Nalgonda

News June 28, 2024

నల్గొండ: DCCB ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా దయాకర్ రెడ్డి

image

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (DCCB) ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఏసీ రెడ్డి దయాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నేడు నెగ్గింది. దీంతో కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న దయాకర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. మరో రెండు, మూడు రోజుల్లో కుంభం శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.

News June 28, 2024

NLG: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

నల్గొండలోని NG కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ఉపేందర్ తెలిపారు. తెలుగు-2, వాణిజ్యశాస్త్రం-3, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-3′ కంప్యూటర్ సైన్స్\అప్లికేషన్స్-6, డాటా సైన్స్-1 గణితశాస్త్రం-2, స్టాటస్టిక్స్-1, బయోటెక్నాలజీ-1 సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 28, 2024

నల్గొండ: మహిళా సంఘాలకు మీ సేవ కేంద్రాలు!

image

స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీ శక్తి క్యాంటీన్లను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు అప్పగించనుంది. దీంతో నల్గొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 103 మీ సేవ కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని గ్రామ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించనుంది.

News June 28, 2024

సూర్యాపేట జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం!

image

సూర్యాపేట జిల్లాలో మరో సాగునీటి ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకోనుంది. ఈ పథకం ద్వారా 10,233 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు సర్వే పనులు చేపట్టారు. చింతలపాలెం మండలం బుగ్గమాదారం వద్ద ఎత్తిపోతల నిర్మాణానికి రూ.415.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

News June 28, 2024

NLG: జీరో బిల్లు, గ్యాస్ రాయితీ కోసం ఎదురుచూపు!

image

ఉమ్మడి జిల్లాలో జీరో విద్యుత్ బిల్లు, గ్యాస్ రాయితీకి లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. చాలామందికి రూ.500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తించడం లేదు. SRPT జిల్లాలో 1,49,887, నల్గొండ జిల్లాలో 1,91,053, యాదాద్రి జిల్లాలో 1,26,431 మంది లబ్ధిదారులు గృహజ్యోతి లబ్ధి పొందుతున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వేల మంది లబ్ధిదారులు గృహజ్యోతి, జీరో బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

News June 28, 2024

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నేడు వారు మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను, ధరణి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణి మాడ్యూల్ సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ డి.రాంప్రసాద్, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.

News June 27, 2024

మోత్కూర్‌లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి

image

మోత్కూర్ మండలం పాలడుగులో రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వలిగొండ మండలం ఎం.తుర్కపల్లికి చెందిన మాసంపల్లి పరశురాములు (40) భార్యాపిల్లలతో కొన్ని నెలల క్రితం మోత్కూర్ వచ్చి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో మహారాణి లేడీస్ బట్టల షాపు నడుపుతున్నాడు.

News June 27, 2024

నల్గొండ: టవల్ ఆరేస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి

image

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడులో తీవ్ర విషాదం జరిగింది. విద్యుద్ఘాతంతో వీరేందర్, జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దండెంపై టవల్ ఆరేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 27, 2024

మునగాల వద్ద రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

image

మునగాల మండల సమీపంలోని మాధవరం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎస్సై అంజిరెడ్డి వివరాలిలా.. బైక్, కారు ఢీకొన్న ఘటనలో తిమ్మారెడ్డి గూడెంకి చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYDకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.

News June 27, 2024

ఢిల్లీలో ఎంపీలు రఘువీర్, చామల నిరసన

image

నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో నల్గొండ, భువనగిరి ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరసన తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.