India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.
సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేదల పక్షపాతిగా ప్రజల కోసం పోరాడిన గొప్ప ప్రజాపోరాట యోధుడిని ఈ దేశం కోల్పోయిందన్నారు. విలువలు,సిద్ధాంతాల కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి ఆదర్శప్రాయులని తెలిపారు.ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 71,001 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 43,334 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు కొంత ఊరట లభించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల విలువను పెంచే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ విలువ 60 శాతం నుంచి 120 శాతం వరకూ పెంచేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేసి నేషనల్ హైవే అథారిటీకి పంపారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఉన్న సికింద్రాబాద్ – గుంటూరు రైలుమార్గంలో మొదటి దశ డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బీబీనగర్ నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు జంక్షన్ వరకు 243 కిలోమీటర్ల మేర సింగిల్ రైల్వే లైన్ ఉండడంతో రైలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో రెండో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రైలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
మద్యం అమ్మకూడదని మునుగోడు నియోజకవర్గంలోని సింగారం గ్రామస్థులు తీర్మానించి ర్యాలీ తీశారు. స్వచ్ఛందంగా బెల్టు షాపులను మూసివేసిన వారిని సన్మానించారు. గ్రామంలో మద్యం అమ్మకాలను వందశాతం నిర్మూలించి అందరికీ ఆదర్శంగా ఉంటామని గ్రామస్థులు తెలిపారు. కాగా నియోజకవర్గాన్ని మద్య రహితంగా మార్చాలని MLA రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్) ఎన్నికలు తారస్థాయికి చేరాయి. అన్ని కోణాలలో ఆర్థిక స్తోమత, బలం, బలగం ఉన్న ఉన్నత స్థాయి అభ్యర్థులు పోటీ పడుతుండడంతో చివరి నిమిషం వరకు ఎన్నికల ఉత్కంఠగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
మద్యానికి బానిసైన కుమారుడు నిత్యం డబ్బుల కోసం వేధిస్తుండడంతో విసుగు చెందిన తండ్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం కొత్తతండా ఆవాసం బాపూజీ తండాలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలిలా.. తండాకు చెందిన కిరణ్ (36) మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం వేధిస్తుండడంతో అతని తండ్రి పంతులు గొడ్డలితో దాడి చేశాడు. కిరణ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసేందుకుగాను ప్రజాప్రతినిధులను ప్రకటించింది. NLG పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి జెండా ఎగురవేస్తారు. SRPTలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, BNGలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, ఆపై కష్టాలు అయినా ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. వాటికి ఎదురు నిలిచి ఎస్సైగా నిలిచారు. ఆమెనే నల్గొండకు చెందిన మమత. ‘2016లో మెయిన్స్లో ఫెయిలైనా పట్టు వదలకుండా 2018లో ప్రయత్నించా. అప్పుడూ నిరాశే ఎదురైంది. లక్ష్యంపై ఇష్టంతో మరింత పట్టుదలగా మూడో సారి ఉద్యోగాన్ని సాధించాను’ అంటున్నారామె. తల్లిదండ్రులు, భర్త సహకారంతోనే ఎస్సై అయినట్లు మమత చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.