India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రామాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఓవైపు జిల్లాలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు గ్రామాల్లో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వినాయక చవితి వేడుకలు తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్లు ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేచింది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు మునుపు జెండా మోసిన వారంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా గణేష్ నిమజ్జనం జరిగే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించడంతో నేతల్లో మళ్లీ ఆశలు పుట్టుకొస్తున్నాయి.
నల్గొండ ఎస్ఎల్బీసీ డాన్ బోస్కో అకాడమీలో ఈనెల 29న ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ బాలశౌరిరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని టెన్త్ నుంచి పీజీ, టెక్నికల్ కోర్సులు ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జెన్ ప్యాక్ట్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, హెటిరోడ్రగ్స్, మెడిప్లస్, డీమార్ట్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.
నల్గొండ ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని రామాలయంలోని మొదటి గణేశ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
జిల్లాల్లోని పొరుగు సేవల ఉద్యోగులు వేతనాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని చెబుతున్నారు. ఉభయ జిల్లాల్లో సుమారు 7 వేల మంది పొరుగు సేవల ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది. సకాలంలో వేతనాలు అందకపోవటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో అదనపు రుణం అందక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో కలిసి ఇప్పటి వరకు 12,064 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం స్వయం సహాయం సంఘాల మహిళలు లబ్ధిదారులుగా ఉంటే రూ.లక్ష అదనంగా రుణం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు అమల్లోకి రావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ‘ఇన్ స్పైర్ మనక్’ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలు ఎదిగేందుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు HMలు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పనులు వేగవంతం అయ్యాయి. ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు అనుగుణంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో గెజిటెడ్ హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియను ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎస్టీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది. జిల్లాలో 156 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గాను 148 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. వారంతా మంగళవారం విధుల్లో చేరడంతో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది.
ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్), ఐటీఐల్లో 2025-27 సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా ఐటీఐల కన్వీనర్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 30లోగా http://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయడంతో పాటు మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.