Nalgonda

News August 14, 2025

30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

image

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News August 14, 2025

సీఎంకు రేవంత్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ

image

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.

News August 14, 2025

నల్గొండ: క్రీడా పాఠశాలకు 14 మంది విద్యార్థులు ఎంపిక

image

2025-26 సంవత్సరానికి హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి జిల్లా నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా విద్యార్థిని కలిమెల భావన ప్రథమ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు.

News August 14, 2025

నల్గొండ: ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉత్తమ్ విడియో కాన్ఫరెన్స్

image

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అలసత్వం వహించవద్దని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో జీవో నం. 45 ప్రకారం నిధులు వినియోగించుకోవాలన్నారు. కాలువ కట్టలు తెగే సూచనలు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాన్నారు. విపత్తు సమయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

News August 14, 2025

NLG: 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

image

జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణను ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ (రెవెన్యూ), జిల్లా సర్వే అధికారి జి.సుజాత తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ సెట్, ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉదయాదిత్య భవన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకోవాలన్నారు.

News August 14, 2025

దామరచర్లలో అత్యధికం.. నార్కట్ పల్లిలో అత్యల్పం

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు జిల్లాలో 30 మి.మీ. సగటు వర్షం కురిసింది. దామరచర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా నార్కెట్ పల్లిలో 2.5 మి.మీ. వర్షం కురిసింది. కనగల్ మండలంలో 42.7మి.మీ., మునుగోడు 15.5 మి.మీ., చండూరు 21.5 మి.మీ., మర్రిగూడ 48.2 మి.మీ., చింతపల్లి 13.1 మి.మీ., నాంపల్లి 32.6 మి.మీ., గుర్రంపోడు 42.5 మి.మీ., అనుములు హాలియా 23.7 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.

News August 14, 2025

గుర్రంపోడు: ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

image

గుర్రంపోడులోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి.రాగిణి తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిషన్ కావాల్సిన వారు నేరుగా పాఠశాలకు వచ్చి ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. 9397320844 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

News August 14, 2025

వర్షాల వేళ.. ప్రత్యేక చర్యలు తీసుకోండి: జడ్పీ సీఈవో

image

NLG: అకాల వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నల్గొండ జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం వేములపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వరదల వలన ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News August 14, 2025

‘స్వాతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి’

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై బుధవారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15న ఉదయం 9:30 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారని తెలిపారు.

News August 13, 2025

మాదక ద్రవ్యాల రహిత సమాజానికి కృషి: నల్గొండ SP

image

మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడితే జీవితం వృథా అవుతుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.