Nizamabad

News August 6, 2025

NZB: సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవం: కవిత

image

రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తోందని సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

News August 6, 2025

NZB: పోలీసు శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

image

నిజామాబాద్‌లోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు డీసీపీ బస్వారెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 1934 ఆగస్టు 6న వరంగల్‌లోని ఆత్మకూరు మండలం, అక్కంపేటలో జయశంకర్ జన్మించారన్నారు. ఆయన జీవితం తెలంగాణకు అంకితం చేశారన్నారు.

News August 6, 2025

SRSP UPDATE: తగ్గుముఖం పట్టిన ఇన్ ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా ఇన్ ఫ్లో మరింతగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్ట్‌లోకి 4,022 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు 2,620 క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో 793 క్యూసెక్కులుగా ఉంది. 1,078.30 (40.582TMC) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

News August 6, 2025

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్‌పల్లి నుంచి వీసీలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.

News August 5, 2025

UPDATE.. SRSPకి పెరుగుతున్న ఇన్ ఫ్లో

image

శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఉదయం 11 గంటలకు 2,850 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా మధ్యాహ్నం 3 గంటలకు 4,150 క్యూసెక్కులకు పెరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దిగువకు 793 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు. ప్రస్తుతం SRSPలో 1,078.30 అడుగుల (40.582TMC) నీటిమట్టం ఉందన్నారు.

News August 5, 2025

బాన్సువాడ: తారాస్థాయికి వర్గపోరు

image

బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడంతో బాన్సువాడలో వర్గపోరుకు ఆజ్యం పడింది. పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, మాజీ MLA, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. మంత్రిసీతక్క సాక్షిగా చందూర్లో ఇరువర్గాలు రెచ్చిపోవడం అధిష్టానం దృష్టికి వెళ్లింది.

News August 5, 2025

కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు వివరించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

News August 4, 2025

NZB: కాళేశ్వరం నివేదికపై స్పందించిన కవిత

image

కాళేశ్వరం నివేదికపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరును 35 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదన్నారు. కమిషన్ నివేదికతో కేసీఆర్‌కు ఏం కాదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కమిషన్ నివేదికను బయట పెట్టారన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. కమిషన్ మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించ లేదని ప్రశ్నించారు.

News July 11, 2025

NZB: కలెక్టర్ గారూ.. ఆ PAపై చర్యలు తీసుకోండి

image

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతారు చేస్తూ ప్రజా ప్రతినిధికి పర్సనల్ అసిస్టెంట్(PA)గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మహాజన సోషలిస్ట్ పార్టీ(MSP) NZB జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్పల్లి మండలం మైలారం ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న గడ్డం శ్రీనివాస్ రెడ్డి సెలవులు పెడుతూ PAగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

News July 11, 2025

SRSP UPDATE: 20.318 TMCల నీటి నిల్వ

image

SRSP ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 TMC) అడుగులకు గాను శుక్రవారం ఉదయానికి 20.318 TMC (1068.10 అడుగులు)ల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 4,309 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 231 క్యూసెక్కుల నీరు పోతున్నదన్నారు.