Nalgonda

News August 16, 2024

BREAKING: చౌటుప్పల్: 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్నారు..!

image

గంజాయి ముఠాను సుమారు 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. HYD-విజయవాడ హైవేలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నలుగురు సభ్యులున్న ఓ గంజాయి ముఠాను నల్గొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఈరోజు పసిగట్టారు. అక్కడ వారిని అడ్డుకోగా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకోవడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంబడించి HYD శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ JNNURM వద్ద అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు.

News August 16, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ డ్యాం రెండు గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగించారు. శ్రీశైలం నుంచి 63,129 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి చేరుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయి 590 అడుగులకు చేరడంతో ఎన్ఎస్పీ అధికారులు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు.

News August 16, 2024

నల్గొండ జిల్లాలో 33,501 మంది రైతులకు రుణమాఫీ

image

రూ.2లక్షల లోపు పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతలో భాగంగా మాఫీ చేసింది. ఈ మేరకు గురువారం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 33,501 మంది రైతులకు రూ.442.86 కోట్లు విడుదలయ్యాయి. అయితే గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో రైతుల ఖాతాల్లో ఆ నిధులు జమకాలేదు. శుక్రవారం ఉదయం రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News August 16, 2024

నల్గొండ: రైతుల కోసం అద్భుత యంత్రం

image

రైతుల కోసం చౌటుప్పల్ పురపాలిక లింగోజిగూడేనికి చెందిన ప్రవీణ్ అద్భుత యంత్రాన్ని సృష్టించాడు. రాత్రి పూట రైతులు కాపలా లేని సమయంలో వచ్చే దొంగలతో పాటు అడవి పందుల నుంచి రక్షణ కల్పించే పరికరాన్ని కనిపెట్టాడు. దీనిని వ్యవసాయ క్షేత్రం వద్ద, తాళం వేసిన ఇంటికి అమరిస్తే ఎవరైనా అక్కడికి వస్తే అలారం మోగుతుంది. రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ వెళుతుంది. దీంతో చోరీలను అరికట్టవచ్చు.

News August 15, 2024

నల్గొండ జిల్లాలో 24 కొత్త గ్రామ పంచాయతీలు

image

నల్గొండ జిల్లాలో మరికొన్ని పంచాయతీలు ఏర్పడనున్నాయి. గత ప్రభుత్వం తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో మరికొన్ని గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసింది. జిల్లాలో కొత్తగా 24 గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నాయి.

News August 15, 2024

జాతీయ జెండా రూపకల్పన మన సూర్యాపేట జిల్లాలోనే

image

ఇవాళ దేశమంతా స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటోంది. సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగరేస్తోంది. అయితే ఆ జెండాను రూపొందించింది మన సూర్యాపేట జిల్లాలోనే. జాతీయ జెండాను పింగళి వెంకయ్య నడిగూడెం కోటలోనే రూపకల్పన చేశారు. జమిందార్ రాజానాయిని రంగారావు మిత్రుడైన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేయగా, 1921 ఏప్రిల్ 1 తేదీన విజయవాడలో జరిగిన సమావేశంలో గాంధీజీ ఆమోదించారు.

News August 15, 2024

మూడో విడత రుణమాఫీలో రూ.442.87 కోట్లు

image

నల్గొండ జిల్లాలో మూడో విడతగా రూ.2లక్షల వరకు రుణమాఫీ నగదు రైతుల ఖాతాలో గురువారం జమ కానున్నాయి. రుణమాఫీకి అర్హులైన ఖాతాలు 35,501 ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జులై 18న మొదటి విడత రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది. జులై 30న రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేశారు. మూడో విడతలో జిల్లాలో 35,501 ఖాతాలుండగా.. 26,586 కుటుంబాలకు రూ.442.87 కోట్లు నిధులు జమ కానున్నాయి.

News August 14, 2024

మువ్వన్నెల కాంతుల్లో నాగార్జునసాగర్

image

మువ్వన్నెల కాంతుల్లో నాగార్జునసాగర్ మెరిసిపోతోంది. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేదీప్యమానంగా వెలిగేలా సాగర్ క్రస్ట్ గేట్లను ముస్తాబు చేశారు. మువ్వన్నెల కాంతుల సొబగులతో ప్రాజెక్టు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

News August 14, 2024

స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

image

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేటలో పరేడ్ గ్రౌండ్లో జరిగే 78వ భారత స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వేడుకలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News August 14, 2024

భువనగిరి: బాదం ఆకుపై అద్భుత చిత్రం

image

భువనగిరి మైనార్టీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బాదం ఆకుపై తెలంగాణ 33 జిల్లాల చిత్రపటంతో పాటు 78వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపేలా చిత్రాలు గీశారు. విద్యార్థులను, వారికి మెలకువలు నేర్పిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్ టీచర్ శ్రీనును ప్రిన్సిపల్ అభినందించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆర్ట్స్ & క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు.