Nalgonda

News August 29, 2025

NLG: సెప్టెంబర్ 4 వరకు పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో చేయూత పింఛన్లను సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. పెన్షన్ దారులంతా రూ.16 చిల్లరను అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు. మధ్య దళారులను నమ్మకూడదని సూచించారు.

News August 29, 2025

NLG: ముసాయిదా ఓటరు జాబితా విడుదల

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. తుది ఓటరు జాబితా తయారీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జిల్లాలోని 869 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గురువారం జాబితాను విడుదల చేశారు.

News August 29, 2025

NLG: నేడు రైతు కమిషన్ బృందం పర్యటన

image

బత్తాయి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం నేడు, రేపు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి, గుంటిపల్లి గ్రామాల్లో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితో పాటు పలువురు సభ్యులు గ్రామాల్లోని బత్తాయి, పామాయిల్ ఆయా తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

News August 29, 2025

NLG: భారత సైన్యం ఆహ్వానిస్తుంది.. దరఖాస్తు చేసుకోండి

image

భారత సైన్యంలో అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అభ్యర్థులు JAN 2005 నుంచి JUL 2008 మధ్య జన్మించి ఉండాలని, ఇంటర్ లేదా డిప్లొమాలో ఏదైనా గ్రూపులో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 29, 2025

NLG: 29 నుంచి పెన్షన్ల పంపిణీ

image

వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్లను ఈ నెల 29 నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు సెప్టెంబర్ 4 వరకు నేరుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తమ పెన్షన్‌ను తీసుకోవచ్చని చెప్పారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.

News August 28, 2025

NLG: ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్లకు ఈనెల 30 చివరి తేదీ

image

నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News August 28, 2025

జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్‌ నుంచి మేకల అభినవ్‌ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

News August 28, 2025

పాఠశాలల బలోపేతానికి చర్యలు: కలెక్టర్‌

image

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తన కార్యాలయంలో డీఈవో బిక్షపతి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలతో ఆమె విద్యా విషయక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫాంలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ఆమె సమీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News August 28, 2025

సురక్ష బీమా యోజన నమోదు చేయించాలి: శేఖర్ రెడ్డి

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరినీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)లో నమోదు చేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నమోదైన వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 28, 2025

దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆమె ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 33,600 మరణాలు సంభవించినప్పటికీ, ఈ పథకం కింద కేవలం 3,121 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరగాలని ఆమె సూచించారు.