Nizamabad

News March 23, 2025

భీమ్‌గల్: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. యువకుడిపై కేసు

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు భీమ్‌గల్‌లో శనివారం జరిగింది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. మండలానికి చెందిన అక్షయ్ ఇంటి పక్కన నివసిస్తున్న బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెపారు. మైనర్ కావడంతో ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News March 23, 2025

డిచ్‌పల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిచ్‌పల్లి SBI గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ సుంకేం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణకు 19 నుంచి 45 సంవత్సరాలు లోపు NZB, కామారెడ్డికి జిల్లాలకు చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 23, 2025

NZB: చెరువులో పడి ఒకరు మృతి

image

న్యాల్కల్ చెరువులో ప్రమాదవశత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు మోపాల్ SI యాదగిరి గౌడ్ తెలిపారు. మంచిప్ప గ్రామానికి చెందిన గుండం సాయిలు(55) శుక్రవారం రాత్రి తన మిత్రుడితో కలిసి న్యాల్కల్ చెరువులో చేపల పట్టేందుకు వెళ్ళాడు. ప్రమాదశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. శనివారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

జక్రాన్‌పల్లి: ఇస్టాగ్రాంలో పరిచయం.. యువకుడి అరెస్టు

image

AP రాష్ర్టం ఏలూరు జిల్లాకు చెందిన బాలికకు జక్రాన్​పల్లికి చెందిన ఓ యువకుడు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం అయ్యాడు. మూడు నెలల క్రితం ఆమెను జక్రాన్​పల్లికి తీసుకువచ్చాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. నిందితుడికి జక్రాన్​పల్లి మండలం కలిగోట్​కు చెందిన మరో వ్యక్తి సహకరించాడు.

News March 23, 2025

NZB: అంతర్జాతీయ పోటీలకు విద్యార్థిని ఎంపిక

image

భారత అండర్-15 సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగే సాఫ్ట్ బాల్ పోటీల్లో డిచ్‌పల్లి మండలం సుద్దులం గురుకుల పాఠశాలకు చెందిన గన్న హర్షిని పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, తిరుపతి పాల్గొన్నారు.

News March 23, 2025

NZB: డీలిమిటేషన్‌పై ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్

image

ఎన్నికల్లో ఓటమి భయంతోనే డీలిమిటేషన్ విషయంలో డీఎంకే పార్టీ రాద్ధాంతం చేస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు. డీలిమిటేషన్‌తో తమిళనాడు రాష్ట్రానికి కొంత మేర మాత్రమే నష్టం జరుగుతుందన్నారు. తమిళనాడు మినహా దేశంలో ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు.

News March 22, 2025

NZB: పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పరీక్ష నిర్వహిస్తున్న అధికారులతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News March 22, 2025

NZB: బెట్టింగ్ మాఫియాను ఎదుర్కొవడానికి సన్నద్ధం: సీపీ

image

బెట్టింగ్ మాఫియాను ఎదుర్కొవడానికి పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ప్రజలు బెట్టింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. బెట్టింగ్ యాప్‌లు చిన్నపాటి వినోదం కాదని గుర్తించాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరూ ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు లింక్స్ షేర్ చేస్తున్నారు అనే అంశంపై తాము సైబర్ మానిటరింగ్ చేస్తున్నామన్నారు.

News March 22, 2025

నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.

News March 22, 2025

NZB: ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఛైర్మన్‌గా ఈగ సంజీవ్

image

ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏథిక్స్ డిసిప్లేన్ చైర్మన్‌గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఒక ప్రకటన లో తెలిపారు. సంజీవ్ రెడ్డి ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ అంద్యాల లింగయ్యా, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.