India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో యాక్సిడెంట్ జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఉదయం నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు.
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన అద్దంకి రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా సామేలుకు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా అద్దంకికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నల్గొండ జిల్లాలో చాలాచోట్ల రేషన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. కనీసం సగానికిపైగా రేషన్ దుకాణాలకు బియ్యం కోటా అందలేదు. దీంతో లబ్ధిదారులకు ప్రతినెలా 1వ తేదీ నుంచి మొదలు కావాల్సిన బియ్యం పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లబ్ధిదారులు దుకాణాల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో పూర్తిస్థాయి రేషన్ పంపిణీకి మరో వారం నుంచి పది రోజులకు పైగానే పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లాలోని బల్దియాల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ వేగం అందుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం సమీపిస్తున్నా.. ఏడు మున్సిపాలిటీల్లో లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్స్ కింద ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బకాయిదారులకు అధికారులు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి ఇళ్లు వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరేశం, జైవీర్ రెడ్డి, సామెలు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(FRS) తీసుకొచ్చింది. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే మరొకరికి ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుడి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం హాజరు ఆధారంగా సరుకులు ఇవ్వనున్నారు.
NLG జిల్లాలో 59 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సూపర్ న్యూమరీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫీస్ సబార్డినేట్ ఖాళీల్లో సూపర్ న్యూమరీ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇస్తుంది. ఈ నియామకం ద్వారా జూ. అసిస్టెంట్లుగా చేరుతున్న వారిని భవిష్యత్లో జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ పోస్టు ఖాళీ అయితే సీనియారిటీ ప్రకారం ఆ పోస్టుల్లోకి మార్చనున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 16,17,18 తేదీల్లో హుజురాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల హాకీ జట్టు ఎంపికలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈనెల 10న జరుగుతాయని హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం తెలిపారు. సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా ఐడీ కార్డ్, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని, వివరాలకు 8125032751 నంబర్ను సంప్రదించాలని కోరారు.
శనివారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఎమ్మెల్యే నల్లమాద పద్మావతిలను మంత్రి కోమటిరెడి స్వయంగా సన్మానించి మహిళా దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.