India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాతబడిన అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక వైద్యారోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె జిల్లా అధికారుల సమ్మిలిత సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి ప్రారంభించిన రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ నెలాఖరులోగా పరిష్కరించాలన్నారు.
NLG జిల్లాలోని మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగిసింది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా కొనసాగనున్నారు. కాగా నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఉండటంతో యథావిధిగా కొనసాగనుంది.
కిడ్నీ రాకెట్ ఘటనలో నల్గొండ పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో అరెస్టైన వారిలో నల్గొండకు చెందిన నలుగురు మెడికల్ అసిస్టెంట్లు ఉండడం చర్చనీయాంశం అయ్యింది. NLGకు చెందిన రమావత్ రవి, సపావత్ హరీశ్, సపావత్ రవీందర్, పొదిల సాయి అరెస్టైన వారిలో ఉన్నారు. కాగా.. 2016లో ఈ తరహా ఘటన నల్గొండలో జరగ్గా.. ఇప్పుడు కూడా నల్గొండ వాసులు ఉండడం నివ్వెర పరుస్తోంది.
నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో 10,374 కుటుంబాలకు చెందిన 41,922 మందికి స్కీమ్స్ అందజేసింది. అందులో 713మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4,976 మందికి కొత్త కొత్త రేషన్ కార్డులు, 4,677 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్స్ కాపీలు అందజేశారు. అత్యధికంగా రైతు భరోసాకు 31,556 మంది ఎంపికయ్యారు.
శౌర్యచక్ర అవార్డు గ్రహీత కుక్కుడుపు శ్రీనివాస్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరించి గ్రామం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. శ్రీనివాస్ సాధించిన ఈ ఘనత తమ గ్రామం పేరును నిలబెట్టిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు ఆయనను అభినందించారు.
రావులపెంటకి చెందిన కోట నవీన్ కుమార్ వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ ఆవిష్కరణకు గాను విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు-2025 గెలుచుకున్నారు. మాజీ సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి నవీన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీరాంరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తరి సైదులు, ఉపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.
దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎండోమెంట్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించారు. సుమారు రూ.4కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థపతి శ్రీ వల్లి నాయర్, దుర్గాప్రసాద్, గణేశ్, కిరణ్, ఆలయ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో జల్లేపల్లి జయరామయ్య, దేప కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 26 నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పథకాల అమలుకై గ్రామ, వార్డుసభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏడాది కాలంలో రూ.500 కోట్లు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 11లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.