Nalgonda

News April 5, 2025

నాగార్జునసాగర్: కిడ్నాప్.. వ్యక్తి హత్య

image

నాగార్జునసాగర్‌లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.

News April 5, 2025

NLG: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కోదాడలో నల్గొండ మండాలనికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. దోనకల్ గ్రామానికి చెందిన సైదులు(31) బోర్‌వెల్స్‌లో పని చేస్తూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం కోదాడకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం సైదులుకి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 4, 2025

NLG: TCC కోర్స్ వేసవి శిక్షణ శిబిరం

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 1 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో బొల్లారం బిక్షపతి తెలిపారు. నల్గొండలోని డైట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్నాటిక హిందుస్థాని సంగీతం, వుడ్ వర్క్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు.  అర్హులైన వారు ఏప్రిల్ 17 నుంచి 29 వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News April 4, 2025

భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాల పంపిణీ

image

హైదరాబాద్ సైబర్ గార్డెన్‌లో నల్గొండ జిల్లా వీర్లపాలానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరై ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

News April 4, 2025

NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

image

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.

News April 4, 2025

NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

image

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

News April 4, 2025

NLG: జిల్లాలో మామిడికి గడ్డు పరిస్థితులు!

image

ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి ఈ ఏడాది గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురియక, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత సకాలంలో రాలేదు. వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దట్టంగా కురిసిన పొగమంచు పూతను దెబ్బతీసిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1 నుంచి 2 టన్నుల వరకైనా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.

News April 4, 2025

NLG: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

News April 3, 2025

సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

image

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News April 3, 2025

NLG: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

‘పది’ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా <<15971907>>తిరగాలని<<>> భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. నిన్న యాదాద్రి(D)లో ఈతకు వెళ్లి ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.