Nalgonda

News April 6, 2025

నల్గొండ: పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ నివాసంలో పూజలు చేసి అక్కడ నుంచి మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ నూతన పట్టు వస్త్రాలను సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు.

News April 6, 2025

నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

image

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్‌తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 6, 2025

మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్నతల్లి హత్య

image

మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన బీబీన‌గర్ మండలంలో జరిగింది. CI ప్రభాకర్‌ తెలిపిన వివరాలు.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి(50) రాములు దంపతుల కుమారుడు శ్రీను. భార్యతో కలిసి చేవెళ్లలో ఉంటున్నాడు. APR 4న భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపంతో మోజి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.

News April 6, 2025

NLG: రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

image

సీతారాముడి కళ్యాణోత్సవానికి జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని అన్ని ఆలయాలల్లో నేడు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించి చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ వేడుకల అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం కళ్యాణమూర్తులను ఊరేగించనున్నారు. జిల్లా కేంద్రం రామగిరి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.

News April 6, 2025

NLG: 6,497 మందిలో.. 3,033 యువతకు ఉద్యోగాలు

image

నల్గొండ ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువ తేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు 6497 మంది పైగా నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కాగా, 3033 మంది ఉద్యోగాలకు ఎంపికకాగా, వారికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నియామక పత్రాలు అందజేశారు. చదువుకున్న యువత చెడు వ్యసనాలకు లోనవకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.

News April 6, 2025

‘మునుగోడులో ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉంది’

image

మునుగోడు నియోజకవర్గం ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతమని స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్యాంకుల్లో బోరు, భగీరథ నీళ్లు కలుస్తున్నాయని, దీనికి స్వస్తి పలకాలన్నారు. శుద్ధి చేసిన తాగునీరందేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అధికారులు, నాయకులు అలర్ట్‌గా ఉండి తాగునీటి సమస్య లేకుండా చూడాలని పేర్కొన్నారు.

News April 5, 2025

మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌కు నిర్వాసితుల సత్కారం

image

దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో భూనిర్వాసితులైన 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు జెన్కో అందజేసింది. కాగా భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జెన్కో, ప్రభుత్వానికి జాబితా పంపించారు. ఈ విషయమై 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు అందజేశారు. సబ్ కలెక్టర్ వల్లనే తమకు ఉద్యోగాలు వచ్చాయని భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడలో ఆయనను సన్మానించారు.

News April 5, 2025

రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

image

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 5, 2025

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్: మంత్రి కోమటి రెడ్డి

image

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నల్గొండ పమర్రి గూడ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2025

నాగార్జునసాగర్: కిడ్నాప్.. వ్యక్తి హత్య

image

నాగార్జునసాగర్‌లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.