India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫోకస్ పెట్టారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కొంత మంది జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొడుతున్నారు. ప్రజావాణికి హాజరు కాకుండా.. కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో భూముల హద్దులను నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్ ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రజా పాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీంట్లో భాగంగా ఇవాల్టి నుంచి లైసెన్సుడ్ సర్వేలకు రెండో విడత శిక్షణ ఇస్తున్నారు.
నల్గొండ జిల్లాలో వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో గ్రామాలతో పాటు పట్టణాల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో గజగజ వణికి పోతున్నారు. గత రెండు రోజులుగా చలి తీవ్రత కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నల్గొండ జిల్లాలో కొత్త, పాత రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సెప్టెంబర్ నెల కోటా బియ్యాన్ని రాష్ట్రస్థాయి గోదాముల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఈ పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
నల్గొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. సుమారు 170 టీచర్, 600కు పైగా ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీకి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కొన్ని కేంద్రాల్లో రోజువారీ నిర్వహణ, పూర్వప్రాథమిక విద్య, పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో కొన్ని కేంద్రాలను నెలకోసారి కూడా తెరవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని ఉచిత చేప పిల్లల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మత్స్య కారుల ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామపంచాయతీ చెరువులు కుంటలు కలిపి 1160కి పైగానే ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు 50, జూనియర్ లైన్మెన్ పోస్టులు122 భర్తీ చేయాల్సి ఉంది. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందజేస్తుంది. జిల్లాలో ఇప్పటికే 241 మందికి రూ.లక్ష చొప్పున రుణం అందజేశారు. కొందరు మహిళా సంఘాల్లో సభ్యులు కాకపోయినా వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు 2025-27 బ్యాచ్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నల్లగొండ ప్రభుత్వ డైట్ కాలేజీలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ కె.గిరిజ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.
నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్గాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటిపై కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. మూసీ, శాలిగౌరారం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
Sorry, no posts matched your criteria.