Nalgonda

News February 3, 2025

నల్గొండ: రేపటి నుంచి స్తంభగిరి బ్రహ్మోత్సవాలు

image

మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు మారేపల్లి నర్సింహా చార్యులు తెలిపారు. 8న రాత్రి కళ్యాణం, 12న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు. 

News February 3, 2025

NLG: స్థానిక సమరానికి వడివడిగా అడుగులు

image

NLG జిల్లాలో స్థానిక సమరానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల బీసీ కుల గణన పూర్తి కావడం, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, తర్వాత క్యాబినెట్‌లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటారనే సమాచారంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ జిల్లాలో 856 గ్రామపంచాయతీలు, 7392 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల వైపు ఆశగా చూస్తున్నారు.

News February 3, 2025

మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి

image

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News February 3, 2025

NLG: చేనేత కళాకారుల జీవన విధానంపై సినిమా

image

పోచంపల్లి చేనేత కళాకారుల జీవన విధానంపై ఓ సినిమా రూపొందుతోంది. చౌటుప్పల్‌కి చెందిన వ్యాపారవేత్త ధనుంజయ నిర్మాతగా, పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వంలో ది అవార్డ్ 1996 అనే సినిమా తీస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసినట్లు ధనుంజయ తెలిపారు. ఈ సినిమా మొత్తం గ్రామాల్లో చేనేత కళాకారుల జీవన విధానం, వారు దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో తెలిపే విధంగా ఉంటుందన్నారు.

News February 3, 2025

నల్గొండ: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు 

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేయగా 8,349 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  

News February 3, 2025

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు గట్టి బందోబస్తు: ఎస్పీ

image

చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

News February 2, 2025

NLG: రేపటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

image

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

News February 2, 2025

NLG: 99 మంది బాల కార్మికులకు విముక్తి

image

ఆపరేషన్ స్మైల్ 11వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 99 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. అన్ని శాఖల సమన్వయంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 61 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

News February 2, 2025

ఆత్మకూర్ : మేకలు, గొర్రెల దొంగల ముఠా అరెస్ట్

image

గోర్లు, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు కాప్రాయిపల్లి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLGజిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల

image

దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. నేడు ఆలయం వద్ద దిష్టి పూజ నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో పెద్దగట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తాయి.