India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రీజనల్ రింగ్ రోడ్డుపై భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. HYD-పుణె హైవేని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. HYD-VJD హైవేని క్రాస్ చేసే CPL వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్ ను ఎంపిక చేశారు. 8 వరసల (తొలి దశలో 4 వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్ చేంజ్ లను విశాలంగా రూపొందిస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మొట్టమొదటిసారి నీటిని విడుదల చేసి నేటితో 57ఏళ్లు నిండాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
సాగర్ నీటి విడుదల నేపథ్యంలో ఈ సీజన్లో జిల్లాకు అదనంగా 4,400 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయిస్తామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు హామీ ఇచ్చారని డీఏఓ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు నెల వారి కోటా కంటే అదనంగా కేటాయించారని పేర్కొన్నారు. ఆ ఎరువులు వారం రోజుల్లో జిల్లాకు రానున్నాయని ఆయన పేర్కొన్నారు.
శాలిగౌరారం మండలం అంబారిపేటలో మిత్రులు మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా.. గ్రామానికి చెందిన భూపతి నరేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ HYDలో చికిత్స పొందుతున్నాడు. 2000-2001 ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు తమ దోస్త్ నరేశ్ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మిత్రులు వెంకన్న, శ్రావణ్ కుమార్, లింగాల వెంకన్న, యాదయ్య ఆర్థిక సహాయంగా రూ.25వేలు అందించి ఆదర్శంగా నిలిచి స్నేహాన్ని చాటుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు వరిలో సన్న రకాల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో సన్న రకం బియ్యానికి మంచి ధర పలుకుతోంది. అంతేకాకుండా ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఈసారి వర్షాలు అనుకూలించకపోయినప్పటికీ చాలా మంది రైతులు సన్నరకాల నారు పోశారు. నీటి వసతులు ఉన్నచోట నాట్లు సైతం వేశారు. సాగర్ కూడా నిండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారంఇన్ ఫ్లో :4,58,393 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 40,560క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం: 571.40 అడుగులుపూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 260.0858 టీఎంసీలు
దోస్తానా అంటే నల్గొండ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు ఇక్కడ కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
నాగార్జునసాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపనున్న దృష్ట్యా రైతులెవరు సాగునీటిని మళ్ళించుకోకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శనివారం ఆయన నాగార్జునసాగర్ నీటి వినియోగంపై రెవెన్యూ, పోలీస్,ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విధంగా ఉంది.
ఇన్ ఫ్లో :4,17,147క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 35,953 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 561.50అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 235.9395టీఎంసీలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు హైదరాబాద్లోని వారసిగూడకు చెందిన సాయి కుమార్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.