Nalgonda

News March 4, 2025

నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

image

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్‌బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

News March 4, 2025

BREAKING: నల్గొండ: 134 పంచాయతీ సెక్రటరీలకు ఛార్జ్ మెమోలు

image

తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 134 మంది పంచాయతీ సెక్రటరీలకు నల్గొండ డీపీవో వెంకయ్య ఇటీవల ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అయితే మళ్లీ ఈరోజు మరోసారి ఛార్జ్ మెమోలు జారీ చేయడంతో వారు ఆందోళనలో ఉన్నారు. గతంలో వారు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు డుమ్మా కొట్టినందుకు వారిపై విచారణ కొనసాగుతోందని వెంకయ్య తెలిపారు. కాగా, మానవతా దృక్పథంతో అప్పట్లోనే కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకోవద్దన్నారు.

News March 4, 2025

నల్గొండ: ఇంటర్ పరీక్షలకుసర్వం సిద్ధం: డీఐఈఓ

image

రేపటి నుంచి ప్రారంభంమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఐఈఓ దశ్రు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

News March 4, 2025

నల్గొండ: పోలీసులకు ఎస్పీ స్ర్టాంగ్ వార్నింగ్..

image

నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు మూసీ పరివాహక ప్రాంతంలో మంగళవారం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వెయ్యాలని పోలీసులను ఆదేశించారు. అమ్మనబోలులో ఇవాళ నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనం వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమ ఇసుక తరలించేవారికి సహకరించే పోలీసులు, అధికారులపైనా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.

News March 4, 2025

నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

జిల్లాలో రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించనున్నారు. ఉ.8గంటలకు HYD నుంచి బయలుదేరి ఉ.10గంటలకు కనగల్ మండలం చేరుకుంటారు. కనగల్ పట్టణంలో నిర్మించిన కొత్త PHCని ప్రారంభిస్తారు. అనంతరం సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సహకారంతో చేస్తున్న గ్లకోమా పైలెట్ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవలో పాల్గొంటారు. కస్తూర్భా పాఠశాలను సందర్శిస్తారు. మ.1:15కు నల్గొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News March 4, 2025

నల్గొండ: ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి

image

WGL, KMM, NLG టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ప్రభుత్వ టీచర్‌గా చేసినవాళ్లు తక్కువ మంది. అయినప్పటికీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి మాత్రమే. ఆయన ఎన్నికలకు ముందు తన ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఓటు మాత్రం ఆరు నెలల వరకు ఉంటుంది. నర్సిరెడ్డి, సర్వోత్తమ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కూడా టీచర్‌గా పదవీ విరమణ చేశారు.

News March 4, 2025

హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ

image

హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 2025-2026 సంవత్సరానికి గాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను కోరుతున్నట్లు సహాయ సంచాలకులు ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. NLG& SRPT జిల్లాలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్స్ చేయదలచిన అసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 4, 2025

NLG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ‘సారీ’!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని / సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు.

News March 4, 2025

NLG: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

image

ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి దస్రునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండానే పరీక్షలు రాయవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ల మంజూరులో జాప్యం చేసినా, కేంద్రాల్లో సమస్యలు ఉన్నా డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 4, 2025

NLG: హాస్టల్ పిల్లలకు నో చికెన్!

image

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సాధ్యమైనంతవరకు విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.