Nalgonda

News December 13, 2024

గడ్కరీతో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ వద్ద పెండింగ్‌లో ఉన్న టెక్నికల్, ఫైనాన్షియల్ అప్రూవల్‌ను ఆమోదించి పనులు ప్రారంభించాలని గడ్కరీని కోరారు.

News December 12, 2024

NLG: లవ్ మ్యారేజ్.. యువకుడి సూసైడ్

image

రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చిట్యాలలో జరిగింది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాలు.. స్థానిక వెంటాపురానికి చెందిన రబోయిన మహేష్(26) రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్ధలతో వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మహేష్ గురువారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News December 12, 2024

NLG: మంత్రి పదవి వీరిలో ఎవరికి..!

image

త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉమ్మడి NLG జిల్లా నుంచి రేవంత్  క్యాబినెట్‌లో బెర్త్ ఎవరికి అనే చర్చ నడుస్తోంది. ST సామాజిక వర్గానికి చెందిన MLA బాలు నాయక్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన MLA రాజగోపాల్ రెడ్డి, బీసీ MLA ఐలయ్య జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ముందున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వీరిలో ఎవరు మంత్రి అవుతారో కామెంట్ చేయండి. 

News December 12, 2024

NLG: ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక

image

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్‌లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఉమ్మడి నల్గొండ జిల్లాలో 42 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

News December 12, 2024

NLG: పెన్షన్ లబ్ధిదారుల్లో నిరాశ

image

పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు లక్ష మందికి పైగానే పెన్షన్లు అందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News December 11, 2024

NLG: పల్లె పోరుకు ముమ్మర ఏర్పాట్లు

image

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితా పూర్తి చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి సిద్ధం చేసి పెట్టుకున్నారు. నల్లగొండలో 856, యాదాద్రి భువనగిరిలో 428, సూర్యాపేటలో 486 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది.

News December 11, 2024

రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటి..?

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటనే సర్వత్రా చర్చ సాగుతుంది. వలిగొండలో సీఎం చేపట్టిన మూసీ ప్రక్షాళన యాత్రలో ఆయన కనిపించలేదు.  నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విజయోత్సవ సభకు సైతం డుమ్మా కొట్టారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి.. అది నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన సైలెంట్‌గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

News December 11, 2024

వేగుచుక్క.. నాగార్జునసాగర్

image

కరవుకాటకాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వేగుచుక్కలా నిలిచింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. NLG జిల్లా నందికొండ వద్ద కృష్ణ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా సాగర్ ప్రసిద్ధి చెందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.

News December 11, 2024

మంత్రి పదవిపై ఐలయ్య రెస్పాన్స్

image

ఐలయ్యకు మంత్రి పదవి అని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. బీసీ కోటాలో పరిగణనలోకి తీసుకొని తనకు మంత్రి పదవి ఇస్తారనని భావిస్తున్నట్లు MLA ఐలయ్య చెప్పారు. అయితే తాను కాంగ్రెస్​కు విధేయుడనని, పార్టీ చెప్పింది చేయడమే తన పని అని చెప్పారు. తనకు ఇప్పటికే క్యాబినెట్ ​ర్యాంక్​ కలిగిన ప్రభుత్వ విప్ ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా బాధేమీ ఉండదని చెప్పారు.

News December 11, 2024

ఎంజి యూనివర్సిటీ బిఈడి రిజల్ట్స్

image

MG విశ్వవిద్యాలయం బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫలితాలను మంగళవారం యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాల వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2వ సెమిస్టర్‌లో 1813 మంది పాస్ కాగా, 692 మంది ప్రమోట్ అయ్యారు. 85 మంది డిటైన్డ్ అయినట్లు తెలిపారు. మొదటి సెమిస్టర్‌లో 299 మంది పాస్ కాగా 237 మంది ఫెయిల్ అయ్యారు.