India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 4,65,943 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. కాగా ఎఫ్సీఐ, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే కంపెనీ చేయగా కొంతమేరకు డీలర్ల వద్ద కూడా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని వేలం ద్వారా అమ్మకాలు చేయనున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గానూ ఏప్రిల్ 14 వరకు మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మ్యానువల్గా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు అందించే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30గంటలకు HYD చేరుకుంటారు.
గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మిగతా ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టిని తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించారు. తాజాగా వ్యవసాయ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పంట పొలాల వద్దకు మట్టి రోడ్లు, పండ్ల తోటల పెంపకం, పశువుల కొట్టాలు, కోళ్లఫారాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. NLG జిల్లాలో సుమారు నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు ఎనిమిది లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకుని నల్గొండ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ పండుగను సోమవారం ముస్లింలు సంతోషంగా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. మసీదు, ఈద్గాలు, తదితర చోట్ల వద్ద ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
నల్గొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్-1లో 535 మార్కులతో జనరల్ ర్యాంకుల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. వెంకటరమణ ఐదేండ్లుగా సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు ఐడీసీలో ఏఈగా, తల్లి రమాదేవి అనుముల మండలం అలీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెల్లడించిన జేఎల్, డీఏఓ, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం వెంకటరమణ ఎంపికయ్యారు.
జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. ఉమ్మడి జిల్లాకు 4,27,542 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
నల్గొండ జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫోన్ నంబర్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని JDA శ్రవణ్ కుమార్ తెలిపారు.
☞జిల్లా వ్యవసాయధికారి – 8977751294
☞NLG ADA–T(DAO) – 8977751295
☞NLG ADA – 8977751449
☞DVK ADA – 8977751306
☞MLG ADA – 8977751358
☞హాలియా ADA -8977751330
☞మునుగోడు ADA – 8977751370
☞నకిరేకల్ ADA – 8977751427
☞DDAFTC నల్గొండ – 8977751458
Sorry, no posts matched your criteria.