Nalgonda

News March 25, 2025

నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్‌ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

News March 25, 2025

ఉమ్మడి NLG జిల్లా నుంచే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం

image

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు.

News March 25, 2025

NLG: ఉద్యమాల జిల్లాలో ‘పోరుబాట’

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి సాగుకు నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంట చేలలో రైతులు పశువులను మేపుతున్నారు. దీంతో ఇటు BJP, BRS, CPM పార్టీలు ఉద్యమ బాట పట్టారు. ఎండుతున్న పంటల విషయంపై అధికార పార్టీ సైలెంట్‌గా ఉండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పోరుబాట కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండిన పొలాలను పరిశీలిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

News March 24, 2025

పోలీస్ గ్రీవెన్స్ డేకు 30 మంది ఆర్జీదారులు: SP

image

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.

News March 24, 2025

నాగార్జునసాగర్ నేటి సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News March 24, 2025

నల్గొండ కలెక్టరేట్ ప్రజావాణికి 100 దరఖాస్తులు

image

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 100 మంది సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వచ్చాయి.

News March 24, 2025

NLG: మరో మూడు నెలలు పొడిగింపు

image

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 30వ తేదీతో ముగియనున్న అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అక్రిడేషన్ కార్డుల గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. కొత్త అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వకుండా పొడిగించుకుంటూ పోవడంపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.

News March 24, 2025

BREAKING: నల్గొండ జిల్లాలో భారీ చోరీ

image

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వాసవి బజారులో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుంగడులు ఓ ఇంట్లో చొరబడి 30 తులాల బంగారం, రూ.5 లక్షల నగదును దోచుకెళ్లారు. గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2025

నల్గొండ: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్‌కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్‌లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

News March 24, 2025

నల్గొండ: లాడ్జిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్‌లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్‌గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.