Nalgonda

News September 1, 2024

SRPT: రేపు ప్రజావాణి రద్దు: అదనపు కలెక్టర్ లత

image

అధిక వర్షాల కారణంగా రేపు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ బీయస్ లత తెలిపారు. భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యలు నిమగ్నం అయినందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అన్నారు. ఈ నెల 9న సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

News September 1, 2024

నడిగూడెం వరద పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ

image

నడిగూడెం మండలంలో వరద పరిస్థితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మట్టి రోడ్డులో స్థానికులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆయన ప్రయాణించారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News September 1, 2024

రామపురంలో సాగర్ ఎడమ కాలువకు గండి

image

నడిగూడెం మండల పరిధిలోని రామచంద్రాపురం 117 కిలోమీటర్ల వద్ద వరదకి సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. పంట పొలాల నుంచి వరద నీరు గ్రామంలోకి చేరుతోంది. గతంలో గండి పడడంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

News September 1, 2024

బీ అలర్ట్.. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News August 31, 2024

సొంత ఖర్చులతో  బోరు వేయించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సొంత ఖర్చులతో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బోర్ వేయించారు. ప్రజలు నీటి సమస్యపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి వెంటనే తన సొంత ఖర్చులతో బోరు వేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బోర్ వేయించారు. 

News August 31, 2024

ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ నుంచి జాతీయ పశుగణన

image

ఉమ్మడి జిల్లాలో పెంపుడు జంతువుల పశుగణన SEP 1 నుండి ప్రారంభం కానుంది. పెంపుడు జంతువులైన ఆవుజాతి , గేదెజాతి, గొర్రెమేకలు , కుక్కలు, పిల్లులు, పందులు, గాడిదలతో పాటూ కోడి బాతుల లెక్కింపు కూడా స్వదేశీ జాతులు విదేశి జాతుల వివరాలు విడివిడిగా శాస్త్రీయ పద్దతిలో తర్ఫీదు పొందిన పశుసంవర్ధక శాఖ బృందాలు ప్రతీ ఇంటింటికి వెళ్లి ఆన్ లైన్ అప్ లోడింగ్ ద్వారా 4 నెలల పాటు నమోదు చేయనున్నారు.

News August 31, 2024

నిరుపయోగంగా మారిన సేంద్రియ ఎరువు తయారీ షెడ్లు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. ఒక్కొక్క షెడ్డుకు రూ.12 లక్షలు వెచ్చించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ఎరువు తయారికి అనుగుణంగా వీటిని నిర్మించారు. అధికారుల, సిబ్బంది అలసత్వం కారణంగా నేటికీ అవి చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.

News August 31, 2024

FLASH: NLG, SRPT, YDD జిల్లాలకు PINK ALERT⚠️

image

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News August 31, 2024

నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రులు

image

భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గం నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పది సంవత్సరాలుగా బునాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలపై వివక్ష చూపించారని మండిపడ్డారు.

News August 30, 2024

మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకం: మంత్రి ఉత్తమ్

image

బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ నీటిపారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.