India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్కు మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా నకిరేకల్లో సీపీఐ ఎంఎల్ జనశక్తి సీనియర్ నాయకులు చిట్టూరి సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె తెలంగాణ ఉద్యమ సారథి కళాకారిణి పల్స నిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమయ్యకు ఒక్కరే సంతానం కావడంతో అన్నీ తానై తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్కతో పాటు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమయ్య మృతితో నకిరేకల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
సూర్యాపేట జిల్లా ఎస్పీగా కే.నరసింహ నియమితులైన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం. మహబూబ్నగర్ ఎస్పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీఐజీ కార్యాలయానికి అటాచ్ అయి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తూ తాజాగా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయి ఎస్పీగా వెళ్లారు.
మిర్యాలగూడ శాంతినగర్కు చెందిన సందీప్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సంస్థ సభ్యులు సందీప్ కుటుంబ సభ్యులను సంపద్రించడంతో వారు అవయవదానానికి ఒప్పుకున్నారు. సందీప్ గుండె, కాలేయం, కిడ్నీలు, కార్నియా సేకరించారు. సందీప్ మరణించినప్పటికీ అవయవదానం చేసి మరో నలుగురికి పునర్జన్మను ఇచ్చారని పలువురు సందీప్ కుటుంబ సభ్యులను అభినందించారు.
చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో యాక్సిడెంట్ జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఉదయం నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు.
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన అద్దంకి రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా సామేలుకు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా అద్దంకికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నల్గొండ జిల్లాలో చాలాచోట్ల రేషన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. కనీసం సగానికిపైగా రేషన్ దుకాణాలకు బియ్యం కోటా అందలేదు. దీంతో లబ్ధిదారులకు ప్రతినెలా 1వ తేదీ నుంచి మొదలు కావాల్సిన బియ్యం పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లబ్ధిదారులు దుకాణాల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో పూర్తిస్థాయి రేషన్ పంపిణీకి మరో వారం నుంచి పది రోజులకు పైగానే పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లాలోని బల్దియాల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ వేగం అందుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం సమీపిస్తున్నా.. ఏడు మున్సిపాలిటీల్లో లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్స్ కింద ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బకాయిదారులకు అధికారులు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి ఇళ్లు వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరేశం, జైవీర్ రెడ్డి, సామెలు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.