India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈఏడాది నల్గొండ జిల్లాలో 370, సూర్యాపేట జిల్లాలో 310, యాదాద్రి భువనగిరి జిల్లాలో 372 కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో అంచనాలకు మించి ధాన్యాన్ని రైతులు మార్కెట్లకు తీసుకువచ్చారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 4,24,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
చింతలపాలెం మండలంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చింతలపాలెం మండలానికి రెండు కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయించానన్నారు.మండలం అభివృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా తృప్తి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, డైనింగ్ హాల్, పరిసరాలను, ఆటస్థలాన్ని, తరగతి గదులను తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థినులు, వంట వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు.
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని HYDలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి ప్రెస్ మీట్కి వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం JAC నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయనప్పటికీ, రూ.750 కోట్లు విడుదల చేశామని సీఎం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సర్పంచులు ఉన్నారు.
ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దేనని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అన్నారు. నల్గొండ ఆదివారం నిర్వహించిన మాదిగ, ఉప కులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఎవరి హక్కులు భంగం కలగదని, తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటాలు పంచుకోవడమే తప్ప మరొకటి కాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో మొదటి విడతలో భాగంగా నల్గొండ, మునుగోడు, తుంగతుర్తి, HNR నియోజకవర్గాలకు మంజూరు చేసింది. రెండో విడతల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కోదాడ, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను మంజూరు చేసింది.
డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవీ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య ఉన్నట్లు తెలుస్తొంది. కాగా ఇప్పటికే NLG నుంచి క్యాబినేట్లో ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటన బాధాకరమని అన్నారు. ఇకపై ఇలాంటివి జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పంపిణీ విషయంలో జిల్లాలోని MEOలు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ ద్వారా తగు సూచనలు చేశారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణంలో తాజా కూరగాయలు, నాణ్యమైన వంట దినుసులతో శుభ్రం చేసిన వంట పాత్రలలో వండాలన్నారు. వండిన భోజనాన్ని ముందుగా హెచ్ఎం, మధ్యాహ్న భోజన ఇంచార్జీ రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు అందజేయాలని అన్నారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలను డిసెంబర్ 7వ తారీకు నుంచి నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం నిర్వహిస్తామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.