Nizamabad

News August 23, 2024

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలే: CP

image

U/S 163 BNSS ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. రేపు ఛలో ఆర్మూర్ పేరిట రైతుల ఆందోళన నేపథ్యంలో CP శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రజలు ఏదైనా చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ ఉత్తర్వులు 25వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయన్నారు.

News August 23, 2024

NZB: సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోండి: DEO

image

జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్‌లో 6వ తరగతిలో సీట్లకు ప్రవేశ పరీక్షల కోసం సెప్టెంబర్ 9లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ DEO దుర్గాప్రసాద్ తెలిపారు. దరఖాస్తులను www.navodaya.gov.in, www.nvsadmission classnine.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

News August 23, 2024

NZB: మూడేళ్లలో మురుగుకాలువల్లో పడి ముగ్గురు మృతి

image

ఈ నెల 21న నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో మూడేళ్ల చిన్నారి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గత మూడేళ్లలో కాలువలో పడి మృతి చెందిన వారి సంఖ్య మూడుకి చేరింది. 2023లో గౌతంనగర్‌లో 70 ఏళ్ల వృద్ధురాలు, 2022లో అదే కాలనీకి చెందిన 8 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు.

News August 23, 2024

కామారెడ్డి జిల్లాలో 12,603 కుక్కలు 

image

ఈ మధ్య కాలంలో జిల్లాలో వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 526 గ్రామపంచాయతీల్లో అధికారులు సర్వే నిర్వహించి కుక్కలను లెక్కించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 22 మండలాల్లో 12,603 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. సంతాన నిరోధానికి ఆడ కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

News August 23, 2024

త్రిపుర గవర్నర్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హైదరాబాద్ నగరంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పలు అంశాల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.

News August 22, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*నిజామాబాద్‌లో గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా
*బోధన్:కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి
*కామారెడ్డి: రైలు కింద పడి యువకుడి మృతి
*HYD ఈడీ కార్యాలయం ముందు నిరసనలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
*రేవంత్ రెడ్డిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
*బాన్సువాడ, బోధన్‌కు సబ్ కలెక్టర్ల నియామకం

News August 22, 2024

బాన్సువాడ, బోధన్‌కు నూతన సబ్ కలెక్టర్లు

image

ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో 2022 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టి, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సబ్ కలెక్టర్‌గా వికాస్ మహతో నియమితులయ్యారు.

News August 22, 2024

బోధన్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

image

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికుమార్ (22) ఐదు రోజుల క్రితం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందడు. అయితే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి దేవర్ల వెంకటేశ్(54) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News August 22, 2024

కమ్మర్‌పల్లి ఫారెస్ట్‌లో చిరుత మృతి

image

కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుతపులి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుతపులి చనిపోయి ఉందని పశువుల కాపరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత పులి 2 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద అది 2 కూనలతో సంచరించినట్లు కాపరులు తెలిపారు.

News August 22, 2024

తాడ్వాయి: బస్సుల కోసం రోడ్డుపై రాస్తారోకో చేసిన విద్యార్థులు

image

తాడ్వాయి మండలంలో బస్సుల కొరత, సమయానికి సరిపడా బస్సులు రాక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఉదయం వచ్చే బస్సులు సైతం రద్దిగా ఉండడంతో అర్గోండ గ్రామానికి చెందిన విద్యార్థులకు కామారెడ్డికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.