Nalgonda

News December 24, 2024

ముక్తాపూర్‌తో శ్యామ్ బెనగల్‌కు అనుబంధం!

image

అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పద్మశ్రీ శ్యామ్ బెనగల్(90)కు యాదాద్రి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985లో పారిశ్రామికీకరణతో చేనేత, చేతివృత్తులు ఎలా మసకబారిపోతున్నాయో తెలిపేందుకు ఆయన హిందీలో ‘సుస్మన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో 40 రోజులపాటు చిత్రీకరించారు. ఆ సినిమాలో ప్రముఖ నటుడు ఓంపురి, నటి షబానా అజ్మీ నటించారు.

News December 24, 2024

NLG: జనవరి 6 నుంచి శిక్షణ

image

NLG ప్రాంతానికి చెందిన సహాయ ఆచార్యులు/ లెక్చరర్స్/ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులకు తెలుగులో పరీక్ష మూల్యాంకనం, ప్రశ్నారచన పై ఆరు రోజుల శిక్షణ శిబిరం (జనవరి 6 నుంచి 11వ వరకు) నిర్వహించబడుతుందని ఎంజీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు ఈనెల 31 వరకు తమ పేరును సంబంధిత వెబ్సైట్లో ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేయాలన్నారు.

News December 24, 2024

MG యూనివర్సిటీలో ప్లేసెమెంట్ డ్రైవ్

image

MGU ప్లేస్మెంట్ సెల్ & డాక్టర్ రెడ్డి లేబరేటరి, హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం ప్లేసెమెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ హెచ్ ఆర్ డా. మోహన్ రావు సూచనల మేరకు ఇంటర్మీడియట్ & డిగ్రీ పాస్ అయిన అమ్మాయిలకు అద్భుత అవకాశాలు ఇచ్చారు. మొత్తం 100 మందికి గాను 42 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్లేసెమెంట్ డైరెక్టర్ డా.వై ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

News December 23, 2024

మార్చి 1 నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆలయ ఈవో భాస్కర రావు తెలిపారు. మార్చి 1 నుంచి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 7న శ్రీవారి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9నశదివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం,11న శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

News December 23, 2024

నల్గొండ: లక్షల్లో అప్లై.. పరీక్షకు మాత్రం గైర్హాజరు

image

వారం క్రితం గ్రూప్-2 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు పరీక్షలు రాయడానికి మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. వందల్లో ఉద్యోగాలు ఉంటే లక్షల్లో దరఖాస్తులు ఉంటున్నాయి. కానీ సగం మంది కూడా పరీక్షలు రాయలేదు. గతేడాది గ్రూప్-4 పరీక్షకు హాజరు శాతం బాగానే ఉన్నా గ్రూప్-2కు మాత్రం నల్గొండ జిల్లాలో 49.10 శాతం మందే హాజరయ్యారు.

News December 22, 2024

నల్గొండ డీఈవోపై చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్

image

నల్లగొండ డీఈవో బిక్షపతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త, నల్లగొండ డీఈవో బిక్షపతి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ఆయన మొదటి భార్య మాధవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మాధవి ఫిర్యాదుతో స్పందించిన మహిళా కమిషన్ నల్లగొండ డీఈవో బిక్షపతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఆయనపై శాకపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీని ఆదేశించింది.

News December 22, 2024

నల్గొండ డీఈవోపై చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్

image

నల్లగొండ డీఈవో బిక్షపతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త, నల్లగొండ డీఈవో బిక్షపతి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ఆయన మొదటి భార్య మాధవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మాధవి ఫిర్యాదుతో స్పందించిన మహిళా కమిషన్ నల్లగొండ డీఈవో బిక్షపతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఆయనపై శాకపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీని ఆదేశించింది.

News December 22, 2024

ముగిసిన రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమం

image

MG యూనివర్సిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఐసిఎస్ఎస్ఆర్ సమర్పించిన పది రోజుల రీసెర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమం ఇవాళ ముగిసింది. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, కోర్సు కోఆర్డినేటర్ ఆచార్య అలువాల రవి, కోర్సు కోఆర్డినేటర్ మిరియాల రమేష్ తదితరు పాల్గొన్నారు.

News December 21, 2024

నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి: కోమటిరెడ్డి

image

CM రేవంత్‌ మూసీని అభివృద్ధి చేసి NLG జిల్లా ప్రజల బాగు కోరుతుంటే బావబామ్మర్దులు(కేటీఆర్, హరీశ్‌రావు) అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో ఫైరయ్యారు. తాము బతకాలని లేకుంటే విషమిచ్చి చంపండని అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా ఎక్కువగా ఇరిగేషన్ వాటర్ ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.

News December 21, 2024

రైతు జీవితాల్లో ఇక సం’క్రాంతి’ : కోమటిరెడ్డి

image

సంక్రాంతి నుండి సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసాను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడా. సంక్రాంతి నుంచే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇందిరా స్వశక్తి మహిళ సంఘాలను బలోపేతం చేసేందుకు లక్ష కోట్ల రూపాయలను ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు.