India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZBలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రూరల్ CI నరేశ్ వివరాల ప్రకారం.. కుమార్ గల్లీకి చెందిన రాజేశ్(19), మాక్లూర్కు చెందిన వంశీ(18), దుబ్బకు చెందిన ఆకాశ్(19) మంగళవారం ఓ కారు అద్దెకు తీసుకొని నగరానికి వెళ్లారు. బుధవారం వంశీని దించేందుకు మక్లూర్ వెళ్తుండగా కొండూరు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. రాజేశ్, వంశీ అక్కడికక్కడే మృతిచెందగా, ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు.
*NZB రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి* నందిపేట్ లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి* ఎల్లారెడీ విద్యుత్ షాక్ తో చిరుత మృతి.. పాతిపెట్టిన రైతు* పిట్లం డాక్టర్ ని నిర్బంధించిన రోగి* కౌలాస్ లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి* NZB, GGH ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతి* కామారెడ్డి చికిత్స పొందుతూ వ్యాపారి మృతి* NZB రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి* కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత*
18 ఏళ్లు దాటని పిల్లలకు బైకులు ఇవ్వకూడదని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని కావున తప్పనిసరిగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ సూచించారు. పోలీసులు కూడా హెల్మెట్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు ఉద్భోదించారు. బుధవారం కలెక్టర్ మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి, వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో మాక్లూర్కు చెందిన శ్రీకాంత్తో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో తపాలా శాఖ ఆధ్వర్యంలో 6-9వ తరగతి విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న జరిగే పోటీలో ఎంపికైనా వారు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫలితాలను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. గెలుపొందిన విద్యార్థుల ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల ఉపకార వేతనం జమచేస్తారు. NZB, KMR, ఆర్మూర్ పోస్ట్ ఆఫీసుల్లో పోటీకి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.
తీహర్ జైలు నుంచి విడుదలైన తర్వాత MLC కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తనను అనవసరంగా జైలుకు పంపి జగమెుండిని చేశారన్నారు. ‘నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. మెుండిదాన్ని.. మంచిదాన్ని’ అని పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో చెల్లిస్తానని అన్నారు.
తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు వివరాలను పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య. ఎం. అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజును సెప్టెంబర్ 4వ తేది లోపు చెల్లించాలని, 100 రూపాయల అపరాధ రుసుముతో వరకు చెల్లించ వచ్చునని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్ సైట్ ను చూడాలని ఆమె కోరారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.5TMC)గాను మంగళవారం రాత్రి 7 గంటలకు 1084.6 అడుగులకు (58.709 TMC) నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 24,014 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోందని ఔట్ ఫ్లోగా 4,459 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.