India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో 37 SAలకు జిహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా SGTలకు LFL హెచ్ఎంలుగా, SAలుగా168 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం ఇస్తామన్న ప్రభుత్వ హామీ మాటగానే మిగిలిపోయింది. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ మంది పేద కుటుంబాల విద్యార్థులే ఉన్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి లేక చాలా మంది విద్యార్థులు రోజంతా పస్తులతో ఉంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, ఇతర సామాగ్రి కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పీడీని దీనికి నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక ట్యాక్స్ నిధులు పంచాయతీరాజ్ శాఖ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో విద్యార్థులకు చదువులు భారంగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా విద్యార్థుల బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ వంటి కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రూ.50 కోట్లకు పైగానే బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలు చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఇప్పుడు విద్యార్థులకు కూడా విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 31 కళాశాలలో ఈ నెల 23 నుంచి విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు AI ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరిగేది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా విద్యార్థుల హాజరును కచ్చితంగా ట్రాక్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యోగుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 342 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, కేవలం 208 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నిత్యం పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభించిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం నామమాత్రంగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. బ్యానర్ ప్రదర్శిస్తూ ఇంటింటి చెత్త సేకరణ గురించి ఊదరగొడుతూ ఫొటోలు దిగి గంట వ్యవధిలో కార్యక్రమం ముగించి మమ అనిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి ప్రణాళికా రూపొందించకుండా మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా మారిందని పలువురు అంటున్నారు.
NLG పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథ స్వామి తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అర్హత కలిగి మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్షియల్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈనెల 28 లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.
పోలీసు శాఖలో పురుషులతో సమానంగా విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించేందుకు ‘SHE leads-NALGONDA believes’ కార్యక్రమం ద్వారా వారం రోజుల పాటు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈ శిక్షణలో నేర పరిశోధన, బ్లూ క్లోట్స్, రాత్రి గస్తీ, బందోబస్తు విధుల్లో వారికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడే మెలకువలు నేర్పించామని తెలిపారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రాథమిక ఆదాయం కలిగిన 18 – 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ పెద్ద సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమయంలో ఒకేసారి రూ.20 వేలు నగదు సహాయాన్ని కుటుంబానికి అందిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.