India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయడంతో పాటు ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హెల్త్ టూరిజం, జూపార్కు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, టిపిఓ ఇంజనీర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్తగా 30 ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేయుటకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. త్వరలో రాష్ట్రంలోని 10 నగరాల్లో 30 ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండలో-3, సూర్యాపేటలో-3ఎఫ్ఎం స్టేషను ఏర్పాటు చేయనున్నారు. మాతృభాషలో స్థానిక కంటెంట్ ను పెంచడంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని అధికారులు తెలిపారు.
సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, మున్సిపల్, పంచాయతీ అధికారులు రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలన్నారు.
ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత ఎన్నికలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కొండమల్లేపల్లిలో గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ గిరిబాబు, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్గొండలోని ఏఆర్ నగర్లో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భర్త వెంకన్నను భార్య మైసమ్మ హత్య చేసినట్లు సమాచారం. హత్యకు అక్రమ సంబంధం కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని సెల్ఫీ ఫొటో తీసుకుంటూ వివరాలను నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ సామూహిక ఉచిత వ్రతాల నిర్వహణకు దేవస్థానం నిర్ణయించింది. యాదాద్రి కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళా భక్తులు తమ పేర్లను గురువారం సాయంత్రం 5 గంటల లోగా నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో దాదాపు 6 వేల మంది సెకండ్ ANMలు పనిచేస్తున్నారని వీరందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో సెకండ్ ANMలను రెగ్యులర్ చేశారని.. మన రాష్ట్రంలో కూడా సెకండ్ ANMలను రెగ్యులర్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.