India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అప్పుడే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండు వేసవికి ముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాక ముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 36.21 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. ఐదు రోజులుగా జిల్లాలో క్రమంగా 3.0 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దాదాపు ఆరేళ్లుగా <<15708073>>కోర్టులోనే విచారణ<<>> కొనసాగుతోంది.ఎట్టకేలకు ఈరోజు తుది తీర్పు రానుంది. కాగా A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ప్రణయ్ను చంపిన బిహార్ వాసి సుభాష్ శర్మ A2గా, అజ్గర్ అలీ A3గా ,అబ్దుల్లా బారీ A4గా, MA కరీం A5గా, మారుతీరావు తమ్ముడు శ్రావణ్ A6గా, డ్రైవర్ శివ A7గా, నిజాం A8గా ఉన్నారు. ఈరోజు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
> టెన్త్ నుంచి ప్రణయ్, అమృత ఫ్రెండ్స్
> 2018 JANలో HYDలో వారి ప్రేమ పెళ్లి
> విషయం తెలిసి 2కుటుంబాల్లో గొడవలు.. PSలో ఫిర్యాదు
> 2018 SEP 14న కులాంతర వివాహం తట్టుకోలేక ప్రణయ్ను దుండగుడితో <<15707820>>చంపించిన<<>> మారుతీరావు
> ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు
> 2019 JUN 12న అప్పటి SPరంగనాథ్ ఆధ్వర్యంలో 1600పేజీల ఛార్జిషీట్ రూపొందించిన పోలీసులు
> 2020 మార్చిలో మారుతీరావు సూసైడ్
> నేడు తుది తీర్పు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.
శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం NLG జిల్లా సీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. దయాకర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారని ఈయనకు పేరు.
NSUI యూత్ కాంగ్రెస్ నేతగా కెతావత్ శంకర్ నాయక్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈయన 90లలో అప్పటి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు రాగ్యానాయక్ అనుచరుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా గెలిచారు. సీనియర్ పార్టీ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత ఉమ్మడి దామరచర్లకి ఎంపీపీ, జడ్పీటీసీగా చేశారు. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ప్రస్తుతం NLG డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని నల్గొండ పట్టణం, మునుగోడు, నాగార్జున సాగర్, నకిరేకల్కు రూ.200కోట్ల చొప్పున రూ.800 కోట్లు మంజూరు చేశారు.
ఈనెల 11, 12 తేదీలలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యుల బృందం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 11న నల్గొండ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సా.5.30వరకు సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. ఈ మేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10.00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.