Nalgonda

News April 11, 2026

నల్గొండ: ఉనికిని కోల్పోతున్న వాగులు

image

ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణల కారణంగా వాగులు తమ ఉనికిని కోల్పోతున్నాయి. కనగల్, మునుగోడు, చండూరు, కొరటికల్ వంటి ప్రాంతాల్లో వాగులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. ఇసుకను విచ్చలవిడిగా తరలించడంతో వాగుల్లో కేవలం మట్టి మాత్రమే కనిపిస్తూ, అవి మడుగులుగా మారి జమ్మి వనంలా దర్శనమిస్తున్నాయి. అక్రమ రవాణా ఆగకపోవడంతో భూగర్భ జలమట్టం పడిపోయే ప్రమాదం ఉందని వాగులను కాపాడాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

News April 11, 2026

దేవరకొండ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగి ఘరానా మోసం

image

దేవరకొండ డిండి రోడ్డులోని బ్యాంకులో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించాడు. విదేశాల్లో ఉంటున్న, సుదీర్ఘకాలంగా లావాదేవీలు జరపని వారి అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని అధికారుల కళ్లుగప్పి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసి వాటితో పరారయ్యాడు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులు రహస్యంగా దర్యాప్తు చేపట్టి, నష్టపోయిన సొమ్ముపై లెక్కలు తీస్తున్నారు.

News April 11, 2026

​నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News April 11, 2026

​నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News April 11, 2026

​నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News April 11, 2026

నల్గొండ: హోమియోపతిపై అవగాహన పెంచాలి: కలెక్టర్

image

ఆయుర్వేద, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. హోమియోపతి డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ సహజ వైద్య విధానాలు ఎంతో మేలు చేస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

నల్గొండ: హోమియోపతిపై అవగాహన పెంచాలి: కలెక్టర్

image

ఆయుర్వేద, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. హోమియోపతి డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ సహజ వైద్య విధానాలు ఎంతో మేలు చేస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

నల్గొండ: హోమియోపతిపై అవగాహన పెంచాలి: కలెక్టర్

image

ఆయుర్వేద, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. హోమియోపతి డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ సహజ వైద్య విధానాలు ఎంతో మేలు చేస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News April 10, 2026

నల్గొండ: లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి – కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.

News April 10, 2026

NLG: చిగురిస్తున్న ‘చేయూత’ ఆశలు

image

జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి ‘చేయూత’ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరిగిన ‘ప్రజా పాలన’ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,115 దరఖాస్తులు అందగా, ప్రస్తుతం అధికారులు అర్హతలను బట్టి వడపోత ప్రక్రియను వేగవంతం చేశారు. ఒక్కో జిల్లాకు సుమారు 10 వేల నుంచి 15 వేల వరకు కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది.