాలు, పెద్దవూరలోని చలకుర్తిలో 3 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తెలిపారు.

News September 1, 2024

సూర్యాపేట: వరదలో చిక్కుకున్నారు.. పోలీసులు కాపాడారు..!

image

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో ఓ పౌల్ట్రీ ఫాం జలదిగ్బంధమైంది. ఆ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే కూలీలు వరదలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది.. ఏఎస్పీ నాగేశ్వర్ రావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో కూలీలను రెస్క్యూ చేసి కాపాడారు. బాధిత కూలీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులకు వారు థ్యాంక్స్ చెప్పారు. 

News September 1, 2024

యాదాద్రి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా యాదాద్రి జిల్లాలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్థానిక మండల తహసీల్దార్‌ను, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08685-293312 ఏర్పాటు చేశామన్నారు.