Nalgonda

News March 9, 2025

NLG: ముఖం చూపిస్తేనే సరుకులు!

image

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(FRS) తీసుకొచ్చింది. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే మరొకరికి ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుడి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం హాజరు ఆధారంగా సరుకులు ఇవ్వనున్నారు.

News March 9, 2025

నల్గొండ: 59 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్

image

NLG జిల్లాలో 59 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సూపర్ న్యూమరీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫీస్ సబార్డినేట్ ఖాళీల్లో సూపర్ న్యూమరీ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇస్తుంది. ఈ నియామకం ద్వారా జూ. అసిస్టెంట్లుగా చేరుతున్న వారిని భవిష్యత్‌లో జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ పోస్టు ఖాళీ అయితే సీనియారిటీ ప్రకారం ఆ పోస్టుల్లోకి మార్చనున్నట్లు తెలుస్తోంది.

News March 9, 2025

నల్గొండ: ఈనెల 10న హాకీ పోటీలకు సెలక్షన్స్..

image

ఈనెల 16,17,18 తేదీల్లో హుజురాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల హాకీ జట్టు ఎంపికలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈనెల 10న జరుగుతాయని హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం తెలిపారు. సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా ఐడీ కార్డ్, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని, వివరాలకు 8125032751 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News March 8, 2025

కలెక్టర్, ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి కోమటిరెడ్డి సన్మానం

image

శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఎమ్మెల్యే నల్లమాద పద్మావతిలను మంత్రి కోమటిరెడి స్వయంగా సన్మానించి మహిళా దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

News March 8, 2025

నల్గొండ: మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసిన ఎస్పీ

image

మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మహిళా సిబ్బందితో కలిసి తన కార్యాలయంలో సతీమణి పూజతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని, అదేవిధంగా మహిళలందరూ కష్టపడి ఎదుగుతన్నారన్నారు. మహిళా సాధికారతను సాధించాలని.. అప్పుడే ఈ సమాజం మీకు గుర్తింపు ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News March 8, 2025

నల్గొండ: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరణ

image

నల్గొండ పట్టణంలోని ఉస్మాన్‌పురాకు చెందిన హై స్కూల్ అటెండర్ <<15575023>>మహమ్మద్ ఖలీల్<<>> గతనెల 25న మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సమయంలో ఖలీల్ ఒంటిపై గాయాలను చూసిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో హత్యేనని రిపోర్టు వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్యే హత్య చేసినట్లు తేలింది. హత్య భార్య చేసిందా లేదా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 8, 2025

నల్గొండ: ఈ గ్రామ మహిళలు అందరికీ స్ఫూర్తి 

image

చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన మహిళలు ఇతర గ్రామాల మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తమ గ్రామంలో మద్యం అమ్మకాలు జరపకూడదని పోరాటం చేసి విజయం సాధించారు. బెల్టు షాపులను మూసివేయించారు. మద్యం సేవించి ఇటీవల గ్రామానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గ్రామానికి చెందిన మహిళల్లో పోరాట పటిమను పెంచి, మద్యంపై యుద్ధం చేయించింది.

News March 8, 2025

నల్గొండ: మహిళా జర్నలిస్టుగా రాణిస్తున్న కవిత

image

చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన కట్ట కవిత జర్నలిస్టుగా రాణిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2017లో ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. మీడియాలో పనిచేస్తున్న వారికి ఇచ్చే నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా 2020 ఫెలోషిప్‌ని కూడా ఆమె అందుకున్నారు.

News March 8, 2025

నల్గొండ: 30 రోజుల్లో 3 వేల బోర్లు!

image

ఓవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు.. మరోవైపు అడుగంటుతున్న జలాశయాలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో నాన్ఆయకట్టులో వరి పంటకు తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క NLG మండలంలోనే నెల రోజుల్లో 3 వేల వరకు కొత్తగా బోర్లు వేసినట్లు సమాచారం.

News March 8, 2025

NLG: 576 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 14,403 మంది విద్యార్థులకు గాను 13,827 మంది హాజరయ్యారు. కాగా 576 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.