Nalgonda

News March 20, 2025

SLBCకి రూ.900 కోట్లు.. డిండికి రూ.400 కోట్లు

image

సాగునీటి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు రూ.900 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే డిండి ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.300 కేటాయించిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.400 కోట్లకు పెంచింది. దీంతో డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.

News March 20, 2025

బై.. బై.. ముగిసిన ‘ఇంటర్‌ ప్రథమ’ పరీక్షలు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలతో సందడి చేశారు. ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.

News March 19, 2025

25న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: కలెక్టర్

image

NLG ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్ విభాగములో బోధన సిబ్బంది ప్రొఫెసర్ (04), అసోసియేట్ ప్రొఫెసర్ (16), అసిస్టెంట్ ప్రొఫెసర్ (15), సీనియర్ రెసిడెంట్ (12), ట్యూటర్ (13) (తాత్కాలికంగా) పోస్టులకు ఈనెల 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం https://nalgonda.telangana.gov.in/ & www.gmcnalgonda.in లో పూర్తి వివరాలు ఉన్నట్లు తెలిపారు.

News March 19, 2025

మెట్ట పంటలపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

image

ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడం ద్వారా వరి వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. చిట్యాల మండలంలో కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రం సందర్శించి రైతు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వాన కాలంలో వరి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగించుకుని మెట్ట పంటలు, పండ్లు కూరగాయలు సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు.

News March 19, 2025

NLG: రాజకీయ పార్టీలు సహకరించాలి: ఆర్డీవో

image

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు.. మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని నల్గొండ RDO అశోక్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో ఆన్‌లైన్లో రోజువారి ఓటర్ నమోదు అవుతున్న ఫామ్ 6,7,8ల పరిష్కారం, డూప్లికేట్ ఓటర్లు తొలగింపు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

News March 19, 2025

NLG: లక్ష ఎకరాలకు సాగునీరు.. 107 గ్రామాలకు తాగునీరు

image

ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేస్తామన్నారు. 

News March 19, 2025

NLG: చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలి

image

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కోసం అర్హత గల చేనేత కార్మికులకు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ డైరెక్టర్ ఎస్.ద్వారక్ తెలిపారు. చేనేత, డిజైన్ వృత్తిలో పని చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికీ రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News March 19, 2025

తుపాకి చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం

image

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం. కొత్తగూడెంలో 1931లో భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. సాయుధ పోరాటంలో తన అన్న నర్సింహారెడ్డితో కలిసి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. 1978, 1983లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి.

News March 19, 2025

NLG: మఖానా సాగుపై కసరత్తు

image

జిల్లాలో మఖానా సాగు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిహార్‌లో మాత్రమే రైతులు చేస్తున్న మఖానా సాగుపై జిల్లా అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా వానాకాలం నుంచి మఖానా సాగు చేయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల పర్యవేక్షణలో కార్యాచరణ రూపొందించారు.

News March 19, 2025

నల్గొండ: బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

image

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని 11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే డిండి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి, ఏఎంఆర్పీ పరిధిలోని కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. పాత ఎత్తిపోతల పథకాలకు ఫండ్స్ ఇవ్వాలన రైతులు కోరుతున్నారు.