Nalgonda

News August 6, 2025

NLG: జిల్లాలో తొలిసారిగా సాండ్ బజార్!

image

జిల్లాలో మొదటి సారిగా మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వం సాండ్ బజార్ ఏర్పాటు చేసింది. మైనింగ్ శాఖ పర్యవేక్షణలో ఈ సాండ్ బజార్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తెస్తోంది. MLG శివారులోని చింతపల్లి బైపాస్ వద్ద స్థలంలో సాండ్ బజార్ ఏర్పాటు చేసింది. ఈ సాండ్ బజార్‌ను గురువారం ప్రారంభించనున్నారు. ఇక్కడ టన్ను ఇసుక రూ.1250లకే విక్రయిస్తారు.

News August 6, 2025

ఏటీసీ, ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్), ఐటీఐలలో ప్రవేశాలకు ఆన్లైన్లో ఈ నెల 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) NLG కాలేజీ ప్రిన్సిపల్ ఎ.నర్సింహాచారి తెలిపారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతో వారి మొబైల్ నంబర్ రిజిస్టర్‌ను చేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల మెరిట్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయన్నారు.

News August 6, 2025

NLG: జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్న FRS!

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల డుమ్మాలకు చెక్ పెట్టేందుకు అమలు చేస్తున్న FRS విధానం సత్ఫలితాలను ఇస్తుంది. పాఠశాల ఆవరణలో ఉండి హాజరువేసేలా జియో ట్యాగింగ్ చేయడంతో అక్రమాలకు చెక్ పెట్టినట్లు అయింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయానుగుణంగానే ఈ యాప్‌లో ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాల్సి ఉండడంతో జిల్లాలో ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

News August 5, 2025

NLG: గొర్రెల పంపిణీ అవకతవకలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు..!

image

BRS ప్రభుత్వ హయాంలో రాయితీ గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై NLGలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పశువుల ఆస్పత్రుల్లో వెటర్నరీ డాక్టర్లను కలవడంతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో 28,236, రెండో విడతలో 5,696 యూనిట్లు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, గొర్రెల మందలేనివారు, గొర్రెలకు బదులు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

News August 5, 2025

NLG: మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే!

image

విధులకు హాజరు కాకుండానే హాజరయ్యామని ఫేక్ అటెండెన్స్ క్రియేట్ చేసిన పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సృజన ఆదేశాల మేరకు జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య నోటీసులు జారీచేశారు. మొత్తం జిల్లాలో 69 మంది పంచాయితీ కార్యదర్శులతో పాటు 15 మంది మండల పంచాయతీ అధికారులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

News August 5, 2025

NLG: డుమ్మా కొట్టడం కుదరదిక!

image

నల్గొండ జిల్లాలో వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 34 పీహెచ్‌సీలు, 5 యూహెచ్‌సీలు, 257 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. వీరందరికీ ముఖ హాజరుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News August 5, 2025

NLG: కొబ్బరి కొనలేం.. కొట్టలేం..!

image

పవిత్ర కార్యక్రమాలు, పూజలలో వినియోగించే కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఇళ్లలో, ఆలయాలలో కొబ్బరికాయల వినియోగం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్క కొబ్బరికాయ ధర రూ.50కు పైగా పలుకుతోంది. ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం వద్ద ఈవో అజమాయిషీ లేకపోవడంతో అధిక ధరలకు అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News August 5, 2025

నల్గొండ జిల్లాలో సాగు అంచనా ఇది!

image

జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో మొత్తం 11.60 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 5,47,785 ఎకరాలు, వరి 5,25,350 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు పత్తి 5,42,641 ఎకరాల్లో, వరి 2,25,284, 1,541, మినుము 16, పెసర 166 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి ఇప్పటివరకు 7,69,078 సాగు చేశారు. వరి సాగు ఇంకా 3 లక్షల ఎకరాల్లో పెరిగే అవకాశం ఉంది.

News August 5, 2025

జిల్లా వ్యాప్తంగా 23.1 మి.మీ సగటు వర్షపాతం

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో 30 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 23.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకిరేకల్‌ మండలంలో 76.1 మి.మీ, కట్టంగూర్‌లో 60.8 మి.మీ వర్షం కురిసింది. అత్యల్పంగా దేవరకొండ మండలంలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. చౌటుప్పల్‌లో 31.8, తిప్పర్తి 45.3, నల్గొండ 39.7, కనగల్‌లో 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 5, 2025

NLG: అక్రమ దందా.. అడ్డంగా దొరికిన పోలీసులు..!

image

తిప్పర్తి పీఎస్‌లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు మోటార్‌సైకిళ్ల అక్రమ విక్రయాలతో అడ్డంగా దొరికారు. గుర్తుతెలియని వాహనాలను స్వాధీనం చేసుకొని, కొన్నేళ్లుగా దొంగతనంగా అమ్ముకుంటున్నారు. ఇటీవల సర్వారం గ్రామానికి చెందిన వ్యక్తికి ఒక బైక్ అమ్మిన తర్వాత మిగతా డబ్బుల కోసం వేధించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై విచారణలో బైక్ మెకానిక్ లిఖితపూర్వక వాంగ్మూలం ఆధారంగా అక్రమాలను గుర్తించారు