India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థినులతో, మహిళా ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని DEO సస్పెండ్ చేశారు. ఆయన వివరాల ప్రకారం.. ఈనెల 8న సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం పాఠశాలలో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గణిత టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 9, 10వ తరగతి విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు తెలపడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు NLG, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధాన్యం క్వింటాకు రూ.2150 నుంచి 2300 వరకే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు ప్రారంభంలో రూ.2500 పైచిలుకు చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతుండడంతో ధాన్యం ధరలు పూర్తిగా తగ్గించు కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలిపారు.
సత్యం పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నడిమి తండాకు చెందిన లావుడి హరి, నీలమ్మ కూతుర్లు గాయత్రి, ప్రియాంక బాస్కెట్ బాల్ పోటీల్లో రాణిస్తున్నారు. నవంబర్ 9 తేదీ మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్ -19 స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు. మారుమూల తండా నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచడం పట్ల కుటుంబ సభ్యులు, తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ రైస్ మిల్లుల యజమానులను కోరారు. 110 రైస్ మిల్లుల వద్ద పోలీసులను ఏర్పాటు చేశామని, రైతులు దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని, ధాన్యం అమ్మకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లుల యజమానులను కోరారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మునుగోడు మండలంలో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. గ్రామస్థులు వివరాలిలా.. చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రం (70)కు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు నరసింహ మద్యం మత్తులో గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. హత్యకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,320 కన్నా తక్కువగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎవరైనా రైస్ మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మిల్లును సీజ్ చేయడంతో పాటు, ఆ మిల్లుకు సంబంధించిన అన్ని రకాల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.
నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం 20,324, ఆదివారం 30,168 గృహాలను సర్వే చేశారు. రెండు రోజుల్లో మొత్తం 50,492 ఇండ్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎన్యుమరేటర్లను ఆదేశించారు.
NLG: జిల్లాలో ఎవరైనా రైస్ మిల్లర్ మద్దతు ధర కన్నా తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. అంతేగాక అన్ని రకాల లైసెన్స్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర, బోనస్ ను పొందాలని సూచించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎవరు ఓటీపీ లేదా లింకులు అడగరని, అలాగే ప్రజలు లింకులు, ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని లక్ష్మీపురం, గాంధీనగర్ వీధులలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు సర్వే ఎలా చేస్తున్నారు పరిశీలించారు.
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆదివారం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి అనిల్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా అనిల్ స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి విహారయాత్ర కోసం వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.