India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులకు అపార్ గుర్తింపు నమోదులో NZB జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో మొత్తం 62.83 శాతం మందికి అపార్ గుర్తింపు నంబరును జారీ చేయగా మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా ఉంది. ఐదవ స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచినట్లు డీఈవో అశోక్ తెలిపారు. అపార్ మోదులో సమస్యలను పరిశీలించి త్వరలోనే మొదటి స్థానంలో నిలుపుతామని డీఈఓ అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరారు. శుక్రవారం ఆయన్ను కలిసి బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని కోరారు. విగ్రహాన్ని ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామని, రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని పేర్కొన్నారు.
నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి <<16019748>>కిడ్నాపైన <<>>బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్లోని మీర్జాపూర్కు చెందిన గైక్వాడ్ బాలాజీ చిన్నారి రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ACP వివరించారు. ఆయనతో పాటు SHO రఘుపతి ఉన్నారు.
నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్ గ్రామంలో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.
పోతంగల్ మండలం హంగర్గ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరోకరికి తీవ్ర గాయలయ్యాయి. పోతంగల్కి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై హంగర్గ వెళుతుండగా కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన పలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతగానో పని ఒత్తిడితో కూడుకుని ఉండే విధుల్లో కొనసాగుతున్నప్పటికీ జిల్లా జడ్జి సేవా కార్యక్రమాలు జరపడం విశేషమన్నారు.
నిజాంబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను ఆయన తల్లి అంత్యక్రియల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన విషయంలో గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే గురువారం ఆయన దుబాయ్ నుంచి రాగానే అతని వద్ద ఉన్న పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
బోధన్ మాజీ MLA షకీల్ను శంషాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె 2005 వరకు శక్కర్ నగర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. అంత్యక్రియలు శక్కర్ నగర్లో మధ్యాహ్నం జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజామాబాద్తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ ఛబుత్రా’ మళ్లీ ప్రారంభమైంది. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కొంత కాలం పక్కాగా అమలు చేసి తర్వాత వదిలేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఇటీవల మళ్లీ ఆపరేషన్ ఛబుత్రా ను షురూ చేశారు. మంగళవారం సాయంత్రం NZB శాంతి నగర్లో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.