Nizamabad

News March 26, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.

News March 26, 2025

బాన్సువాడ: పెళ్లైన నెలకే నవవధువు ఆత్మహత్య

image

బాన్సువాడ కొల్లూరులో లక్ష్మి, వెంకటేశ్‌లకు FEB 23న వివాహం జరిగింది. అయితే ఇష్టంలేని పెళ్లి చేయడంతోనే లక్ష్మి మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ అశోక్ తెలిపారు. సూసైడ్ అటెంప్ట్ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

News March 25, 2025

NZB: ‘మహిళా సంఘాలకు 200 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు’

image

యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గానూ మహిళా సంఘాలకు కనీసం 200పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మహిళా సంఘాలకు ఆయన కీలక సూచనలు చేశారు.

News March 25, 2025

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

News March 25, 2025

నిజామాబాద్: తగ్గిన ఎండ తీవ్రత..

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. సోమవారం మంచిప్పలో 38.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కమ్మర్పల్లిలో 38.7℃, కోటగిరి 38.6, లక్మాపూర్ 38.5, మల్కాపూర్, ఎడపల్లి, గోపనపల్లె 38.4, ధార్పల్లి, మోర్తాడ్ 38.3, పెర్కిట్, వైల్‌పూర్, కోనసమందర్, ఎర్గట్ల 38.2, మోస్రా, భీంగల్, మెండోరా 38.0, ఆలూర్ 37.8, ముప్కల్, బాల్కొండ 37.7, నిజామాబాద్ 37.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 25, 2025

BJP స్టేట్ చీఫ్‌గా ఎంపీ అర్వింద్?

image

ఉగాదిలోపు తెలంగాణ బీజేపీకి కోత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే బీసీ నేతను నియమిస్తారా.. లేక ఓసీకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. డీకే అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News March 25, 2025

NZB: కాంగ్రెస్ రెండు గ్రూపుల వర్గపోరుపై అధిష్టానం నజర్

image

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల వర్గపోరుపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ ప్రతినిధికి, ఇటీవల పార్టీలో చేరిన ప్రతినిధికి మధ్య జరుగుతున్న వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో పలువురు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. BRS హయాంలో కష్ట కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని వాపోతున్నారు.

News March 25, 2025

NZB: అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించిన పల్లె గంగారెడ్డి

image

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి సోమవారం అస్సాం రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అస్సాం, త్రిపుర రాష్ట్రాల సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజుని కలిశారు. అనంతరం ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అక్కడి రాష్ట్రాల్లో పసుపు పంట సాగు గురించి అలాగే పసుపు ఉత్పత్తుల గురించి చర్చించి పలు విషయాలను తెలుసుకున్నారు.

News March 25, 2025

NZB: 31లోగా దరఖాస్తు చేసుకోవాలి

image

ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా వివిధ క్రీడాంశాలలో ఆసక్తి గల వారు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జే.ముత్తన్న తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో 10 వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 25, 2025

NZB: ‘ఉద్యోగులకు గౌరవవేతనం ఇప్పించండి’

image

వివిధ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు గౌరవ వేతనం వెంటనే ఇవ్వాలని కోరుతూ టీజీవో జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అలక కిషన్, అమృత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని.. వెంటనే సెక్షన్ ఆఫీసర్‌తో సమీక్షించి ఆలస్యం చేయకుండా ఎన్నికల అధికారి నివేధిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.