Nalgonda

News April 2, 2025

బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

image

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News April 2, 2025

కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్‌లు

image

నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9 వరకు ఆఫ్ లైన్‌లో అడ్మిషన్స్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను విద్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 11 చివరి తేది అని పేర్కొన్నారు.

News April 2, 2025

నల్గొండ: రోడ్డుపై కారుతో స్టంట్స్.. యువకుడి అరెస్ట్

image

నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాల రోడ్డు పై షిఫ్ట్ డిజైర్ కార్‌తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వేగంగా స్టంట్స్ చేయడంతో ప్రజలు భయాందోనకు గురయ్యారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ కారును పట్టుకునే ప్రయత్నం చేయగా సదరు యువకుడు కానిస్టేబుల్‌ను కారుతో భయపెట్టి పరారయ్యాడు. కాగా విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు.

News April 2, 2025

నల్గొండ: ‘డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు’

image

ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని పలు రేషన్ దుకాణాలు, రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే డీలర్షిప్ రద్దు చేస్తామన్నారు. డీలర్లు నియమ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

News April 1, 2025

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

image

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.

News April 1, 2025

BREAKING: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం

image

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. గుర్రంపోడులో ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండాగా వద్దిరెడ్డిగూడెం వద్ద కాన్వాయ్‌లో గన్‌మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలగా మంటలు చెలరేగాయి. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2025

NLG: ఆన్‌లైన్‌లో పేరు ఉన్నా.. సన్న బియ్యం!

image

కొత్తగా రేషన్ కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

News April 1, 2025

NLG: మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

image

యువత స్వయం ఉపాధిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం కొట్టిన విషయం తెలిసిందే. తొలుత దరఖాస్తులకు ఏప్రిల్ 5 వరకు అవకాశం కల్పించింది. అయితే సర్వర్ సమస్యలు, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటి జారీకి సమయం పడుతోంది. దీంతో దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది. జిల్లాలో ఇప్పటివరకు 22,356 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News April 1, 2025

NLG: ఎల్ఆర్ఎస్‌కు స్పందన అంతంత మాత్రమే!

image

ఉమ్మడి జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఎల్ఆర్ఎస్ కింద మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 25% రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29 వరకు 1418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒక్క సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.

News April 1, 2025

NLG: 2న SC సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

షెడ్యూల్డ్ కులాల సంఘ ప్రతినిధులతో ఏప్రిల్ 2న నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5న భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.