India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. సదరం సర్టిఫికెట్లు జారీ చేసి రెండేళ్లు దాటినా ఇంకా తమకు పెన్షన్ రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో సర్టిఫికెట్ గడువు ముగుస్తుందని చెబుతున్నారు. కాగా ఒక్క నల్గొండ మున్సిపాలిటీలోనే పెన్షన్ల కోసం 3 వేలమందికి పైగా అప్లై చేసుకున్నారు. తమకూ పెన్షన్ ఇవ్వాలని సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని లబ్ధిదారులు కోరుతున్నారు.
విహారయాత్రలు, దైవదర్శనాల సమాచారం కోసం ప్రభుత్వం మీ టికెట్ యాప్ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి సాగర్ బోటు ప్రయాణానికి సంబంధించిన వివరాలు, బుద్ధవనం, యాదగిరిగుట్ట ఆలయం, మిర్యాలగూడ చెరువులోని బోటింగ్ వివరాలను ఉంచారు. ఇంకా ఉమ్మడి నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చలసోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయం వివరాలను పొందుపరచాల్సి ఉంది.
యాదగిరి నర్సన్న ఆలయానికి ఆదివారం భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు. 2700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,35,000, ప్రసాద విక్రయాలు రూ.20,62,120, VIP దర్శనాలు రూ.9,75,000, బ్రేక్ దర్శనాలు రూ.4,70,100, కార్ పార్కింగ్ రూ.6,50,000, వ్రతాలు రూ.1,38,400, యాదరుషి నిలయం రూ.2,71,187, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.51,40,252 ఆదాయం వచ్చింది.
మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఎస్సీ, ఆర్అర్బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీజీ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఖాజానజీమ్ అలీ అప్సర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9లోగా వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం <<15183553>>ప్రసిద్ధ శైవక్షేత్రంగా<<>> భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడైన తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం 1500 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.12,32,330, VIP దర్శనాలు రూ.6,75,000, బ్రేక్ దర్శనాలు రూ.2,58,600, కార్ పార్కింగ్ రూ.5,50,000, వ్రతాలు రూ.1,42,400, సువర్ణ పుష్పార్చన రూ.97,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,487 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.45 నిమిషాలకు భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. అనంతరం మీనా నగర్ కాలనీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:45కు బయలుదేరి 2గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. రేషన్ కార్డుల సర్వేపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో తయారు చేసిందని తెలిపారు. జిల్లాల్లో 27,527 రేషన్ కార్డుల లేని కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలిందని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ (ఆరో తరగతి) ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG జిల్లాలో 13, BNGలో 5, SRPT జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉన్నాయనీ ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. 80 సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.