Nizamabad

News December 16, 2024

దోమకొండ: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదనే మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమకొండలో ఆదివారం రాత్రి జరిగింది. SI ఆంజనేయులు వివరాలిలా..బోయిన రాకేశ్ (26) కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికెళ్లింది. ఎంతకైనా రాకపోవడంతో మనోవేదనకు గురైన రాకేశ్ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 16, 2024

NZB: పార్కింగ్ విషయంలో గొడవ.. యువకుడి మృతి

image

పార్కింగ్ విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన NZBలో చోటుచేసుకుంది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 1 టౌన్ పరిధిలోని గోశాల వద్ద బైక్ పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రకాంత్ పక్కనే ఉన్న మురుగు కాలువలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News December 16, 2024

NZSR: అదృశ్యమైన మహిళ శవమై కనిపించిది

image

నిజాంసాగర్‌ PS పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు శవమై కనిపించింది. SI శివకుమార్ వివరాల ప్రకారం.. బంజేపల్లికి చెందిన కుర్మ భూమవ్వ(70)కు కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలో ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబీకులు ఆమె కోసం గాలించారు. ఆదివారం బంజేపల్లి గ్రామ శివారులో శవమై కనిపించినట్లు SI వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News December 16, 2024

KGBVలకు డైట్ ఛార్జీలు వర్తింపజేయాలి: కవిత

image

KGBVలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపజేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె సారంగపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మాట్లాడారు. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప జేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ పౌష్ఠికాహారం అందించాలని కోరారు.

News December 15, 2024

నిజామాబాద్: గ్రూప్-2అభ్యర్థులకు కీలక సూచన

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్‌లో 63 పరీక్ష కేంద్రాల్లో 19854, కామారెడ్డిలో 19 కేంద్రాల్లో 8085 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధన అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తారని అధికారులు స్పష్టం చేశారు.

News December 15, 2024

కామారెడ్డి: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ

image

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామన్ డైట్ మెనూ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

News December 14, 2024

NZB: గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 15,16వ తేదీల్లో జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు NZB కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం తెలిపారు. రెండు రోజుల పాటు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందు కోసం 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News December 14, 2024

కామారెడ్డి: గ్రూప్‌-2 సన్నాహక సమావేశంలో అడిషనల్ కలెక్టర్

image

కామారెడ్డి పట్టణ కేంద్రంలో రేపు జరగనున్న గ్రూప్-2 పరీక్షా సన్నాహక సమావేశంలో  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాందీపని డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సూచనలు తప్పక పాటించాలని అన్నారు. అభ్యర్థులతో ఎవ్వరూ మాట్లాడకూడదని సూచించారు. ఈ సమావేశంలో రెండు సెంటర్ల ఇన్విజిలేటర్‌లు పాల్గొన్నారు.

News December 14, 2024

కామారెడ్డి: దొంగ నోట్ల ముఠా అరెస్ట్

image

దొంగ నోట్లు తయారు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా SP సింధుశర్మ తెలిపారు. హైదరాబాదులో దొంగ నోట్లను ముద్రిస్తూ బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో చలామణికి యాత్నిస్తుండగా పట్టుకున్నట్లు SP చెప్పారు. వారి నుంచి రూ.56.90 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను, ప్రింటర్, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

News December 14, 2024

నిజామాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. శుక్రవారం జుక్కల్ 9.4 డిగ్రీలు, మెండోరా 10.6, కోటగిరి 10.6, బిచ్కుంద 10.7, పోతంగల్ 10.8, మేనూర్ 11.1 , గాంధారి 11.2, మాచారెడ్డి 11.4, బీర్కూర్ 11.5, పాల్వంచ 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.