India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో రైతు బజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్లో నిన్న రాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్ SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. MHలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు చెందిన ఓంకార్(24) ఖలీల్వాడీలోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ముఠాల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిజామాబాద్లో ఇటీవల రెండు ఏటీఎంలు గ్యాస్ కట్టర్తో కాల్చి రూ.36 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అది జరిగిన రెండో రోజు మళ్లీ నిజామాబాద్, జక్రాన్పల్లిలలో రెండు ఏటీఎంల లూటీకి విఫలయత్నం చేశారు. సీరియస్గా తీసుకున్న సీపీ సాయి చైతన్య ఐదు బృందాలతో మహారాష్ట్ర, హర్యానాలో నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.

ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు గెలుపోటములను మార్చే అవకాశం ఉంది. దీంతో ఆర్మూర్లోని ఓటర్ల జాబితా సవరించాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణికి రెండు పార్టీలు వినతిపత్రాలు అందజేశాయి. ఆధార్కు అనుగుణంగా అలాగే ఏ వార్డులో ఉన్న కుటుంబాలకు అందులోనే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశాయి.

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.

నూతన సంవత్సర సందర్భంగా నిజామాబాద్ సీపీ సాయి చైతన్య గురువారం చిన్న పిల్లల అనాధాశ్రమాలను సందర్శించారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అక్కడి పిల్లలకు పెన్నులు, నోటు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి, టౌన్ –IV SHO సతీష్, టౌన్ –III, ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 130 మంది వాహనదారులు పట్టుబడ్డారని జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ విభాగం పరిధిలో డిసెంబర్ 31 రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.