Nalgonda

News August 14, 2024

ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, PHC కేంద్రాలలోని డాక్టర్లు , సిబ్బంది వారి వారి ఆసుపత్రులపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

News August 14, 2024

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే : గుత్తా సుఖేందర్ రెడ్డి

image

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ,దేశవ్యాప్తంగా యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని.. వాటి భారీ నుంచి యువతను కాపాడాలని అన్నారు.

News August 14, 2024

నాగార్జునసాగర్ సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయ సమాచారం..
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం: 312.45 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ: 311.74 టీఎంసీలు
ఇన్ ఫ్లో 46,839 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 46,839 క్యూసెక్కులు

News August 14, 2024

హైకోర్టు ఏజీపీగా డిండి మండల వాసి వేణుగోపాల్

image

గుండ్లపల్లి (డిండి) మండలం టీ.గౌరారం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పంబాల వేణుగోపాల్‌ను హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన కాశమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన పంబాల వేణుగోపాల్ దేవరకొండలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు.

News August 14, 2024

జాజిరెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

జాజిరెడ్డిగూడెం మండలం వేల్పులచర్ల వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బైక్ కింద పడడంతో  వెనకాల కూర్చున్న గోల్కొండ లక్ష్మమ్మ  మృతి చెందింది. భర్త బాలనర్సయ్యకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో  రోడ్డుపై పడిఉన్న ఆమెను భర్త ఒడిలోకి తీసుకొని భర్త కన్నీరుమున్నీరయ్యాడు. రోదిస్తూ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన తీరు గుండెలను పిండేసింది.

News August 14, 2024

గుప్త నిధుల తవ్వకాలకు వెళ్లిన జిల్లా వాసి దుర్మరణం

image

గుప్త నిధుల తవ్వకాలకు వెళ్లిన గుండాల మండలానికి చెందిన ఓ వ్యక్తి బండరాయి మీద పడి దుర్మరణం చెందాడు. సీతారాంపూర్ గ్రామానికి చెందిన పోలాస్ సత్తయ్య MBNRజిల్లా సల్కార్ పేట సమీపంలోని ఓ చెరువుకట్ట వద్ద తూములో గుప్త నిధులు ఉన్నాయని సమాచారం అందడంతో ఏడుగురు వ్యక్తులు బృందంగా ఏర్పడి 4 నెలలుగా సుమారు 18 అడుగుల లోతుకు పైగా గుంత తొవ్వారు. మే17న లోపలికి దిగిన సత్తయ్య పై బండరాయి పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 14, 2024

నాగార్జునసాగర్ జలాశయంలో మొసళ్ల సంచారం

image

నాగార్జునసాగర్ జలాశయ తీరంలో మంగళవారం మొసళ్లు కనిపించాయి. దీంతో జలాశయ తీరంలో చేపలు పట్టే మత్స్యకారులు, బట్టలు ఉతుక్కునేందుకు నీటిలోకి దిగేవారు, లాంచీ స్టేషన్‌లో లాంచీలు ఎక్కే పర్యాటకులు, విధులు నిర్వర్తించే ఎస్పీఎఫ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన వరదతో సాగర్ జలాశయంలోకి మొసళ్లు రావడం సహజమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

News August 14, 2024

స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి

image

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి గ్రామంలో, ప్రతి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగాలన్నారు. 

News August 14, 2024

బోధనా సిబ్బంది నియామకాలు పారదర్శకంగా జరగాలి: జిల్లా కలెక్టర్

image

బోధనా సిబ్బంది నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా గల బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించేందుకు జరుగుతున్న ఇంటర్వ్యూలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టులు, నియమాకం కాంట్రాక్టు పద్దతిలో నియమించుటకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెప్పారు.

News August 13, 2024

బీఆర్ఎస్ హాయంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: మంత్రి ఉత్తమ్

image

బీఆర్‌ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు 39% మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్ల సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హాయాంలో 90% ప్రాజెక్టు పూర్తి చేశామని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.