Nizamabad

News August 17, 2025

NZB: 638 సంఘాలు.. రూ 72.22 కోట్ల రుణాలు

image

నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.

News August 17, 2025

నిజామాబాద్: రూ. 57.98 కోట్ల పెన్షన్ల పంపిణీ

image

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.

News August 17, 2025

NZB: మహాలక్ష్మీ పథకం కింద ఎన్ని కోట్లు ఆదా ఆంటే?

image

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ మహాలక్ష్మి పథకం మహిళా ప్రయాణీకులకు భారీ ఊరటనిచ్చింది. అధికారిక నివేదికల ప్రకారం, పథకం ప్రారంభం నుంచి ఆగస్టు 10 వరకు 6 కోట్ల 8 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీనివల్ల వారికి రూ. 249.13 కోట్లు ఆదాయం ఆదా అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున ప్రతిరోజూ లక్ష మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు.

News August 17, 2025

NZB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంత మందికి వచ్చిందో తెలుసా?

image

నిజామాబాద్ జిల్లాలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఊతమిచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి కింద 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా, షాదీ ముబారక్ ద్వారా 672 మంది లబ్ధిదారులకు రూ.6.72 కోట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.17.53 కోట్లు పంపిణీ అయినట్లు పేర్కొన్నారు.

News August 17, 2025

NZB: ‘0’ బిల్లు సబ్సిడీ నిధులు ఎంతంటే?

image

నిజామాబాద్ జిల్లాలో గృహ జ్యోతి పథకం కింద మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు 2,67,707 మందికి ‘0’ బిల్లుతో ఉచిత విద్యుత్తు అందించి, ప్రభుత్వం రూ. 165.30 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. నాయీ బ్రాహ్మణ, రజక వృత్తులకు చెందిన 3,023 మందికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇచ్చారు. సీఎం గిరి వికాస్ పథకం కింద 78 మంది రైతులకు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.

News August 17, 2025

రాష్ట్రంలోనే నిజామాబాద్ ఫస్ట్

image

ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 వానాకాలం సీజన్‌లో 676 కేంద్రాల ద్వారా 78,488 మంది రైతుల నుంచి 4.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,140 కోట్లు చెల్లించారు. అలాగే, యాసంగిలో 700 కేంద్రాల ద్వారా 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని రూ.1,949 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

News August 17, 2025

NZB: ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

NZB నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందారు. దీంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టాయి. ఆర్మూర్‌కు చెందిన సాయికుమార్(26) రోడ్డు ప్రమాదంలో గాయపడగా చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకుని ట్రీట్మెంట్ ప్రారంభించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.

News August 16, 2025

NZB: సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి: కలెక్టర్

image

NZB కలెక్టరేట్‌లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్‌లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌ 08462 220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

News August 16, 2025

ALERT.. గోదావరి పరీవాహక ప్రజలకు హెచ్చరిక

image

కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ డ్యామ్ సైట్ EE M.చక్రపాణి హెచ్చరించారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు.

News August 15, 2025

NZB: దారుణం.. కన్న కూతురిపైనే అత్యాచారాయత్నం

image

నవీపేట్ మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కన్నకూతురి పైనే లైంగిక దాడికి యత్నించాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. మద్యానికి బానిసైన అతడు కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 ఏళ్ల కూతురికి ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇటీవల తల్లి దృష్టికి తీసుకెళ్లగా బంధువులకు చెప్పి పంచాయతీ పెట్టారు. విషయం నిన్న పోలీసులకు చేరగా వారు దర్యాప్తు చేస్తున్నారు.