India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో NLG ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ITI, పాలిటెక్నిక్లో ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన మహిళలు 18 సం.ల నుంచి 33 సంవత్సరాల లోపు వారు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాసరాజు తెలిపారు.
రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్కు చెందిన వారిగా గుర్తించారు.
గుర్రంపోడులో మద్యం మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. సుమారు అరగంట పాటు నల్గొండ – దేవరకొండ రహదారిపై అడ్డంగా పడుకున్నాడు. స్థానికులు అతడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చినా మందుబాబు మత్తులో ఉండడంతో వెళ్లిపోయారు. అతను మరోసారి వచ్చి రచ్చ చేయగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
ఉమ్మడి NLGలోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. మే12న నాగార్జునసాగర్కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు సుందరీమణులు రానున్నారు. సాగర్లో బౌద్ధ సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీరి పర్యటన నేపథ్యంలో నేడు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్లో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థులు, హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా 105 సెంటర్లలో నేడు ప్రారంభమైన పదవ తరగతి మొదటి రోజు పరీక్షకి 18511 విద్యార్థులకు గాను 18471 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. మొత్తం 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. హాజరు శాతం 99.78 % నమోదు అయిందని, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 49 సెంటర్లను సందర్శించారని తెలిపారు.
వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకుగాను, తాగునీటి బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, తాగునీటి ట్యాంకుల మరమ్మతులకు గాను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 827 తాగునీటి పనులు చేపట్టేందుకు DMFT నిధుల నుంచి రూ.5 కోట్ల 10 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎక్కడా తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.
కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రానున్న ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే వారిపై నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొడితే పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లకు టోల్ విధించే ఆలోచనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో సిద్దిపేట MLA హరీశ్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. కాగా, రోడ్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా తమ వద్ద రోడ్లు సరిగ్గా లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ నవ్వుతూ అన్నారు.
యువ వికాసం పథకానికి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనన్న నిబంధన పెట్టడంతో జిల్లాలో నిరుద్యోగులకు శాపంగా మారింది. రేషన్ కార్డు నిబంధనలతో ఆశావహులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనను వెంటనే తొలగించాలని వివిధ పార్టీల నేతలు, నిరుద్యోగులు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతోంది.
Sorry, no posts matched your criteria.