Nalgonda

News August 23, 2025

NLG: పెరిగిన సర్కారు వారి పాట..!

image

కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యాపారుల్లో కదలిక ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లిక్కర్ వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లుగా కొనసాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం సర్కారుకు కనకవర్షం కురిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 335 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈసారి వైన్ షాపు దరఖాస్తు ధర పెంచడంతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

News August 22, 2025

NLG: సిలిండర్ పేలి వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న గార్లపాటి రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. సిలిండర్ పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 22, 2025

NLG: ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

image

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఆగష్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, 7032415062 నెంబర్ సంప్రదించాలన్నారు

News August 22, 2025

NLG: భారీ నష్టం.. పరిహారం లేకుంటే కష్టమే..!

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో రైతులను నష్టం జరిగింది. శాలిగౌరారం, కట్టంగూర్, నకిరేకల్, నార్కట్ పల్లి, చిట్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగిపోయాయి. మరోవైపు రోడ్లు, కల్వర్టులు కోతకు గురవడంతో అటు రైతులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన తమకు పరిహారం అందించాలని లేకుంటే కోలుకోవడం కష్టమే అంటున్నారు.

News August 22, 2025

నల్గొండలో ‘మిషన్ RRR’ ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, ‘మిషన్ RRR (Road Safety, Rules, Responsibilities)’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు, వాహనదారులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News August 22, 2025

NLG: విద్యాశాఖలో హాజరు శాతం మెరుగు..!

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగైంది. ముఖ ఆధారిత హాజరు విధానం అమలుతో గైర్హాజరుకు చెక్ పడింది. గతంలో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాకపోవడం, ఏవో సాకులు చూపి డుమ్మా కొట్టేవారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు హాజరును విద్యాశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ రోజు ఉదయం పాఠశాలకు రాగానే యాప్లో ఇన్, వదిలి వెళ్లే సమయంలో అవుట్ అని హాజరు నమోదు చేస్తున్నారు.

News August 22, 2025

NLG: హెచ్ఎంలుగా 52 మంది స్కూల్ అసిస్టెంట్లు..!

image

ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లకు సీనియార్టీ ప్రాతిపదికన హెడ్ మాస్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ పదోన్నతుల ఉత్తర్వులు గురువారం రాత్రి విడుదల చేశారు. పదోన్నతుల ప్రక్రియ గతనెలలోనే నిర్వహించారు. అయితే.. కోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జిల్లాలో 52 పోస్టులను పదోన్నతులతో నింపారు.

News August 22, 2025

NLG: వృద్ధులు, వికలాంగులు, బాలికలతో కొత్త సంఘాలు

image

సెర్ప్ ద్వారా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు DRDO శేఖర్ రెడ్డి తెలిపారు. 60 ఏళ్లు పైబడిన మహిళలు 10 నుంచి 15 మందిని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా, 13 నుంచి 15 ఏళ్ల వయస్సు వరకు, 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు.

News August 22, 2025

నల్గొండ: కొత్తగా బియ్యం తీసుకోబోతున్నారు..!

image

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ జరగనుంది. నల్గొండ జిల్లాలో మొదటిసారి 44,099 కుటుంబాలు బియ్యం తీసుకోబోతున్నాయి. వారికి రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 991 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో 89.15 లక్షల క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. అది ఈసారి 94.04 లక్షల క్వింటాలుగా ఉండనుంది.

News August 22, 2025

నల్గొండలో దిల్ ధార్ ఆటో డ్రైవర్

image

నల్గొండ పట్టణంలో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్ బకరం నరసింహను పోలీసులు ఈరోజు అభినందించారు. తన ఆటోలో ప్రయాణికురాలు జార విడుచుకున్న ఖరీదైన సెల్‌ఫోన్‌ను గుర్తించి, వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ సైదులుకు అప్పగించారు. విచారణ అనంతరం ఎస్ఐ ఆ ఫోన్‌ను, బాధితురాలు అరుణకు అందజేశారు. డ్రైవర్ నరసింహ నిజాయతీని మెచ్చుకున్న ఎస్ఐ, సిబ్బంది ఫారూక్‌తో కలిసి ఆయనను సత్కరించారు.