Nalgonda

News April 17, 2025

NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

image

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

News April 17, 2025

NLG: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 17, 2025

ఈ నెల 19న నల్గొండలో ప్రత్యేక ప్రజావాణి

image

ఈ నెల 19న నల్గొండ కలెక్టరేట్‌లో వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 16, 2025

నల్గొండలో యువతి సూసైడ్

image

యువతి సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాన్యచెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 16, 2025

NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

image

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.

News April 16, 2025

2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలి: ఇలా త్రిపాఠి

image

శివన్న గూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు 2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇతర అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 16, 2025

NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

image

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.

News April 16, 2025

సమర్థవంతంగా ఆహార భద్రత కార్యక్రమాలు: ఇలా త్రిపాఠి 

image

పేద ప్రజలు, విద్యార్థులు, గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలకు పౌష్టికాహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జిల్లా పర్యటన అనంతరం దేవరకొండలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News April 15, 2025

నల్గొండ: టుడే టాప్ న్యూస్

image

* నకిరేకల్ వీటీ కాలనీలో అగ్నిప్రమాదం * దళిత యువతి చావుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలని బొక్కముంతల పహాడ్‌లో బంధువుల ఆందోళన * యాసంగి పంటలపై ప్రకృతి పంజా * చందంపేటలో కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి * రిటైర్డ్ హోంగార్డుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ సన్మానం * పైన టూల్ బార్‌లో లోకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా వార్తలను 5 నిమిషాల్లో తెలుసుకోండి.

News April 15, 2025

SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

image

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.