India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. సుమారు 170 టీచర్, 600కు పైగా ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీకి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కొన్ని కేంద్రాల్లో రోజువారీ నిర్వహణ, పూర్వప్రాథమిక విద్య, పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో కొన్ని కేంద్రాలను నెలకోసారి కూడా తెరవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని ఉచిత చేప పిల్లల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మత్స్య కారుల ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామపంచాయతీ చెరువులు కుంటలు కలిపి 1160కి పైగానే ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు 50, జూనియర్ లైన్మెన్ పోస్టులు122 భర్తీ చేయాల్సి ఉంది. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందజేస్తుంది. జిల్లాలో ఇప్పటికే 241 మందికి రూ.లక్ష చొప్పున రుణం అందజేశారు. కొందరు మహిళా సంఘాల్లో సభ్యులు కాకపోయినా వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు 2025-27 బ్యాచ్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నల్లగొండ ప్రభుత్వ డైట్ కాలేజీలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ కె.గిరిజ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.
నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్గాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటిపై కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. మూసీ, శాలిగౌరారం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
NLG జిల్లాలో నూతన గృహ నిర్మాణాలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా పట్టణంతో పాటు శివారులోని గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణాలు జోరందుకోవడంతో భూగర్భజలాల వినియోగం బాగా పెరుగుతోంది. ఏటా కురుస్తున్న వర్షపు నీటిని నేల గర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీచార్జింగ్ పిట్స్ లేకపోవడంతో సుమారు 65 నుంచి 70 శాతం మేర వృథాగా పోతున్నట్లు భూగర్భజల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రమంలో దృష్టి సారించిన యంత్రాంగం ఆయా ప్రభుత్వ భవనాలు, వాటికి వినియోగిస్తున్న విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జిల్లాలో కొందరు కార్యదర్శులు తప్పుడు పద్ధతిలో హాజరు నమోదు చేసిన విషయం తెలిసిందే. 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా ఆ పంచాయతీలో పని చేసే కార్యదర్శుల చేత తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయించారు. వారందరికీ చార్జింగ్ మెమోలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వీరందరికీ పదోన్నతులతోపాటు ఇంక్రిమెంట్లు సైతం కట్ చేయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పత్తి, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా చందంపేటలో 82.9, MLGలో 75.9, పీఏ పల్లిలో 74.9, DVKలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా చిట్యాలలో 11.4 మీమీ వర్షం కురిసింది.
Sorry, no posts matched your criteria.