India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెందిన అక్కినపల్లి రాములు, పూలమ్మ కుమారుడు అక్కినపల్లి సుధాకర్ సినీ రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈయనది నిరుపేద కుటుంబం. జీవనోపాధి కోసం తల్లిదండ్రులతో పాటు HYD వెళ్లిన ఆయన చదువు మానేసి ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నారు. ముందు టీవీ ఛానళ్లలో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్గా పనిచేసి, 2019 నుంచి సినీరంగంలో పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో జాతీయ రహదారులపై R&B శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరా తీసి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. NH-65ని 6 లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచామన్నారు.
బైక్ చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందిన ఘనట పేరేపల్లి శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… చిట్యాల మండలం పేరేపల్లికి చెందిన రూపని రాజశేఖర్ జేసీబీ డ్రైవర్. వెలిమినేడులో పని ముగించుకుని గ్రామానికి తిరిగి వెళుతుండగా పేరేపల్లి శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు రాముడి ఫిర్యాదుతో ఏఎస్ఐ జానారెడ్డి కేసు నమోదు చేశారు.
నాగార్జునసాగర్ నెల్లికల్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో పగడాల సుధాకర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వేములపల్లి మండలం శెట్టిపాలెంకి సుధాకర్ ఓ కంపెనీలో క్యాష్ డిపాజిటర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏటీఎంలో మనీ డిపాజిట్ చేసే క్రమంలో రూ.20లక్షలతో ఈ నెల 13న ఉడాయించాడని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేశారు. ఫారెస్టులో ఇవాళ శవమై తేలాడు.
గ్రామానికి కీడు సోకిందని ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి వన వాసానికి వెళ్లిన ఘటన NKL మండలం మంగళపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామంలో నెల రోజులుగా కొందరు జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించినా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో గ్రామానికి కీడు సోకిందని.. భావించి సగం ఊరు ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి ఉదయం వనవాసం వెళ్లి తిరిగొచ్చారు.
నాగార్జునసాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. శ్రీశైలం నుంచి 71,259 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరగా సాగర్ నుంచి రెండు గేట్లను ఎనిమిది అడుగుల మేరకు ఎత్తి 24,920 క్కూసెక్కుల నీటిని దిగువ విడుదల చేశారు. గేట్లతో పాటు కుడికాల్వ ద్వారా 8,067, ఎడమకాల్వ ద్వారా 6,478 , ప్రధాన విద్యుత్తు కేంద్రం ద్వారా 29,394, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చుచేసి జిల్లా వ్యాప్తంగా మొత్తం 140 రైతు వేదికలు నిర్మించారు. వారం వారంవ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణలు ఇస్తూ సీజన్ లో పంటల వారీగా సాగులో మెలకువలను తెలియజేయాలనేది వీటి లక్ష్యం. కాగా 24 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు
సోదర సోదరీమణుల అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునేది రాఖీ. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మార్కెట్లలోని రంగు రంగుల భిన్నమైన రాఖీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సారి వ్యాపారం ఎక్కువ సాగుతోందని దుకాణ యాజమన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు మృత్యువాత పడిన వార్త స్థానికంగా కంట తడి పెట్టించింది. స్థానికులు తెలిపిన వివారలు.. మునగాలలోని నేలమర్రికి చెందిన సురేష్ తన బైక్పై ఆదివారం ఉదయం సూర్యాపేటకు బయలు దేరాడు. మాధవరం వద్ద సూర్యాపేట నుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్బాడీని పోస్ట్మార్టం నిమిత్తం సూర్యాపేటకు తరలించారు.
సూర్యాపేట్ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండలంలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయంవద్ద ఆడుకుంటున్న అన్నదమ్ములపై గోడ కూలింది. ఈ ఘటనలో బాలుడు హిమాన్ష్(3) మృతి చెందాడు. అన్న దేవాన్ష్(5) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
Sorry, no posts matched your criteria.