Nalgonda

News January 25, 2025

తిప్పర్తి: కొండ్ర సైదులు విగ్రహావిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి

image

తిప్పర్తి మండల పరిధిలోని తానేదారుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండ్ర సైదులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నేతలు, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు.

News January 25, 2025

ప్రజాపాలన గ్రామసభలో 1,17,655 దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలోని నాలుగు రోజులు గ్రామసభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నాలుగు పథకాలకు 1,17,644 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసాకు 844, రేషన్ కార్డులు 53,844, ఇందిరమ్మ ఇళ్లు 47,471,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు15,485 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

News January 25, 2025

NLG: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల ఆహ్వానం

image

2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సహాయం కొరకు వివిధ రకాల దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల వయవృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు tsobmms.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 25, 2025

హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రామీణ, గిరిజన, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం .శివాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ అనే పథకంలో భాగంగా పర్యాటక, గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు ఇంటిలోనే తాత్కాలిక నివాస యోగ్యం కల్పించే హోమ్ స్టే కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

News January 24, 2025

ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం: ఇలా త్రిపాఠి

image

ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నుంచి విద్యార్దినులు, మహిళలుతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా బేటి బచావో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్‌ను విడుదల చేశారు.

News January 24, 2025

నల్గొండ జిల్లాలో గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

image

నల్గొండ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 9:30 గంటలకు బాల బాలికల సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శకటాల ప్రదర్శన జరుగుతుందని అధికారులు తెలిపారు.

News January 24, 2025

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన DSP 

image

ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చెరువుగట్టులో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ DSP కె. శివరాంరెడ్డి నార్కట్‌పల్లి సీఐ నాగరాజుతో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయ పరిసర ప్రాంతాలు, భక్తుల సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి పలు సూచనలు చేశారు.  దేవాలయ EO నవీన్ కుమార్ నార్కెట్ పల్లి పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

News January 23, 2025

నల్లగొండ: పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం

image

జనవరి 30 నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగనున్న LLB మూడు, ఐదు సంవత్సరాల మొదటి సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని NSUI అధ్యక్షుడు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో COEకి వినతిపత్రం అందజేశారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ ఆలస్యమైన కారణంగా పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.

News January 23, 2025

NLG: నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు

image

సూర్యాపేట జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. నల్గొండ, మిర్యాలగూడెం నుంచి వచ్చే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

News January 23, 2025

కొత్త రేషన్ కార్డుల కోసం 13,921 దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజాపాలన గ్రామసభల నిర్వహణలో భాగంగా బుధవారం జిల్లాలో 221 గ్రామ సభలు,47 మున్సిపల్ వార్డు సభలు మొత్తం 268 గ్రామ ,వార్డు సభలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు గడచిన రెండు రోజులు కలుపుకొని 444 గ్రామసభలు, 95 మున్సిపల్ వార్డుల సభలను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. బుధవారం రేషన్ కార్డుల కోసం 13,921 కొత్త దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.