India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూముల విలువను ప్రభుత్వం పెంచుతున్నట్టు ప్రచారంతో రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు 10, 20 రిజిస్ట్రేషన్లు అయ్యేచోట 40 నుంచి 50 వరకు, 70, 80 అయ్యే చోట 150 నుంచి 180 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆగస్టు 1 నుంచే ధరలు పెరుగుతాయని ప్రచారం సాగుతుండటంతో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. తంగేడు వనం వద్ద రెండు లారీలు ఢీకొట్టుకోవడం భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదు నుంచి చౌటుప్పల్ వైపు బీర్ల లోడుతో వస్తున్న లారీని అదే వైపు ఉల్లిగడ్డ లోడుతో వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
ఉమ్మడి జిల్లాలో నష్టాల బాటలో ప్రయాణిస్తున్న ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం వరంలా మారింది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఉమ్మడి జిల్లాలోని డిపోలు లాభాల బాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. 2023- 24 మార్చి నాటికి రూ.49 కోట్ల ఆదాయంతో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
రైతు రుణమాఫీ రెండో విడతలోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈనెల 18న చేసిన మొదటి విడత రుణమాఫీలో ఏయే సమస్యలతో రుణమాఫీ కాలేదో ఇప్పుడూ అవే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని అనేక మంది రైతులకు మాఫీ వర్తించలేదు. పలు కారణాలతో రుణమాఫీ కాకపోవడంతో చాలామంది రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం కురుమిద్దేకు చెందిన రమావత్ సుజాత(21)కు చింతపల్లి మండలం గాశిరాంతండాకు చెందిన రమావత్ శివ(23)తో 2023 మే 5న వివాహం జరిగింది. భర్త వేధింపులు తాళలేక హయత్ నగర్లో నివాసముంటున్న ఇంట్లోనే భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 522.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.5050 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 153.3180 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ ఇన్ ప్లో: 2,32,843 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 27,454 క్యూసెక్కులుగా ఉంది.
బీబీనగర్-పోచంపల్లి రహదారిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బడుగు నరసింహ అనే వ్యక్తి మృతిచెందాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన నరసింహ అన్న బడుగు స్వామి అనారోగ్యంతో మహారాష్ట్రలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది. పోచంపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులకు సోదరుడు చనిపోయిన విషయం చెప్పాలని బీబీనగర్ నుంచి బైక్పై బయల్దేరాడు. బీబీనగర్ దాటిన వెంటనే ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని చనిపోయాడు.
ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రాజెక్టులోకి వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1.79 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. నీటిమట్టం 518 అడుగులు, 145 టీఎంసీలుగా ఉంది. భారీ ఇన్ఫ్లోతో రోజూ 20 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి చేరనుంది. ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో నేపథ్యంలో ఆగస్టు 2న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.
రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో 2వ విడత లక్షన్నర లోపు రుణాలున్న 43,130 రైతు కుటుంబాలకు సంబంధించిన 50,409 బ్యాంకు ఖాతాలలో రూ.503.89 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత జిల్లాలో లక్ష లోపు రుణాలున్న 78,757 రైతు కుటుంబాలకు సంబంధించి 83,121 బ్యాంకు ఖాతాలలో రూ.481.63 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయటం సంతోషకరమని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని కతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బిక్షపతి, మునీశ్వరానంద స్వామి, ఎంఈఓ కే.ఆరుంధతి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.