Nalgonda

News July 3, 2024

నల్గొండ: మండలాలకు ప్రత్యేక అధికారులు కేటాయింపు

image

నల్గొండ జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. కేతేపల్లి – D. నాగేశ్వరరావు, కొండమల్లేపల్లి – S. ద్వారక, మాడుగుల పల్లి – K. మహేందర్ కుమార్, మర్రిగూడ – D. యల్లయ్య, మిర్యాలగూడ – J. వెంకట్ రెడ్డి, మునుగోడు – K. మురళి, నకిరేకల్ – S. కిరణ్ కుమార్, నల్గొండ – G. గీత లక్ష్మి, నాంపల్లి – K. శ్రీనివాస్, నార్కెట్ పల్లి – V. రమేష్, నేరేడుగోమ్ము -నితిన్ కుమార్ ను కేటాయించారు.

News July 3, 2024

నల్గొండ: మండలాలకు ప్రత్యేక అధికారులు కేటాయింపు

image

నిడమానూరు – V. శ్రీనివాస రావు, పీఏ పల్లి – నాగమల్లేశ్వరరావు, పెద్దవూర – వెంకటయ్య, శాలిగౌరారం – రామారావు నాయక్, తిప్పర్తి – R. దస్రు, తిరుమలగిరి సాగర్ – R. కిరణ్ కుమార్, త్రిపురారం – V. లీల, వేములపల్లి – B. శ్రీనివాసరావు, కట్టంగూర్ – విజయేందర్ రెడ్డి, కనగల్ – V. శ్రీనివాస్, గుర్రంపోడు – V.వెంకటేశ్వర్లు, గుండ్రంపల్లి – M. వీరప్ప, దేవరకొండ – ఇందిరా, చిట్యాల – P. శ్రీనివాస్ కుమార్ ను కేటాయించారు.

News July 3, 2024

HNR: అనాథగా మారిన 12 ఏళ్ల బాలిక

image

HNRలోని ఎంపీపీ కాలనీకి చెందిన ఉదారి క్రాంతికుమార్, పార్వతికి ఒక కుమార్తె జ్యోత్స్న ఉంది. జ్యోత్స్న తల్లి పార్వతి ఆమె చిన్నతనంలోనే మృతిచెందగా, ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్న తండ్రి క్రాంతికుమార్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో 12 ఏళ్ల బాలిక జ్యోత్స్న అనాథగా మారింది. ఇదిలా ఉండగా, తండ్రి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో కాలనీ వాసుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.

News July 3, 2024

నల్గొండ: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన 

image

నల్గొండ జిల్లాలోని 31 మండలాల్లో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. రాష్ట్రంలో ఇవాళ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసింది. పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

News July 3, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలన్నారు.

News July 3, 2024

జిల్లా వ్యాప్తంగా 66 లక్షల మొక్కలు నాటాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.

News July 3, 2024

ఉద్యోగాలకు నల్గొండలో రేపు ఇంటర్వూలు

image

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకానికి ఈనెల 4వ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఘనశ్యామ్ తెలిపారు. ఇవాళ జరగాల్సిన ఇంటర్వ్యూలను రేపటికి వాయిదా వేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలియజేశారు.

News July 3, 2024

నల్గొండ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. ఉమ్మడి నల్గొండ నుంచి గాజుబిడెం బ్యాక్‌ వాటర్‌లో బస, బోటింగ్, నెల్లికల్‌ ఎకోపార్క్‌లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్‌ ఉండనుంది. దీంతో స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News July 3, 2024

చండూరు: ఉద్యోగం ఇప్పిస్తానని కౌన్సిలర్ చీటింగ్..

image

చండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ చండూరుకు చెందిన నర్సింహ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఓ కౌన్సిలర్.. చండూరు మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని 2021లో రూ.రెండు లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ తెలిపారు.

News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు. తొలి రోజు కొత్త చట్టాల కింద జిల్లాలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదయ్యాయని తెలిపారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.