Nalgonda

News December 10, 2024

పుష్ప-2లో అల్లు అర్జున్‌ షర్ట్ మన పోచంపల్లిదే..

image

ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్నిచోట్ల క్యాస్టూమ్స్‌గా పోచంపల్లి వస్త్రాలు మెరిశాయి. పోలీస్‌ ఆఫీసర్‌ బన్వర్‌సింగ్‌ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివ..’ అని చెప్పే డైలాగ్‌లో హీరో అల్లు అర్జున్ ధరించినది పోచంపల్లి ఇక్కత్ చొక్కానే. పోచంపల్లిలో షూటింగ్ సమయంలో ఈ షర్ట్ కొన్నట్లు స్థానికులు తెలిపారు. 

News December 10, 2024

NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ

image

ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

News December 10, 2024

NLG: అప్రెంటిస్ షిప్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

బీకాం, బీఎస్సీ కంప్యూటర్, బీటెక్ మెకానిక్, డిప్లొమా మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. వారికి మూడేళ్లపాటు ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు నల్లగొండ రీజనల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

News December 10, 2024

నల్గొండ జిల్లాలో అంగన్వాడీల అరిగోస!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4 వేల మంది అంగన్వాడీలు అరిగోస పడుతున్నారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవక అష్టకష్టాలు పడుతున్నారు. వచ్చే జీతం మూరెడు బాధ్యతలు మాత్రం బారెడు అన్న చందంగా అంగన్వాడీ కేంద్రం పనులే కాకుండా ఇతర ప్రభుత్వ పనుల ఒత్తిడితో అధిక భారమై సతమతమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా అంగన్వాడీల ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 9, 2024

NLG: మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జిల్లాలోని మూడు పాత రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి విడతలో నల్గొండ, రెండో విడతలో మిర్యాలగూడ, ఆఖరి విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News December 8, 2024

4 లైన్ల రోడ్లకు రూ.236 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

image

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి నార్కెట్ పల్లి- అద్దంకి -మెదర్ మెట్ల వరకు 236 కోట్ల రూపాయల వ్యయంతో 4లైన్ల నూతన సిసి రోడ్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ ద్వారా జి ఓఆర్ టి నంబర్ 926 జారీ చేసింది. వైటిపిఎస్ నుండి నామ్ రోడ్ వరకు 4 లైన్ల సిసి రోడ్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి NLG REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన రేవంత్.. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవాళ నల్గొండకు రానున్న రేవంత్ బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభం, నల్గొండలో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఏడాది పాలనపై మీ కామెంట్.

News December 7, 2024

నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు బ్రాహ్మణవెల్లంలకు చేరుకుంటారు. 2.40 గంటలకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. 3.20గంటలకు యాదాద్రి ధర్మల్ పవర్ యూనిట్ -2 శక్తివంత స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ మెడికల్ కాలేజ్‌ని ప్రారంభిస్తారు. 5-6 గంటలకు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.

News December 6, 2024

సీఎం రేవంత్ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

image

దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాగా పర్యటన ఏర్పాట్లను మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు మంత్రులు తగిన సూచనలు చేశారు. 

News December 6, 2024

NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు

image

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.