Nalgonda

News January 18, 2025

ఈ నెల 21న నల్గొండకు కేటీఆర్

image

నల్గొండకు ఈ నెల 21 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాసభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తరువాత నల్గొండ టౌన్‌కు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల 13న నిర్వహించాల్సిన రైతు మహాసభ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

News January 18, 2025

BREAKING: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరువాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

News January 18, 2025

నర్సన్న నిత్య ఆదాయం రూ.35,63,82

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం 1260 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.63,000, ప్రసాద విక్రయాలు రూ.11,51,690, VIP దర్శనాలు రూ.3,75,000, బ్రేక్ దర్శనాలు రూ.1,80,300, కార్ పార్కింగ్ రూ.4,50,000, వ్రతాలు రూ.80,800, సువర్ణ పుష్పార్చన రూ.79,432, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,63,824 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.

News January 17, 2025

మిర్యాలగూడ: ఆ కుటుంబంలో ఆరుగురు DOCTORS

image

నల్గొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన రామారావు-జీవనజ్యోతి దంపతులు ఇద్దరు డాక్టర్‌లే. వీరు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే గొప్పవిషయం ఏంటంటే.. వీరి ఇద్దరు కుమారులు శ్రీహర్ష, పృథ్వి, కోడళ్లు అమూల్య, శ్రావ్య కూడా డాక్టర్‌లే. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైద్య వృత్తిలో ఉండటం అరుదుగా కనిపిస్తుంది.

News January 16, 2025

NLG: షిరిడీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!

image

షిరిడీ సమీపంలో జరిగిన <<15171774>>ఘోర రోడ్డు ప్రమాదం<<>>లో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కొండగడపలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రెండు రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. నిన్న ఉదయం దర్శనాంతరం తుఫాన్ వాహనంలో సమీప దర్శనీయ స్థలాలు చూసేందుకు వెళ్లి తిరిగి షిరిడీకి వస్తుండగా వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మీ(45), అక్షిత(20), వైద్విక్ నందన్(6నెలలు) మృతి చెందారు.

News January 16, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు భువనగిరి జిల్లా వాసులు మృతి

image

మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భువనగిరి జిల్లా వాసులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీలో పరిధిలోని కొండగడప వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉంది. రెండు రోజుల క్రితం వీరు షిరిడీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.

News January 16, 2025

NLG: ప్రధాని మోదీతో మచ్చటించిన అంజలి

image

గుర్రంపోడు మండలం ఆములూరుకు చెందిన కటికర్ల శంకర్ పార్వతమ్మ దంపతుల కుమార్తె అంజలి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి హాజరయ్యింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అంజలి తన ప్రతిభా పాటవాలతో ఎన్‌సీఈఆర్‌టీ సహకారంతో ఢిల్లీ వెళ్లి ప్రధానితో మోదీతో ముచ్చటించింది. దీంతో ఆములూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అంజలిని అభినందించారు.

News January 16, 2025

రాయగిరి: పండగకు వెళ్లి వస్తుండగా విషాదం

image

WGL- HYD హైవేపై రాయగిరి శివారులో జరిగిన <<15167205>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం గాంధీపురం గ్రామం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్య సంతోష్ తన కుటుంబీకులతో కలిసి పండగకు ఇంటికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భార్య అనూష, కూతురు చైత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

News January 16, 2025

నల్గొండ: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతరలు, ఉర్సుల సీజన్ మొదలు కానుంది. జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే లింగమంతుల జాతర ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. ఈ జాతరకు 30 నుంచి 50లక్షల వరకు భక్తులు హాజరవుతారని అంచనా. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు, మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.

News January 16, 2025

నల్గొండ: చివరి దశకు చేరుకున్న వరి నాట్లు 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉంది. సాగర్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో గతంతో పోల్చితే ఎక్కువగానే సాగయినట్లు రైతులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలో కొన్ని చోట్ల బోర్ల పోయకపోవడంతో కొందరు రైతులు భూములను పడావు పెడుతున్నారు.