Nalgonda

News December 4, 2024

త్వరలో నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన 

image

త్వరలో నల్గొండ జిల్లాలో  సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంగళవారం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో హెలిప్యాడ్ స్థలాన్ని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎల్. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎల్. వెంకటేశ్వర రావు, ఆర్ఐ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

News December 4, 2024

అవినీతి నిరోధక పోస్టర్‌ విడుదల చేసిన కలెక్టర్

image

డిసెంబరు 3నుండి 9వరకు జరిగే అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోస్టర్‌లను విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో అవినీతి రహిత సమాజం ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు.  రాష్ట్ర సీఎం కలలుగన్న బంగారు తెలంగాణకు అవినీతి రహిత సమాజం దారి చూపుతుందని ఉద్ఘాటించారు. ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.

News December 3, 2024

బండి సంజయ్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న..

image

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని తీన్మార్ మల్లన్న కలిసి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కులగణన పూర్తయితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అన్నారు. ఎవరెంతో వాళ్లకు అంత వాటా అన్ని రంగాలలో దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బండిని కలిసిన వారిలో పిల్లి రామరాజు, వట్టే జనయ్య, తమ్మడ బోయిన అర్జున్ తదితరులు ఉన్నారు.

News December 3, 2024

నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

image

సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నానని.. కాలేజీ యజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్టూడెంట్ చెప్పింది. కాగా ఆమె ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థినిని కలెక్టర్ తేజస్ నందలాల్ పరామర్శించారు.

News December 3, 2024

NLG: ఉపసర్పంచ్‌ చెక్ పవర్ తొలగిస్తే పోటీ ఉంటుందా!

image

సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీరాజ్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ తొలగింపు. సర్పంచ్ అవ్వాలనుకున్నవారు పోటీ చేసే అవకాశం రాకపోతే కనీసం ఉప సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం చెక్ పవర్ తొలగింపు నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి NLG జిల్లాలో సర్పంచ్ పదవి కోరుకునే వారికి ఇంట్రస్ట్ ఉంటుందా.. మీరేమంటారు..

News December 3, 2024

ప్రజాపాలన అధికారిక లోగోను ఉపయోగించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ఆమోదించిన ప్రజా పాలన విజయోత్సవాల అధికారిక లోగోను అన్ని ప్రింట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఉపయోగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజా పాలనపై సమీక్షించారు.

News December 3, 2024

ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దు : కలెక్టర్

image

ఫిర్యాదుదారులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అనవసరంగా కాలయాపన చేయకుండా ఫిర్యాదులు పరిష్కరించాలని అన్నారు

News December 2, 2024

మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు భారంగా ‘!

image

జిల్లాలో కోడిగుడ్డు ధరలు మరింత పెరిగాయి. ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుడ్డు ధర రూ.6లు ఉండగా ఇప్పుడు రూ.7కు చేరింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం 3 రోజులు కోడి గుడ్లు విద్యార్థులకు అందించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో గుడ్డుకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో తమపై అదనపు భారం పడుతుందన్నారు.

News December 2, 2024

పెళ్లి ఇష్టం లేక యువకుడి సూసైడ్..

image

నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు <<14758454>>ఆత్మహత్య చేసుకున్నాడు.<<>> గ్రామానికి చెందిన వేణుకుమార్ రెడ్డి(29)కి ఇటీవలే నిశ్చితార్థం కాగా శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఇష్టం లేకనే చనిపోతున్నానని వేణు అతని అన్న ప్రవీణ్‌కు వాయిస్ మేసేజ్ పంపాడు. అతను స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లేలోపే సూసైడ్ చేసుకున్నాడు.

News December 1, 2024

కోదాడ: బావిలో పడి విద్యార్థి మృతి

image

అనంతగిరి మండలం శాంతినగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వీరబాబు వ్యవసాయ బావిలో స్నానానికి దూకగా, అతనితోపాటు విద్యార్థి తిరుమలేష్ దూకాడు. ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు.