Nalgonda

News January 16, 2025

రాయగిరి: పండగకు వెళ్లి వస్తుండగా విషాదం

image

WGL- HYD హైవేపై రాయగిరి శివారులో జరిగిన <<15167205>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం గాంధీపురం గ్రామం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్య సంతోష్ తన కుటుంబీకులతో కలిసి పండగకు ఇంటికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భార్య అనూష, కూతురు చైత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

News January 16, 2025

నల్గొండ: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతరలు, ఉర్సుల సీజన్ మొదలు కానుంది. జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే లింగమంతుల జాతర ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. ఈ జాతరకు 30 నుంచి 50లక్షల వరకు భక్తులు హాజరవుతారని అంచనా. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు, మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.

News January 16, 2025

నల్గొండ: చివరి దశకు చేరుకున్న వరి నాట్లు 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉంది. సాగర్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో గతంతో పోల్చితే ఎక్కువగానే సాగయినట్లు రైతులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలో కొన్ని చోట్ల బోర్ల పోయకపోవడంతో కొందరు రైతులు భూములను పడావు పెడుతున్నారు. 

News January 15, 2025

NLG: ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యం

image

విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 31న, ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సులు చదివేవారు తప్పనిసరిగా ఆంగ్ల ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని DIEO దస్రూ నాయక్ తెలిపారు.

News January 15, 2025

చైనా మాంజాతో గుట్టలో దంపతులకు గాయాలు

image

చైనా మాంజా దారం తగిలి బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాయాలైన ఘటన బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగింది. స్థానికుల వివరాలిలా.. దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు తెగింది. అతడి భార్య వాహనం పైనుంచి పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News January 15, 2025

భువనగిరి: గాలిపటం ఎగరవేస్తూ వ్యక్తి మృతి

image

పండగపూట ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం జరిగింది. జూపల్లి నరేందర్ పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని చెప్పారు.

News January 15, 2025

నేడు వేములపల్లికి ఎమ్మెల్యే

image

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమనగల్లు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో అభివృద్ధి పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News January 14, 2025

SRPT: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్త హత్య

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం రాత్రి సైదులు అనే వ్యక్తిని అతని ఇద్దరి భార్యలు <<15142827>>మర్డర్ చేసిన<<>> సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. చివ్వెంల మండలానికి చెందిన సైదులు కారు డ్రైవర్. కొన్ని రోజులుగా పెద్ద భార్య కూతురిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు రోకలిబండతో సైదులును హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. 

News January 14, 2025

NLG: మరో 12 రోజులే.. దగ్గర పడుతున్న గడువు!

image

మునిసిపల్ పాలకవర్గాల గడువు దగ్గర పడుతోంది. SRPT జిల్లాలో నేరేడుచర్ల, HZNR, KDD, SRPT, తిరుమలగిరి, NLG జిల్లాలో నందికొండ, NLG, NKL, MLG, HLY, DVK, CTL, CDR, యాదాద్రి BNG జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, CPL, BNG, ఆలేరు మున్సిపాలిటీల పదవీకాలం ఈనెల 26తో గడువు ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 14, 2025

25 నుంచి జాన్‌పహాడ్ ఉర్సు.. దర్గా చరిత్ర ఇదే

image

ఈ నెల 25నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న ఈ దర్గాకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారని అంటున్నారు. మత సామరస్యానికి జాన్ పహాడ్ సైదన్న దర్గా ప్రతీక. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం. కాగా ఈ దర్గాకు నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వెళ్లొచ్చు.