Nalgonda

News August 2, 2024

NLG: ఒకే కౌంటర్ ద్వారా భోజనం.. ఉపాధ్యాయుల మండిపాటు!

image

HYDలో సీఎం రేవంత్ రెడ్డితో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సమావేశం ఇవాళ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జిల్లా నుండి ఉపాధ్యాయులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాటు చేసి CPL వ్యవసాయ మార్కెట్లో భోజన వసతి కల్పించారు. అయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మందికి ఇక్కడ ఒకే కౌంటర్ ద్వారా భోజనం వడ్డించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొని ఇబ్బందులు పడ్డారు.

News August 2, 2024

బ్రాహ్మణవెల్లంలలో వృద్ధురాలి హత్య

image

నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో శుక్రవారం తెల్లవారుజామున మర్డర్ కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని రెబ్బ జానకమ్మ(72)అనే మహిళను ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 2, 2024

NLG: దరఖాస్తులు 2,05,494.. రూ.20 కోట్లకు పైగా ఆదాయం

image

ఎల్ఆర్ఎస్‌కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అందులో నందికొండ మినహా మిగతా మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్‌కు 2,05,494 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ఫీజు వసూలు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలోనే 20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

News August 2, 2024

గణనీయంగా తగ్గిన విద్యుత్ ఫిర్యాదులు!

image

విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. 2023 జనవరి-జూన్ మధ్య కాలంలో 5,83,672 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది ఇదే కాలవ్యవధిలో 3,97,934 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 31.82 శాతం ఫిర్యాదు తగ్గినట్టు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా 35949 ఫిర్యాదులు వచ్చాయి.

News August 2, 2024

మిర్యాలగూడ వాసికి ఏడాదికి రూ.34 లక్షల వేతనం 

image

మిర్యాలగూడకి చెందిన అయేషా ప్రముఖ సంస్థంలో ఏడాదికి రూ.34లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె నాగ్‌పూర్‌ ఐఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. తండ్రి నుస్రత్ అలీ మిర్యాలగూడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాగా తల్లి అజ్మత్ గృహిణీ. అయేషా ప్రాథమిక విద్య మిర్యాలగూడలో పూర్తి చేసింది. అయేషాను కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.

News August 2, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 544.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుండగా ప్రస్తుతం 198.04 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో: 3,27,969 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో: 30,747 క్యూసెక్కులుగా ఉంది. 

News August 2, 2024

సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

News August 2, 2024

మాదకద్రవ్యాలను నియంత్రించాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాలు
ఏ రూపంలో ఉన్న నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ (ఎన్ కార్డ్ ) సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

News August 1, 2024

మానవత్వం చాటుకున్న  బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్

image

చిన్న శంకరంపేటకి చెందిన కౌలు రైతు దడువాయి పరమేశ్వర్ కొద్ది రోజుల క్రితం అప్పులు తీర్చలేక భాదతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు. పేదరికంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ గురువారం పరమేశ్వర్ భార్య శంకరమ్మకు రూ.20 వేల ఆర్ధిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

News August 1, 2024

మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు : నారాయణరెడ్డి

image

నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌‌తో కలిసి జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.