India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నకిరేకల్ మండలం నోములకి
చెందిన వెల్మకంటి అనిత(28) అనే వివాహిత, ప్రియుడి వేధింపులు తాళలేక ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టేకుల రాజేశ్తో అనితకు కొంతకాలం క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. తనతోనే ఉండాలన్న రాజేశ్ వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆహారభద్రతా కార్డుల్లో రెండో బిడ్డ వివరాలను చేర్పించే అవకాశం లేకుండా పోయింది. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలు లేదు. దీంతో వేలాది మంది బాధితులు వారి బిడ్డల వివరాలు కార్డుల్లో లేకపోవడంతో మదనపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 10.07 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 29.84 లక్షల మంది సభ్యులు (యూనిట్లు) ఉన్నారు. సుమారు 50 వేల మందికి పైగా మీ-సేవా కేంద్రాల్లో ఆరేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు, ఇంజనీరింగ్ పట్టభద్రులకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉపాధినిచ్చే దిశగా గత ప్రభుత్వం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఐటి హబ్లు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో అట్టహాసంగా ముందుకొచ్చిన పలు కంపెనీలు ఏడాది గడవకముందే.. సదరు కంపెనీలు లేకపోవడంతో హబ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి.
సూర్యాపేట మండలంలో జాటోత్ తండాలో తెల్లవారుజామున దారుణం జరిగింది. తండాకు చెందిన దరావత్ రమణను దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గిరిబాబు (22)కు తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది గిరిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జునసాగర్లోకి రోజూ 30 టీఎంసీలకు పైగా నీరు చేరుతోంది. సాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312.05 టీఎంసీలకు గాను శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 211.10 టీఎంసీలకు చేరింది. ఇప్పటికే వరద నీరు ప్రాజెక్టు గేట్లను తాకింది. 2,3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోందని అధికారులు భావిస్తున్నారు.
ఈనెల 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన NLG నుండి మండల స్థాయి అధికారులతో స్వచ్ఛదనం పచ్చదనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మొక్కలు నాటడం, తాగునీరు, వివిధ సంస్థల పరిశుభ్రత, వీధికుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు.
యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.
యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.
నాగార్జునసాగర్ జలాశయానికి భారీ ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 3,88,878 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా ఔట్ ఫ్లో 28,878 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 546 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 312.50టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.