Nalgonda

News August 10, 2024

కేంద్రంలో ఉద్యోగం చేస్తూ.. AEE గా ఎంపిక

image

మాడుగులపల్లి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మండల దుర్గయ్య, వెంకటమ్మ కుమారుడు శివ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన TGSPSC ఫలితాల్లో నీటిపారుదల శాఖ AEE గా ఎంపికయ్యాడు. రైతు కుటుంబం నుండి ఉన్నత చదువులు చదివి, AEE గా ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు.

News August 10, 2024

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

image

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 10, 2024

NLG: ఈ బస్సుల్లో మహాలక్ష్మి వర్తించదు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి నాగార్జునసాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్ తెలిపారు. ప్రతి డిపో నుంచి ప్రత్యేక బస్సులు సాగర్‌కు వెళతాయన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తించదని, ప్రయాణికులంతా టికెట్ ధర చెల్లించాలని పేర్కొన్నారు. ఏడు డిపోల నుంచి శని, ఆది వారాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.

News August 10, 2024

‘నాగార్జునసాగర్‌కు ప్రత్యేక బస్సులు’

image

నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తినందున ఆగస్టు 10, 11 తేదీలలో ఉమ్మడి నల్లగొండ రీజినల్‌లోని అన్ని ఆర్టీసీ డిపోల నుండి సాగర్‌కి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని ఉమ్మడి నల్గొండ ఆర్ఎం M. రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.

News August 9, 2024

NLG: స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

image

తెలంగాణ BC స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు NLG BC స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ K.విజయ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో శిక్షణతోపాటు ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 9, 2024

NLG: ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు

image

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం చింతల్ తండాకు చెందిన రామావత్ రాందాస్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. ఎస్ఎస్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2020, 2021లో, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2022, 2023లో అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కేంద్ర హోం శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ బెంగుళూరులో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.

News August 9, 2024

NLG: పూర్తి కావొచ్చిన కుటుంబ వినియోగ వ్యయ సర్వే!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుటుంబ వినియోగ వ్యయ పూర్తి కావచ్చింది. పట్టణ ప్రజల జీవన విధానాలు, జీవనశైలి, ఆదాయం ఖర్చు తదితర అంశాలపై ఉమ్మడి జిల్లాలో జాతీయ గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి చేపట్టిన కుటుంబ సర్వే ఆగస్టుతో ముగియనున్నది. ఒక్కో కుటుంబాన్ని సర్వే చేసేందుకు అధికారులు సుమారు గంట సమయం తీసుకుంటున్నారు..

News August 9, 2024

SRPT: GREAT.. 4 GOVT JOBS సాధించింది!

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.

News August 9, 2024

చేప పిల్లలు వద్దు.. నగదు బదిలీ చేయండి!

image

మత్స్యకారులకు చేప పిల్లల బదులు నగదు బదిలీ చేయాలని ఉమ్మడి జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి తమను మోసం చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. లెక్కింపు సమయంలోనే కాంట్రాక్టర్లు తమను మాయం చేస్తున్నట్లు తాము అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

News August 9, 2024

SRPT: కుమారుడి అప్పులు.. తల్లి సూసైడ్

image

కుమారుడు చేసిన అప్పుల వల్ల తల్లి సూసైడ్ చేసుకుంది.. ఈ ఘటన సూర్యాపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కలమ్మ సూర్యాపేటలో నివసిస్తోంది. ఆమె కుమారుడు జల్సాలకు అలపాడుపడ్డాడు. ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు రోజూ ఇంటికి వచ్చి అడగడంతో ఆమె మనస్తాపానికి గురైంది. నల్ల చెరువు సమీపంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.