India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త సంవత్సరం పూట సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. చివ్వెంల మండలం లక్ష్మీతండాలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తండాకు చెందిన ధరావత్ శేషు(39)ను న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు. కాగా భూ తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థినులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. 10వ తరగతి గణితంపై ముఖ్యంగా సంభావ్యతపై విద్యార్థినులను ప్రశ్న, జవాబులు అడగడమే కాకుండా, బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలు రాబట్టారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాకు చోటు కల్పించింది. పోటీలోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో చివరలో నోటా బటన్ ఉన్నట్లే.. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల్లో చివరన నోటా ముద్రించనున్నారు. సర్పంచికి 30, వార్డు సభ్యులకు 20 గుర్తులతో పాటు అదనంగా నోటా ఉంటుందని అధికారులు తెలిపారు.
శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని నల్గొండ డీఎస్పీ పి.శివరాం రెడ్డి సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించేది లేదని హెచ్చరించారు. సైలెన్సర్లు తీసేసి రోడ్లపై న్యూస్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మిషన్ చెబుత్రపై పోలీసు పోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు శాంతియుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.
NLG జిల్లా న్యాయసేవాధికార సంస్థలో టైపిస్ట్ /అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకై నిర్వహించాల్సిన రాత పరీక్ష జనవరి 4 నుంచి జనవరి 18కి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. OMR పద్ధతిలో రాతపరీక్ష షెడ్యూల్ (రికార్డు అసిస్టెంట్: జనవరి 18 ఉదయం గం. 11.00 నుంచి 12.30 వరకు, టైపిస్ట్ /అసిస్టెంట్ జనవరి 18 మధ్యాహ్నం గం. 3.00 నుంచి 3.40 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు తుది జాబితా విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 24,905 అర్హులైన ఓటర్లు నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 9,965, పురుష ఓటర్లు 14,940 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా కంటే తుది జాబితాలో 2,351 మంది పెరిగారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని టీచర్ ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి, NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
2024లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ మృతి చెందాడు. ఎంజీయూ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. జలాల్పురం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు జల సమాధయ్యారు.
నాగార్జునసాగర్లో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన ఔత్సాహికులతో స్థానిక అతిథి గృహాలన్ని కిటకిటలాడుతున్నాయి. 20 రోజుల క్రితమే విజయవిహార్లోని గదులన్నింటినీ ఐటీ కంపెనీల ఉద్యోగులు, వివిధ క్లబ్బులకు చెందిన వారు ముందస్తుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఆయా అతిథి గృహాలు, హోటళ్లు, రిసార్ట్స్ లలో నేడు, రేపు న్యూఇయర్ వేడుకలను ఉల్లాసంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
<<15019443>>నల్గొండ టాస్క్ ఫోర్స్లో SIగా <<>>పని చేస్తున్నమహేందర్ను తాను రెండవ వివాహం చేసుకున్న విషయం ఆయన మొదటి భార్య జ్యోతితో పాటు కుటుంబ సభ్యులకు తెలుసని కానిస్టేబుల్ వసంత తెలిపారు. జ్యోతి మొదట గొడవపడినా తనకి పిల్లలు లేకపోవడంతో తర్వాత ఒప్పుకుందన్నారు. జ్యోతికి పిల్లలు పుట్టడంతో ఇప్పుడు తమను బద్నాం చేస్తుందన్నారు. కాగా నిన్న మహేందర్ మొదటి భార్య కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కలెక్టరేట్ ముందు నిరసన చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ ఎన్జీ కాలేజ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటం చేసిందన్నారు. అదే స్ఫూర్తితో మతోన్మాధ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.