India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను రాహుల్ గాంధీతో చర్చించడానికి సీఐ ఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర రావు శుక్రవారం రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ కొరకు లేఖ పంపించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులపై చర్చిస్తామన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1085.10 అడుగుల (60.118 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్ లక్ష్మణ్ <<13969284>>సస్పెండ్ <<>>అయిన విషయం తెలిసిందే. వివరాలిలా.. తహశీల్దార్ డబ్బులిస్తేనే పనులు చేస్తారని రైతులు ఆరోపణతో అధికారులు విచారణ చేపట్టారు. గత శుక్రవారం ఓ రైతు వారసత్వ భూమి పట్టామార్పిడికి తహశీల్దార్ను సంప్రదిస్తే మీ సేవ వ్యక్తి మధ్యవర్తిగా రూ.12 వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. దీంతో విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశారు.
నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తరప్రదేశ్లోని మధుర నవోదయ విద్యాలయం నుంచి తొమ్మిదో తరగతి చదివేందుకు వచ్చిన మైగ్రేషన్ విద్యార్థులను తిరిగి మధురకు పంపించారు. వాతావరణం భాష సహకరించక పోవడంతో ఏడుగురు బాలికలను, 15 మంది బాలురు లను తిరిగి మధుర నవోదయ విద్యాలయానికి పంపుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. ఇక్కడ విద్యార్థులు అక్కడికి అక్కడ విద్యార్థులు ఎక్కడికి వెళ్లడం సహజమన్నారు.
ఇద్దరు వ్యక్తులు కలిసి మద్యం మత్తులో ఒకరిపై దాడి చేసిన ఘటన నస్రుల్లాబాద్, వర్ని మండల సరిహద్దులో గురువారం రాత్రి జరిగింది. బాన్సువాడ మండలం కొల్గూరుకు చెందిన ఆంజనేయులును ప్రవీణ్ పని నిమిత్తం వర్నికి తీసుకెళ్లారు. దారిలో ప్రవీణ్, ఆంజనేయులు, వర్నికి చెందిన మరో వ్యక్తి కలిసి మద్యం తాగారు. అనంతరం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆంజనేయులుపై కర్ర, బ్లేడ్తో ప్రవీణ్ మరో వ్యక్తి కలిసి దాడి చేశారు.
రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోందని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు కితాబు ఇచ్చారు. ఆయన గురువారం ఓ మీడియా ఛానల్తో డిబేట్ పాల్గొన్నారు. ‘గత పదేళ్లుగా లంచాలు తీసుకొని BRS నేతలు అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించారని అన్నారు. పదేళ్లలో చెరువులను పరిరక్షించే పనులు BRS ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆక్రమణలు చేసిన నేతలు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ వారిని వదిలి పెట్టదని ఆయన స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వం ఆధీనంలోని దీనదయాళ్ వికలాంగ పునరావాస పథకం, సమీకృత వృద్ధుల సంక్షేమ పథకం నుంచి జిల్లాలోని ఎన్జీవోలకు సహాయం మంజూరి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 16లోగా తమ దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా సంక్షేమ శాఖ రూం నెంబర్ 31లో సమర్పించాలని కోరారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్ లక్ష్మణ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 15 రోజులుగా రైతులు MRO ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఎల్లారెడ్డి RDO మన్నే ప్రభాకర్ విచారణ జరిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో లక్ష్మణ్ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని RDO తెలిపారు.
పెళ్లిలో మటన్ కోసం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరఫు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన నవీపేట్లో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు తరఫు వారికి మటన్ తక్కువగా వేశారని గొడవ పడ్డారు. దీంతో కర్రలు, రాళ్లతో దాడి చేసుకొన్నారు. కాగా ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
NZBలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రూరల్ CI నరేశ్ వివరాల ప్రకారం.. కుమార్ గల్లీకి చెందిన రాజేశ్(19), మాక్లూర్కు చెందిన వంశీ(18), దుబ్బకు చెందిన ఆకాశ్(19) మంగళవారం ఓ కారు అద్దెకు తీసుకొని నగరానికి వెళ్లారు. బుధవారం వంశీని దించేందుకు మక్లూర్ వెళ్తుండగా కొండూరు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. రాజేశ్, వంశీ అక్కడికక్కడే మృతిచెందగా, ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Sorry, no posts matched your criteria.