Nizamabad

News March 29, 2025

NZB: అక్రమంగా విక్రయిస్తున్న రెండు గంజాయి పట్టివేత

image

అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.

News March 29, 2025

NZB: కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

image

నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రలో చంద్రకళ(55) అనే మహిళా హత్యకు గురైంది. కూలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన కూతురితో మాట్లాడిన చంద్రకళ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూతురు రమ్య ఇంటికి వచ్చి చూసే సరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 29, 2025

NZB: ‘బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలు పని చేస్తాయి’

image

ఈ నెల 30, 31 తేదీల్లో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు పని చేస్తాయని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఏజీఎం సీతారాం తెలిపారు. 30న ఉగాది, 31 రంజాన్ సందర్భంగా వినియోగదారులకు బిల్లు చెల్లింపు కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు.

News March 28, 2025

NZB: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి: పోచారం

image

వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు.

News March 28, 2025

NZB: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

image

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్‌లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

NZB: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: డీఈవో

image

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒంటి పూట బడుల నేపథ్యంలో రెండు పూటల బడులు నిర్వహించే పాఠశాలల పై ఎటువంటి నోటీసులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు వేసవి కాలంలో రెండు పూటలు బడులు నిర్వహిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలకు ఆయన సూచనలు చేశారు.

News March 28, 2025

NZB: అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం: కలెక్టర్

image

అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు ఉండాలన్నారు.

News March 28, 2025

నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం

image

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది. అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక విలేకర్లు గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. గ్రామంలో విచారించగా వీరు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసింది. మాక్లూర్ పోలీస్‌‌‌లకు సమాచారం అందించగా నిందితుల నుంచి మూడు ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.

News March 28, 2025

NZB: 62 మంది విద్యార్థుల గైర్హాజరు

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెల్లడించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22,904 మంది విద్యార్థులకు అందులో నుంచి 22,842 మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారికంగా వెల్లడించారు.

News March 28, 2025

NZB: అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయి: కవిత

image

అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ర్పచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు.