Nalgonda

News June 15, 2024

NLG: రేషన్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

image

ఆధార్, రేషన్‌ కార్డుల అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 ఆఖరు తేదీ కాగా Sept 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం ప్రకటన చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,07,251 కార్డులుండగా, 29,86,875 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 21,89,466 మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 7,97,409 మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది.

News June 15, 2024

NLG: యువతీ, యువకులకు గుడ్ న్యూస్

image

పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News June 14, 2024

న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణ కొరకు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులం న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి బయోడేటాతో పాటు ఈ సంవత్సరంలో కులం, ఆదాయం, డిగ్రీ మార్కుల జాబితా, బార్ కౌన్సిల్ నమోదు పత్రములు జత చేసి జులై ఆరులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 14, 2024

నల్గొండ: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్ రాయిని ఢీకొట్టడంతో డ్రైవర్ లక్ష్మీనారాయణ కింద పడ్డాడు. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మీనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 14, 2024

NLG: ఆ జిల్లాలో బాలికల సంఖ్య తక్కువే!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది. ఎంసీ‌హెచ్ (మదర్, చైల్డ్ హెల్త్) కిట్ల పంపిణీ ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా బాలబాలికల నిష్పత్తి సమానంగా లేదు. నల్గొండ జిల్లాలో వెయ్యి మంది బాలురకు 924 మంది బాలికలు, సూర్యాపేటలో 897, యాదాద్రిలో 911 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

News June 14, 2024

NLG: జిల్లాలో 129 మంది SAలకు పదోన్నతులు

image

నల్గొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా మల్టీజోన్ పరిధిలో 129 మందికి పదోన్నతి లభించింది. 4 రోజుల క్రితం విద్యాశాఖ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. సీనియారిటీ జాబితా ప్రకారం జిల్లాలో 129 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు వచ్చాయి. జిల్లా లో ఖాళీగా ఉన్న 109 పోస్టులకు 87 పోస్టులను జిల్లా నుంచి పదోన్నతులు పొందిన వారికి కేటాయించారు.

News June 14, 2024

BNG: పదోన్నతుల ద్వారా HMల పోస్టుల భర్తీ

image

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 83 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి. పదోన్నతులు ఉత్తర్వులు పొందిన 83 మందిలో 82 మంది గురువారం విధుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు విధుల్లో చేరలేదు. జిల్లాలోని 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి లభించగా ఇందులో 53 మంది ఎస్ఏలకు జిల్లా పరిధిలోనే పోస్టింగులు దక్కాయి.

News June 14, 2024

NLG: హైవే అంటే భయపడుతున్న వాహనదారులు

image

హైదరాబాద్ – విజయవాడ హైవేపై దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. రెండు నెలల కాలంలో పలు దోపిడీలు, దొంగతనాలు జరగడంతో రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చౌటుప్పల్లో గతంలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీ లింగోటం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను తాళ్లతో కట్టి నగదు చోరీ చేశారు. గత నెల 18న ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు.

News June 14, 2024

SRPT: వివాహేతర సంబంధం.. చిన్నారి హత్య.. అరెస్టు

image

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన ప్రియురాలి కుమార్తెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న నల్గొండ జిల్లా ఐలాపురంలో 22 నెలల చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నవ్య శ్రీ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అరవింద్ రెడ్డితో ఐలాపురంలో నివాసం ఉంటోంది.

News June 14, 2024

గొర్రెల యూనిట్ల డీడీల వాపస్ ప్రక్రియ ప్రారంభం: శ్రీనివాసరావు

image

గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన లబ్దిదారులు డీడీల వాపస్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వెంటనే డబ్బులు బ్యాంకు ద్వారా వారి ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతితో 800 మంది లబ్ధిదారులకు డీడీ డబ్బులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు.