India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.

ఉమ్మడి NLG జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు 6వేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బీహార్, UP, ఢిల్లీ వాళ్లు పని చేస్తున్నారు.

కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్కు 21,120, ఎస్టీ కార్పొరేషన్కు 11,515, బీసీ కార్పొరేషన్కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్కు 253 దరఖాస్తులు వచ్చాయి.

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు

ఒరిస్సా కళింగ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న ఇండియన్ యూనివర్సిటీస్ ఎంపికలకు మహిళా విభాగం 100, 200 మీటర్ల పరుగు పందేనికి NLG సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎన్.ప్రవళిక MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇవాళ ఉదయం విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంపికల్లో ప్రవళిక 100 మీటర్ల పరుగు పందెంలో 12.30 సెకండ్లలో, 200 మీటర్ల 25.60 సెకండ్లలో పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

హాలియా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. శనివారం ఆమె నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు.

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్లో తమ రిజల్ట్స్ చూసుకోవాలన్నారు. .

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్గా పనిచేసేవాడు. బైక్ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.