Nalgonda

News July 2, 2024

ప్రజావాణి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన NKPలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పారు.

News July 1, 2024

భువనగిరి కలెక్టరేట్లో ప్రజావాణి

image

భువనగిరి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతు హాజరై అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా దరఖాస్తులను అధికారులకు అందజేస్తున్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గంగాధర్ ఏవో జగన్ మోహన్ గౌడ్ జెడ్పి సీఈఓ శోభారాణి అధికారులు పాల్గొన్నారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ ఆరంభంలోనే డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉద్ధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News July 1, 2024

NLG: ఈ కళాశాలలో సైనికులు READY

image

నల్గొండ NG కాలేజీ నుంచి ఏటా 15 మందికి పైగా విద్యార్థులు దేశరక్షణ సేవలకు అర్హత పొందుతున్నారు. కళాశాలలోని NCC విభాగంలో శిక్షణ పొందుతూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రక్షణ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ ఏడు సైతం 16 మంది ఆర్మీకి ఎంపికయ్యారు. విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నామని ప్రిన్సిపల్ డా.ఉపేందర్, NCC ఇన్ ఛార్జి సుధాకర్ చెబుతున్నారు.

News July 1, 2024

NLG: ఇక క్యూఆర్ కోడ్ తోనే చెల్లింపులు!

image

మీ-సేవా కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండటంతో ఇక మీదట ప్రైవేటు కేంద్రాల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ కాకముందే  డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News July 1, 2024

ముమ్మరంగా వానాకాలం పంటల నమోదు ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినా నమోదు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడవు విధించింది. ఈ మేరకు ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ, వరి తదితర పంటల లెక్క తేల్చుతున్నారు.

News July 1, 2024

బదిలీలతో ఏర్పడ్డ 687 ఖాళీలు 

image

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసిన అనంతరం యాదాద్రి జిల్లాలో అన్ని రకాల కేటగిరీల్లో కలిపి 687 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ డీఎస్సీ ద్వారా కేవలం 277 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలు 128, ఎస్ఏలు 130, ఎల్ పీలు 19 వరకు ఉన్నాయి.

News July 1, 2024

NLG: మంత్రి పదవి దక్కేనా!

image

కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అనే చర్చ మొదలైంది. మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి, DVK ఎమ్మెల్యే బాలునాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో చేరే సమయంలో తనకు హామీ ఇచ్చారని సన్నిహితుల వద్ద రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. బాలునాయక్ కూడా ఉత్తమ్, జానారెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నారు.

News June 30, 2024

మూసీ ప్రాజెక్ట్ నీళ్ల కోసం రైతుల ఎదురుచూపులు

image

నల్గొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ మూసీ. కాగా ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 637 అడుగుల నీరు ఉంది. మూసి ప్రాజెక్ట్ కాల్వల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని NKL, NLG, MLG, SRPT నియోజకవర్గంలోని 40 వేల పైచిలుకు భూమి సాగు అవుతుంది. మూసీ నీటి విడుదలపై ప్రాజెక్ట్ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో మూసి నీళ్లు వస్తాయా…? రావా…? అని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.