Nalgonda

News October 21, 2025

తెలంగాణ రైజింగ్ – 2047′ సర్వేకు విశేష స్పందన: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వారం రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుంచి పౌరులు పాల్గొని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News October 21, 2025

NLG: సర్కారు టాస్క్.. రాజగోపాల్ రెడ్డి స్పందించేనా!

image

మునుగోడు.. ఇప్పుడు ఈ పేరు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం వ్యాపారులకు పెట్టిన రూల్స్ పాటించాల్సిందే అంటూ ఇటీవల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్కారు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయాలపై రాష్ట్ర మొత్తం ఒకటే పాలసీ ఉంటుందని.. వ్యాపారులు భయపడవద్దని ఎక్సైజ్ మంత్రి జూపల్లి పేర్కొన్నట్లు సమాచారం.

News October 21, 2025

తెరుచుకోని కేంద్రాలు.. గ్రామాల్లో దళారుల తిష్ట

image

దళారులు చేతిలో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. ఇప్పటికే పత్తి మొదటి దశ పత్తి ఏరడం పూర్తయి రెండో దశ కూడా ఏరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేటికీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలను ప్రారంభించనున్నారు.

News October 20, 2025

జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

image

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రేపు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘స్మృతి పరేడ్‌’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, అమరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.

News October 20, 2025

NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

image

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.

News October 20, 2025

NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

image

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.

News October 20, 2025

NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

image

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్‌జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్‌జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

News October 20, 2025

మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.

News October 20, 2025

నల్గొండ: పత్తి కూలీల ఆటో, ట్రాక్టర్ ఢీ

image

ముప్పారంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకంలో ముంచింది. పత్తికూలీల ఆటోను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఆలంపల్లి సాయిలు అనే కూలీ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

News October 20, 2025

నల్గొండ: రేకుల షెడ్‌లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

image

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్‌లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.