India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NOV 25న ప్రారంభమైన GNM పరీక్షలు గురువారంతో ముగిశాయని నల్గొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణ పర్యవేక్షణలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండటంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదిలో రెండింతల సాగు పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు రాయితీలు ఇస్తోంది. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి (M)లో వ్యక్తిని <<14800753>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసులు, తండావాసుల వివరాల ప్రకారం.. భీమ్లాతండాకు చెందిన పాచ్యానాయక్(32) లారీ డ్రైవర్. కాగా, నిన్న సుల్తాన్పూర్ తండా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. గ్రామానికి చెందిన కొందరితో పాచ్యాకు భూవివాదాలు ఉన్నాయని, గొడవలు జరిగాయని, వారే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదైంది.
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ. 9గం.లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డూ, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
ములుగు(D) వాజేడు SI హరీశ్కు సూర్యాపేటకు చెందిన యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె గురించి వాకబు చేయగా గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. పెళ్లి ఇష్టంలేదని, సెటిల్మెంట్ కోసం ఆమెను హరీశ్ రిసార్ట్కు పిలిచారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించింది. దీంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నారు.
ఇంట్లోకి ఇద్దరు చొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు. అనంతరం వారు వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు.
గ్రామస్థాయి స్థానిక సంస్థలలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి, నియమ నిబంధనల ప్రకారం 2025- 26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె జడ్పీ సమావేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి రూపొందించే కార్యచరణ ప్రణాళిక పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
బంతి తోట సాగుతో మంచి లాభాలు వచ్చాయని బంతితోట సాగు రైతు మేకపోతుల వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు నడిగూడెం నుంచి రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో కొంత 0.50 సెంట్లలో బంతితోట సాగు చేశారు.కింటాకు రూ.5,000 – 6000 ధర పలుకుతుందని తెలిపారు. బంతి తోట సాగు చేయాలని నిర్ణయించుకొని వరికి బదులుగా బంతితోట సాగు చేయటంతో లాభసాటిగా ఉందన్నారు.
డీఈఈ సెట్ 2024 సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభమవుతుందని NLG డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. NLG డైట్ కళాశాలలో 5న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. 7 నుంచి 9 వరకు ర్యాంకుల ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 13వ తేదీన సీట్ల కేటాయించనున్నామని తెలిపారు. సీటు పొందిన వారు 13 నుంచి 17వ తేదీ వరకు కాలేజీలో రిపోర్టు చేయాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూర్యాపేట, అంజనపురి కాలనీ, మునగాల, నకిరేకల్, చౌటుప్పల్, మిర్యాలగూడ, కొదాడ, ఏన్కూర్, భువనగిరి, ఆత్మకూరు, సిరికొండ, పానగల్, తిరుమలగిరి పలు చోట్ల భూమి కంపించింది. ఉదయం 7:30 గంటలకు 3 సెకన్ల కంపించినట్లు తెలుస్తోంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీ ప్రాంతంలోనూ భూమి కంపించిందా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.