Nalgonda

News March 18, 2025

నల్గొండ ఎస్పీ కీలక నిర్ణయం

image

నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేరాలను తగ్గించేందుకు కొత్త ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా గ్రామానికి ఓ పోలీసు అధికారిని నియమించారు. కాగా వారు మంగళవారం విధుల్లో చేరనున్నారు. గ్రామ పోలీస్ అధికారులు తప్పనిసరిగా వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని, ప్రజలతో మమేకమవ్వాలని ఎస్పీ తెలిపారు. తద్వారా నేరాలను అదుపులో ఉంచొచ్చని చెప్పారు.

News March 18, 2025

నల్గొండ: పేదలకు అందని రేషన్ బియ్యం!

image

నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పేదలకు ఇంకా రేషన్ బియ్యం అందలేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. గడువు దాటినా బియ్యం అందకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కాగా జిల్లాలలో 4,66,061 రేషన్ కార్డులుండగా, 994 దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. త్వరగా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి 

image

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.

News March 18, 2025

నల్గొండ: మరో GOVT జాబ్ కొట్టిన టీచర్

image

నల్లగొండ రూరల్ మండలం ST కాలనీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న G.మౌనిక ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్‌గా సెలెక్ట్ అయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తోటి ఉపాధ్యాయులు ఉద్యోగం అభినందించారు. ఓవైపు టీచర్ జాబ్ చేసుకుంటూ పట్టుదలతో చదివి హాస్టల్ వెల్ఫేర్‌గా సెలెక్ట్ అయ్యారని కొనియాడారు. 

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

image

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్‌కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

News March 18, 2025

నల్గొండ: ఎల్ఆర్ఎస్ 25% రిబేట్‌కు స్పందన

image

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికి ప్రకటించిన 25% రిబెట్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మేరకు సోమవారం నల్గొండ మున్సిపల్ పరిధిలో 4 లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ చెల్లించి 25% రిబేటు పొందారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు.

News March 18, 2025

నల్గొండ: ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి: SP

image

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామంలో వీపీవో క్రమం తప్పకుండా సందర్శించి, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.

News March 18, 2025

టెన్త్ పరీక్షలు.. నల్గొండ డీఈవో ముఖ్య గమనిక 

image

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై ఇదివరకే అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయం వీడి మంచిగా పరీక్షలు రాయాలని సూచించారు. 

News March 18, 2025

నల్గొండ: ఇంటర్మీడియట్ పరీక్షలో 675 మంది విద్యార్థుల గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈవో దశ్రు నాయక్ తెలిపారు. సోమవారం ఫిజిక్స్ వన్, ఎకనామిక్స్ వన్ పరీక్షలు జరిగాయని చెప్పారు. 15,316 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 14,641 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 675 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.

News March 17, 2025

నల్గొండ: 35 మంది అర్జీదారులతో మాట్లాడిన ఎస్పీ 

image

పోలీసు గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈరోజు పరిశీలించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.