Nizamabad

News August 27, 2024

బాన్సువాడ: ‘సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడు’

image

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డ్యూటీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు శంకర్, కృష్ణవేణి ఆరోపించారు. సోమవారం జ్వరంతో ఉన్న తమ కుమారుడు హేమంత్ (3)ను ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. రాత్రి హేమంత్ ఏడుస్తున్నాడని సిబ్బందికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో మంగళవారం ఉదయం తమ కుమారుడు మృతి చెందాడని వారు తెలిపారు.

News August 27, 2024

సదాశివ‌నగర్‌లో డెంగ్యూతో ఎవరూ మృతి చెందలేదు: వైద్యాధికారి

image

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూతో ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల రన్విత్ (9), మాన్విశ్రీ (12)లకు తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కాగా వారికి మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంతోనే చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. సదాశివనగర్‌కు చెందిన నరేశ్ షుగర్ సమస్యతో మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు.

News August 27, 2024

NZB: 11 మంది నేషనల్ అథ్లెటిక్స్ మెడల్ విజేతలకు క్యాష్ అవార్డు

image

జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించిన జిల్లాకు చెందిన 11 మంది విజేతలకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శీను నాయక్ క్యాష్ అవార్డులు అందజేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్‌లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన 11 మంది కలిసి మొత్తం 17 మెడల్స్ సాధించారు. రాష్ట్ర సంఘం ప్రకటించిన విధంగా నగదును జిల్లా విజేతలకు అందజేశారు.

News August 26, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
* జిల్లాలోని పలు దేవాలయాలకు భక్తుల తాకిడి
* చందూర్: ఘన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ?
* ఎల్లారెడ్డి: చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
* NZB: రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి: CPM జిల్లా కార్యదర్శి రమేష్
* వేల్పూర్: కూలిన పాఠశాల ప్రహరీ
* ఆర్మూర్ RTC బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన MLA రాకేష్ రెడ్డి
* SRSP కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

News August 26, 2024

NZB: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

NH-161 పై ప్రమాదం.. కామారెడ్డి వాసి మృతి

image

సంగారెడ్డి జిల్లా నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన శ్రీనివాస్(27), సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.

News August 26, 2024

NZB: నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు బంద్

image

నేడు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు నిర్వహించవద్దని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని చేపలు, మేకల మాంసం విక్రయాలు, చికెన్ సెంటర్లు, ఇతర మాంసాహార దుకాణాల నిర్వాహకులు ఈ విషయం గమనించాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వును తూ.చా తప్పక పాటించాలన్నారు.

News August 26, 2024

నేడు ప్రజావాణి కార్యక్రమం లేదు: జిల్లా కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి ఎవరూ రావొద్దని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News August 25, 2024

NZB: ఆహారంలో బొద్దింక.. రూ. 5 వేల జరిమానా

image

నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న వ్యక్తి ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్‌కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందిని హోటల్‌కి పంపించాడు. ఆహారంలో బొద్దింక ఉందని వారు నిర్ధారించడంతో ఆయన హోటల్ యాజమాన్యానికి నోటీస్‌తో పాటు రూ.5వేలు జరిమానా విధించారు.

News August 25, 2024

SRSPఅప్డేట్: 31,202 క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. శనివారం రాత్రి 29,443 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ఆదివారం ఉదయం 10 గంటలకు 31,202 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 3,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వాటిలో కాకతీయ కెనాల్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను ప్రస్తుతం 53.620 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.