India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జనగామ(D) దేవరుప్పుల(M) కామారెడ్డిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకన్న జనగామలో పత్తి అన్లోడ్ చేసి తిరిగి మిర్యాలగూడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు డీసీఎం ఆన్లో ఉండగా స్థానికులకు డౌట్ వచ్చి గమనించడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.

జిల్లాలో BSNL సేవల్లో అంతరాయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు నెట్ వర్క్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడం.. మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్ కట్ అవడం.. ఇక ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మొబైల్ డేటా రాకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో సైతం అంతరాయం ఏర్పడుతుంది.

బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది NOV నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. బాలికలకు కరాటే జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టులు మంజూరైనా భర్తీకి నోచుకోవడం లేదు. ఈ కళాశాలలో రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టులను భర్తీ చేయగా.. ఏడాది కిందట మరో 237 పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. ఏడాది దాటిన ఆ పోస్టుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేవరకొండ మండలంలోని పర్వతరావు చెరువు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.1.22 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరు కావడం పట్ల ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం ఈ ఏడాది లక్ష్యాన్ని మించి విద్యుత్తును ఉత్పత్తి చేసిందని జెన్కో సీఈ మంగేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది 70 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, మంగళవారం రాత్రికి ఆ లక్ష్యాన్ని మించి ఉత్పత్తిని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐడల్ డైరెక్టర్ అజయ్ కుమార్ విద్యుత్ అధికారులను అభినందించారు.

నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల పరిశీలకులు బిశ్వరంజన్ మహంతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న 20 మందిలో 10 మంది బీసీలు, నలుగురు ఓసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు. ఈ దరఖాస్తుదారుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె దాన్యం సేకరణపై పౌర సరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్షించారు.

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.

మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని, అత్యాచారం చేసిన కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గురజాల చందుకు ఏకకాలంలో మొత్తం 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.