India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వెంకటేష్, డీసీవో పత్యా నాయక్, ఎంఏవో శ్రీనివాస్, సీఈవో అనంతరెడ్డి, మానిటరింగ్ అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ తొలగింపు నేపథ్యంలో, వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో, జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్ఎల్బీసీ కాలనీలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓ వై. అశోక్ రెడ్డితో కలసి పరిశీలించిన కలెక్టర్.. పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను వెంటనే కల్పించాలని ఆమె ఆదేశించారు.

మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడిచిపోయింది. ఇక టెండర్లు వేసేందుకు కేవలం 8 రోజుల గడువే ఉంది. అయితే ఈ నెల 18వ తేదీ గడువులోగా టెండర్లు వేగం చేసేందుకు అధికారులు కూడా వ్యాపారులను మోటివేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం డిపాజిట్ ధర పెంచడంతో కొందరు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కలిసి ఒక టెండర్ను వేసే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 18 జడ్పీటీసీ, 196 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, అధికారులు నామినేషన్లను స్వీకరించారు. దీంతో కనగల్ మండలం జీ ఎడవల్లి ఎంపీటీసీ స్థానానికి ఒకరు, NKP మండలం NKP-1 ఎంపీటీసీ స్థానానికి మరొకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా బంద్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్కు అన్ని వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు సహకరించాలని కోరారు.

మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో పిచ్చికుక్కల దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులు, నలుగురు పెద్ద వారిపై కుక్కలు దాడి చేశాయని గ్రామస్థులు తెలిపారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదని వారు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గత నెల 4న DVK రోడ్లో ఉన్న మాస్టర్ మైండ్స్ పాఠశాలలో బస్సు కిందపడి మృతి చెందిన చిన్నారి జశ్విత కేసు విషయం బాధాకరమని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో నోటీసులు జారీచేసి పాఠశాలను తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేశామన్నారు.

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఏ.అనిత తెలిపారు. 8వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన జనరల్ మహిళలు, ఒంటరి మహిళలు, స్కూల్ మద్యలో ఆపేసిన మహిళలు, డిజేబుల్ మహిళలు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఆఫ్రికా నత్తల నివారణకు కిలో ఉప్పును 4 లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సుభాషిని తెలిపారు. ఆకర్షక ఎర ఏర్పాటులో భాగంగా 10 కిలోల వరి తవుడుకు, కిలో బెల్లం, లీటర్ ఆముదం, కిలో ధయోడికార్స్ గుళికలు(ఎసిఫెట్/ క్లోరోఫైరిఫాస్) కలిపి చిన్న ఉండలుగా చేసి బొప్పాయి,క్యాబేజీ ఆకుల కింద పెట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.