Nizamabad

News December 14, 2024

కామారెడ్డి: గ్రూప్‌-2 సన్నాహక సమావేశంలో అడిషనల్ కలెక్టర్

image

కామారెడ్డి పట్టణ కేంద్రంలో రేపు జరగనున్న గ్రూప్-2 పరీక్షా సన్నాహక సమావేశంలో  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాందీపని డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సూచనలు తప్పక పాటించాలని అన్నారు. అభ్యర్థులతో ఎవ్వరూ మాట్లాడకూడదని సూచించారు. ఈ సమావేశంలో రెండు సెంటర్ల ఇన్విజిలేటర్‌లు పాల్గొన్నారు.

News December 14, 2024

కామారెడ్డి: దొంగ నోట్ల ముఠా అరెస్ట్

image

దొంగ నోట్లు తయారు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా SP సింధుశర్మ తెలిపారు. హైదరాబాదులో దొంగ నోట్లను ముద్రిస్తూ బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో చలామణికి యాత్నిస్తుండగా పట్టుకున్నట్లు SP చెప్పారు. వారి నుంచి రూ.56.90 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను, ప్రింటర్, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

News December 14, 2024

నిజామాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. శుక్రవారం జుక్కల్ 9.4 డిగ్రీలు, మెండోరా 10.6, కోటగిరి 10.6, బిచ్కుంద 10.7, పోతంగల్ 10.8, మేనూర్ 11.1 , గాంధారి 11.2, మాచారెడ్డి 11.4, బీర్కూర్ 11.5, పాల్వంచ 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 14, 2024

NZB: ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్: మంత్రి హెచ్చరిక

image

సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.

News December 14, 2024

NZB: కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యం: మంత్రి

image

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ, రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు.

News December 14, 2024

ఎత్తిపోతల పనులకు నిధులు విడుదల చేయండి: ఆర్మూర్ ఎమ్మెల్యే

image

నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్(SRSP) పై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల నిర్మాణం, మరమ్మతుల పనులకు నిధులు విడుదల చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. 

News December 13, 2024

నిజామాబాద్: పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని పండుగల నిర్వహించి విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టర్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

News December 13, 2024

బిచ్కుంద ఐటీఐ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

బిచ్కుంద ఐటీఐ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఐటీఐలో అడ్మిషన్ కాకముందు ఏం చదివారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ కాలంలోనే స్వయం ఉపాధి, ఉద్యోగం సాధించవచ్చునని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

News December 13, 2024

కామారెడ్డి: పాల బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేత

image

రైతులకు పెండింగ్ పాల బిల్లుల ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి డీడీసీఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ అమిత్‌రెడ్డికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు పాల బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చూడాలని కోరారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఛైర్మన్ అమిత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

News December 13, 2024

నిజాంసాగర్: రైతు సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగుచేసిన రాష్ట్రాల్లో TG మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. నాగమడుగు ఎత్తి పోతల పథక పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని మంత్రి హామి ఇచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టు‌కు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.